ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
రంగవల్లి స్మారక గ్రంథాలయ వార్షికోత్సవం: జూకంటి అనుభూతి
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు కోరినారు. ఇందుకొరకు ఉదయం 11 గంటల వరకు నేను సిరిసిల్ల నుండి వేములవాడ కమాన్ దగ్గర నూతనంగా నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నాను. తీవ్రమైన చలిని లెక్క చేయకుండా అప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుల కుటుంబాల వారు వచ్చారు . భుజాన గొంగడి వేసుకున్న పురుషులు ఎర్ర దుస్తువులు ధరించిన స్త్రీలు యువకులు మొత్తానికి అరుణోదయ కళాకారులందరూ రోడ్డు దగ్గరికి నుంచి కొంచెం లోపల ఉన్న విజ్ఞాన కేంద్రం వరకు ఒక పాటల ఊరేగింపుగా వెళ్లడానికి తయారు అవుతున్నారు. కొందరి యువకులు డప్పుతో కొందరు నడుస్తున్నారు . విమల నన్ను" అన్నా నడుస్తారే మీరు" అడిగింది . "నేనూ నడుస్తాను" అంటూ తారు రోడ్ వైపు అడుగులు వేశాను . సిరిసిల్ల కరీంనగర్ రోడ్డు పక్కన పాతిన రంగవల్లి విజ్ఞాన కేంద్రం బోర్డు దగ్గర నుండి కొంతమంది ఎర్రజెండాలు చేత పట్టుకోగా పనికొందరు డప్పు దరువు వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఒక గోగు పూల ఊరేగింపు భవనం వైపు కదిలింది.
సభకు అధ్యక్షత వహించిన విమల తో పాటు ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కొల్లపురం విమల,విశిష్ట అతిథిగా నేనూ పాల్గొన్నాను.
సహజంగా అధికార, విపక్ష పార్టీలు నిర్వహించే సభలకు ముందు వెనుక ఉండే ఆర్భాటాలు అట్టి సభలకు ప్రజలు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం సభకు వచ్చిన వారికి ఇతోదికంగా మర్యాదలు చేయడం యాంత్రికంగా జరుగుతున్నవి. అందుకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి కి గుర్తుగా స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి సమాజం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని వారి వారి కారణాలవల్ల మౌనం వహించి జరుగుతున్న అన్ని పరిణామాలను ప్రేక్షకుడిగా గమనిస్తున్న వారు కూడా ఈ సమావేశంలో బాధ్యులుగా చురుకైన పాత్ర నిర్వహించారు .
మధ్య మధ్య అరుణోదయ కళాకారుల పాటలతో ఇప్పటివరకు అమరత్వం పొందిన వీరుల త్యాగాలను కీర్తిస్తూ తలుచుకొని గణంగా నివాళులు అర్పించారు. పరిమితంగా నైనా ఆసక్తికరంగా స్త్రీలు పురుషులతో పాటు ఆలోచనా పరులు సామాన్యులు వచ్చారు . చాలామంది ఈ సమాజం ఎటు పోతుంది అనే ఆలోచనలను పంచుకున్న వారితో చివరి వరకూ జరిగింది.
అరుణోదయ కళాకారులు పాడుకునే పాటలలో ఎక్కువగా రచించిన కవి మిత్ర అలియాస్ అమర్ అలియాస్ కూర దేవేందర్ ఈ సభలో ఉండడం విశేషం. ఆయన సహచరి విమల అధ్యక్షత వహించడం వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడం మాత్రమే కాదు వీరు ఎంతో ఆత్మీయంగా కలివిడిగా మాట్లాడే తీరును చూస్తే ప్రజా ఉద్యమాల నిర్మాణంలో నిబద్ధత ఆచరణ ప్రత్యక్షంగా కనబడింది.
అంతేకాకుండా ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం పనిచేసే అమరవీరులైన వారి భార్యలు, అనేక విధాలుగా గాయపడిన మాజీ సహచరులు ఈ ఒక పూట సభలో తమ తమ ఊర్ల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
అమెరికాలోని ఇతర దేశాలలోని వివిధ యూనివర్సిటీలను హ్యుమానిటీస్ భాగంలో బోధన చేసింది. తిరిగి వచ్చి హైదరాబాదులోని అమెరికా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కొల్లాపురం విమల ఉపన్యాసంలో స్థానిక ఉదాహరణ లను తీసుకొని సమాజ సంక్షోభం గురించి వివరించిన అంశాలు పాల్గొన్న వారిని దీర్ఘమైన ఆలోచనలు పడవేసింది. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అనేక చిక్కుముళ్లను సుధా రంగా విద్యార్థులకు చెప్పినట్టు విప్పి చెప్పింది.
సభాధ్యక్షత వహించిన గాయకురాలు, నాయకురాలైన విమల ఇక్కడ జరిగిన పోరాటాల గురించి ఆయా పోరాటంలో ఆయా సంఘటనలలో నేల కొరిగిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివరించింది.
నేను ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకతను నా యొక్క అనుభవాలు,నేను చదివిన పుస్తకాలు నన్ను తీర్చిదిద్దిన గ్రంధాల గురించి వివరించాను. ప్రస్తుత అత్యాధునిక కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాత్వికవేత్తల గ్రంథాలను మహనీయుల ఆత్మకథలను జీవిత వాస్తవాలకు అద్దం పట్టిన గొప్ప కథలు, నవలలు వ్యాసాల పుస్తకాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నాను. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడానికి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక ప్రజా దృక్పథం ఏర్పరచుకోవడానికి ప్రజా గ్రంధాలయాల అవసరం గ్రామ గ్రామాలలో నెలకొల్పాల్సిన ఆవశ్యకత మరింత ఏర్పడిందని చెప్పాను.
ఉపన్యాసానికి ఉపన్యాసానికి నడుమ అరుణోదయ కళాకారులు అద్భుతమైన పాటలు పాడారు. డబ్బు దరువులతో కాళ్ల గజ్జల సవ్వడితో సభా ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. చివరగా ఆ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడించడం వలన వివిధ సమస్యల సమాహారమైన సంధి కాలం దిశ దశల తీరు పైన వారి ఆలోచనలను మిగతావారు పంచుకున్నట్లు అయింది. సమావేశం దాదాపు మూడు గంటల పైగా జరిగింది. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఆయా వ్యక్తుల జీవితాలను ఒకరికొకరు కలబోసుకుంటూ భోజనం చేశాము.
సభ ముగియగానే ఎక్కడి వారు అక్కడికి వెళ్ళక విజ్ఞాన కేంద్రంలో కూర్చుని సాయంత్రం వరకు అందరూ కలిసి మెలిసి మాట్లాడుకున్నారు.
అనేక ప్రజా పోరాటాల సమావేశాలను, ప్రజాస్వామ్య పార్టీల సభలను దగ్గరగా చూసిన అనుభవాలు అనేకం ఉన్నాయి.. కానీ ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్లీ ఇటువంటి సభలో పాల్గొనడం వలన నాకు ఒక ఆశాజనకమైన ఊరట లభించింది.ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణం గురించిన కలలకు కొత్త రెక్కలు వచ్చాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆశాజనకమైన ఇంధనాన్ని అందించింది. ఒకానొక నూతనోత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించిందనడంలో ఏమాత్రం సంశయం లేదు.
----జూకంటి జగన్నాథం, అధ్యక్షులు,
అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక.FB నుండి.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్పాత్లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ... 