విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో 80 వసంతాల అభ్యుదయోత్సవం-విద్యా సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు నిర్వహించిన పాత్ర ఎనలేనిదని అన్నారు.

అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లల కు నాణ్యమైన విద్య అందించాలని టీచర్లను కోరారు విద్యాశాఖలో పేరుకొనిపోయిన సమస్యలను పరిష్కరించడానికి స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖను చూస్తున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ముప్పై ఏడు వేల మంది టీచర్లకు బదిలీలు ఇరవై మూడు వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని అన్నారు.
పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహించి రికార్డు స్థాయి టైం కేవలం నాలుగు నెలల్లోనే నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. విద్యారంగంలో సమూల సంస్కరణల కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని కమిషన్ అందించే నివేదికను సంపూర్ణంగా అమలు చేస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్ధిక సమస్యలు పెండింగులో ఉన్నాయని వాటిని సైతం సత్వరం పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడగానే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి, రిఫార్మ్స్ కమిటీని ఏర్పాటు చేసి, విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను సవరించి ఈ దేశంలోనే నాణ్యమైన విద్యను ఈ రాష్ట్రంలో అందించాలని తపన ఉన్న ప్రభుత్వం మాదని, మీరు కూడా ఈ సదస్సు అనంతరం తీర్మానాలు చేసి మంచి సూచనలు మా కమిషనర్ కు మరియు మా యొక్క రిఫార్మ్స్ కమిటీ పెద్దలు కేశవరావు కి మీ రిపోర్టు సమర్పించాలని అది విద్యా వ్యవస్థకు చాలా ఉపయుక్త కరంగా మీ సూచనలు ఉండాలన్నారు.
*ఉపాధ్యాయులను పాఠశాలల్లో ప్రశాంతంగా ఉంచే బాధ్యత మాది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంశాలతో కొంత ఆలస్యం అవుతుంది. సరి చేస్తాం.*
*మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు*

మరో ముఖ్య అతిథి రాష్ట్ర బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఒక్కొక్కటిగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేస్తూ పోతున్నామని, బదిలీ పదోన్నతుల సమస్యను పరిష్కరించామని, 317 జీవో బాధితులకు న్యాయం చివరి వరకు జరిగే వరకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, తరగతి గదిలో ప్రశాంతంగా ఉపాధ్యాయుడు బోధన చేసేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. మీరు గుణాత్మక మైన, నాణ్యమైన విద్య అందించడంలో బాధ్యతాయుతంగా పని చేయండి,
మీ బాగోగులు మీ బదిలీలు పదోన్నతులు సకాలంలో వేతనాలు వేతనాలు, బిల్లులు ఒక్కొక్కటిగా ప్రతి సమస్య పరిష్కరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పక్షాన నిలబడుతుందని, అది మా ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం కారణంగానే ఆర్థిక సంబంధిత విషయాలలో కొంత ఆలస్యం అవుతుందని, క్రమశిక్షణగా ఒక్కొక్కటి సర్ది చేసుకుంటూ ముందుకు పోతున్నామని, త్వరలోనే మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం దని అని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని గత పాలనకు భిన్నంగా ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని అన్నారు. మిగతా సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని అన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని కోరారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బడిహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సర్వ అంగులతో నిర్మిస్తున్నామని విద్యావ్యవస్థలో ఇది ఒక పెను మార్పును తీసుకొచ్చే అంశమని తెలిపారు. నా రాజకీయ జీవితంలో జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో మొదటి సంతకం ఉపాధ్యాయుల పదోన్నతుల ఫైల్ పైనే జరిగిందని ఆ విధంగా ఉపాధ్యాయులతో తనకున్న అనుబంధాన్ని పేర్కొన్నారు.

