అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే

On
అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే

యాది.... 
  *అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే. 
      - అల్లె రమేష్

    *మానేటి  మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు

      సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సాహిత్య సృజన కారుడు.

తెలుగు సాహిత్యంలో సంప్రదాయ వాదాన్ని సవాలు చేస్తూ  దిక్కారమైన నిలబడిన విప్లవ,దిగంబర కవిత్వంతో మొదలై ఆత్మ గౌరవ, అస్తిత్వ కవిత్వ మూలాలు  సాహిత్యం లో పరుసుకుంటున్న కాలానికి సంబంధించిన కవి యెన్నం సత్యం.

తను సమాజంలో ఎదుర్కొంటున్న జీవిత అనుభవాల నుండి నిక్కచ్చిగా నిలబడి దర్జీ లా  దర్జాగా తన పని తాను చేసుకుపోయారు. యేన్నం సత్యం రాసింది తక్కువే అయినా అక్కర కొచ్చేది ఎక్కువే. సుదీర్ఘ కవిత ప్రక్రియలు ఆయన ప్రత్యేక ముద్ర లో 1996 లో రాసిన సుదీర్ఘ జ్ఞాపకంతో మొదలైన ఆయన కవిత్వం 1997 లో రాసిన శిలా ఘోష ఈ రెండు రచనలు మానవ సమాజ పరిణామక్రమాన్ని ఆయన అక్షరాల్లో మలచిన తీరు ప్రత్యేకమైంది.

సుధీర్ఘ కవిత్వ కొనసాగింపు లో బాగంగా 2004లో రాసిన బొంగరం సుదీర్ఘ కవిత సంకలనాన్ని తీసుకువచ్చారు.వీటితో  పాటు 2011లో రాసిన సూది నానిలు దాకా ఆయన రచనలు ప్రత్యేక మనే చెప్పాలి. సమాజం పట్ల నిక్కచ్చిగా నిలబడి రాసే కవులకు అవార్డులు సత్కారాలు కొలమానాలు కాబోవు. బహుశా సత్యం సార్ వీటన్నింటికీ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సమాజంలో మానవీయత కోసం పరితపించిన వాడు.

చివరి రోజుల్లో ఆయన సంత్ కబీర్ దాస్ సాహిత్యాన్ని తెలుగులోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రయత్నించారు. సత్యం సార్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సిరిసిల్లలో తుది శ్వాస వచ్చారని మిత్రుల ద్వారా తెలిసిన సమాచారం కలవరానికి గురిచేసింది.

ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు , యాంత్రికంగా  మారిపోతున్న మనిషి జీవితం, విజ్ఞానాన్ని కమ్మేస్తున్న మూఢనమ్మకాలు ఇలా ఎన్నో ప్రాపంచిక విషయాలను మానేరు నది తీరంలో సత్యం సార్ విడమార్చి  చెప్పిన ఎన్నో సాయంకాలలు. మదిలో మెదులుతున్నవి.మనిషిని భౌతికంగా దూరం చేసిన ఎప్పటికి చెరిగిపోని సుదీర్ఘ జ్ఞాపకాలే. సత్యం సార్ కు విన్మరంగా నివాళులు...

అల్లే రమేష్ . సిరిసిల్ల.FB నుండి

Join WhatsApp

More News...

National  Crime  State News 

1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి?

1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి? (ప్రజా మంటలు ప్రత్యేక కథనం) మహారాష్ట్రలో జనన ధ్రువపత్రాల భారీ స్కామ్‌:  ముంబై డిసెంబర్ 18:  మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న శేందుర్సనీ గ్రామ పంచాయతీలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 27,397 జననాలు నమోదవడం అధికారులను అవాక్కయ్యేలా...
Read More...
Local News  Comment  State News 

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే యాది....      *అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.              - అల్లె రమేష్         *మానేటి  మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు             సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన తెలుగు...
Read More...

ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం

ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం కరీంనగర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రభుత్వం ముందుగా 20వ తేదీన నూతనంగా ఏర్పడిన  గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి నిర్ణయించగా ఆ ముహూర్తం బాగాలేదని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు  శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్యులు ప్రభుత్వానికి ,ప్రభుత్వ పెద్దలకు సూచించడంతో వారు   ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని 22వ తేదీ...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Comment 

జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర

జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్‌కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్‌లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం. 78 ఏళ్ల జిమ్మీ లాయ్...
Read More...

జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్

   జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్ జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి. బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు...
Read More...
Local News 

జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన

జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్

పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్ సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల  నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని...
Read More...

పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్  భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ  ఫంక్షన్ హాల్ లో...
Read More...

మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లాలో 3వ దశ పోలింగ్‌లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్...
Read More...

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     *జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్  ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ   తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న  ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా...
Read More...
Local News 

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా...
Read More...