కౌన్సిల్‌లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత

తెలంగాణ శాసన మండలి సభ్యుల లాంజ్‌లో కవిత వ్యాఖ్యలు

On
కౌన్సిల్‌లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత

హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):


తాను చేసిన రాజీనామాను కౌన్సిల్‌లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్‌ను కోరనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “కేసీఆర్‌ను ఉరి తీయాలి అన్నట్లు మాట్లాడటం అత్యంత అనుచితం. రేవంత్ రెడ్డి మాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని కవిత మండిపడ్డారు. పాలమూరు ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికే తన స్వరం అని తెలిపారు.IMG_20260102_140615

పాలమూరు–రంగారెడ్డి ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై స్పందిస్తూ, “అక్కడ జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేయడం సరైంది కాదు” అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో వివరించాలని డిమాండ్ చేశారు.

హరీశ్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. “హరీశ్ రావు పాలమూరులో ప్యాకేజీలు అమ్ముకున్నారు. ఆయన మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ లా మారుతోంది. గతంలో రేవంత్ రెడ్డితో ఆయన చాంబర్‌లో జరిగిన చర్చలన్నీ అందరికీ తెలుసు” అన్నారు.

బీఆర్ఎస్ పట్ల తనకు మనసు విరిగిపోయిందని, కేసీఆర్ పిలిచినా మళ్లీ ఆ పార్టీలో చేరే ప్రశ్నే లేదని కవిత స్పష్టం చేశారు. “నేను మొదటి నుంచీ స్వతంత్రంగా పని చేశాను. జాగృతి జెండాతోనే ముందుకు సాగుతాను. తెలంగాణకు స్వతంత్ర రాజకీయ శక్తి అవసరం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నా సొంత పార్టీతోనే పోటీ చేస్తాను” అని ప్రకటించారు.

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. “గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన తండాల్లో కొత్తగా ఒక్క కరెంట్ పోల్ కూడా వేయడం లేదు. మిషన్ భగీరథను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

More News...

National  State News 

కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత

కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే...
Read More...
State News 

కౌన్సిల్‌లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత

కౌన్సిల్‌లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు): తాను చేసిన రాజీనామాను కౌన్సిల్‌లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్‌ను కోరనున్నట్లు...
Read More...

తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్

తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్       బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు) బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు  స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే  చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon 
Read More...

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న? హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్‌గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది....
Read More...
National  International   State News 

బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి

బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి ఢాకా జనవరి 01: భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్‌కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో...
Read More...
National  Comment  State News 

అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?

అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు? న్యూ ఢిల్లీ జనవరి 01: దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం...
Read More...

జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు)  నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్...
Read More...

ఉత్తమ సేవ పథకాల కి  ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ  అశోక్ కుమార్ 

ఉత్తమ సేవ పథకాల కి  ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని ఎస్పీ  తెలిపారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం  అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక  అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్...
Read More...
State News 

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్ హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్...
Read More...

కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు  జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.  *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* 2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు...
Read More...
Local News  Crime  State News 

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే...
Read More...