సదస్సు ముఖ్య వక్త ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ ఉపాధ్యాయుల పోరాట ఫలితమే నేటి జీతాలు అన్నారు ఉపాధ్యాయులు తమ వృత్తినిబద్దత సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని కోరారు సంక్షోభంలో ఉన్న విద్యను కాపాడే బాధ్యత కూడా ఉపాధ్యాయులైన అని తెలిపారు అక్ష రజ్ఞానం కల్పించడానికి ఒకటవ తరగతి లోనే గట్టి పునాదులు ఏర్పరచాలని దాని కొరకు భాష ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలోనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 20% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ విద్యా సదస్సులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటానని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్టు రద్దు నా బాధ్యతగా పేర్కొన్నారు.
భిన్న స్థాయిలు గల తరగతి గదిలో విద్యాబోధన అంశంపై అక్షర వనం ఫౌండేషన్ శ్రీపతి రెడ్డి, గుణాత్మక విద్య అనుకూల ప్రతికూలతలపై డాక్టర్ బిల్లి యాదయ్య , వర్తమాన కాలం ఉపాధ్యాయుల పాత్ర పై శ్రీ నిఖిలేశ్వర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రసంగించారు .
పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ కందిమల్ల లింగయ్య, ఆర్జేడి వరంగల్ సత్యనారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. టిఆర్టిఎఫ్ డైరీ మరియు క్యాలెండర్లను రాష్ట్ర మంత్రులు సమావేశంలో ఆవిష్కరించారు
ఐఫియా జాతీయ అధ్యక్షులు సుధీర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాబా కుమార్ కర్మ కార్, టిఆర్టిఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు మానేటి ప్రతాపరెడ్డి, లక్కిరెడ్డి సంజీవరెడ్డి ,కావలి అశోక్ కుమార్, సుంకిశాల ప్రభాకర్ రావు, ఏపీటీఎఫ్ ప్రతినిధులు, హృదయ రాజు, చిరంజీవి, సుబ్బారెడ్డి, టి ఆర్ టి ఎఫ్ ప్రతినిధులు ఎల్లాల లక్ష్మారెడ్డి, ముప్పిడి మల్లయ్య, సత్యనారాయణసంఘ ప్రతినిధులు తరాల పరమేష్ యాదవ్, ప్రణీత్ కుమార్, తుంగూరి సురేష్, ధరావత్ రాములు, రవికుమార్, బేతి సాయి కృష్ణ, ద్రాక్షపు విష్ణుమూర్తి, షేక్ హబీబుర్ రెహమాన్, ఆర్ శివకుమార్, తదితరులు ప్రతినిధులతో పాటు సుమారు 3000 మంది టీఆర్టీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్రూమ్స్ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.... గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి... తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో... గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత రాజేశ్వరి
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు):
ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయంగా మలిచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి అన్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..పథకం పేరు మారిందని గాంధీని అవమానించారంటూ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు.
ఉపాధి... నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు కార్యక్రమము నిర్వహించారు.
సామాజిక బాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచారజాతులవారు స్కై ఫౌండేషన్ కి కృతఙ్ఞతలు ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 21 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని నూతన సర్పంచుల ఐక్యతకు ప్రతీకగా సర్పంచ్ ల ఫోరం కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ అధ్యక్షుడిగా వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి శ్రీధర్ రావును సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి, కాంగ్రెస్... యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటోకు TVS XL అనే టూ వీలర్ పైన వస్తున్నటువంటి వ్యక్తి ఆదివారం సాయంత్రం యాక్సిడెంట్ గురి కాగా అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు యాక్సిడెంట్స్ ని గమనించి అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్నజాతీయ లోక్... విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్,... నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్
హైదరాబాద్, డిసెంబరు 21 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రయోజనాలను కాలరాశాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృత... అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు):
జీహెచ్ఎమ్సీ బేగంపేట సర్కిల్–30 పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ న్యూబోయిగూడలోని ఉప్పలమ్మ దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ రహదారిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగడం లేదని పలువురు బస్తీవాసులు పేర్కొన్నారు. 6-–5-–144 నంబర్ గల ఇంటి రెనోవేషన్ పనులు పూర్తిగా రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న స్థల పరిధిలోనే జరుగుతున్నాయని జీబీ... కాంగ్రెస్ హయాంలోనే క్రీడలకు అధిక ప్రాధాన్యత
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు) : తెలంగాణలో క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జీ ఆదం సంతోష్కుమార్ అన్నారు. చిలకలగూడ జీహెచ్ఎంసీ పార్కులో షటిల్ బాడ్మింటన్కోర్టులను ఆయన ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆదం సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత... 