ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
రంగవల్లి స్మారక గ్రంథాలయ వార్షికోత్సవం: జూకంటి అనుభూతి
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు కోరినారు. ఇందుకొరకు ఉదయం 11 గంటల వరకు నేను సిరిసిల్ల నుండి వేములవాడ కమాన్ దగ్గర నూతనంగా నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నాను. తీవ్రమైన చలిని లెక్క చేయకుండా అప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుల కుటుంబాల వారు వచ్చారు . భుజాన గొంగడి వేసుకున్న పురుషులు ఎర్ర దుస్తువులు ధరించిన స్త్రీలు యువకులు మొత్తానికి అరుణోదయ కళాకారులందరూ రోడ్డు దగ్గరికి నుంచి కొంచెం లోపల ఉన్న విజ్ఞాన కేంద్రం వరకు ఒక పాటల ఊరేగింపుగా వెళ్లడానికి తయారు అవుతున్నారు. కొందరి యువకులు డప్పుతో కొందరు నడుస్తున్నారు . విమల నన్ను" అన్నా నడుస్తారే మీరు" అడిగింది . "నేనూ నడుస్తాను" అంటూ తారు రోడ్ వైపు అడుగులు వేశాను . సిరిసిల్ల కరీంనగర్ రోడ్డు పక్కన పాతిన రంగవల్లి విజ్ఞాన కేంద్రం బోర్డు దగ్గర నుండి కొంతమంది ఎర్రజెండాలు చేత పట్టుకోగా పనికొందరు డప్పు దరువు వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఒక గోగు పూల ఊరేగింపు భవనం వైపు కదిలింది.
సభకు అధ్యక్షత వహించిన విమల తో పాటు ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కొల్లపురం విమల,విశిష్ట అతిథిగా నేనూ పాల్గొన్నాను.
సహజంగా అధికార, విపక్ష పార్టీలు నిర్వహించే సభలకు ముందు వెనుక ఉండే ఆర్భాటాలు అట్టి సభలకు ప్రజలు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం సభకు వచ్చిన వారికి ఇతోదికంగా మర్యాదలు చేయడం యాంత్రికంగా జరుగుతున్నవి. అందుకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి కి గుర్తుగా స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి సమాజం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని వారి వారి కారణాలవల్ల మౌనం వహించి జరుగుతున్న అన్ని పరిణామాలను ప్రేక్షకుడిగా గమనిస్తున్న వారు కూడా ఈ సమావేశంలో బాధ్యులుగా చురుకైన పాత్ర నిర్వహించారు .
మధ్య మధ్య అరుణోదయ కళాకారుల పాటలతో ఇప్పటివరకు అమరత్వం పొందిన వీరుల త్యాగాలను కీర్తిస్తూ తలుచుకొని గణంగా నివాళులు అర్పించారు. పరిమితంగా నైనా ఆసక్తికరంగా స్త్రీలు పురుషులతో పాటు ఆలోచనా పరులు సామాన్యులు వచ్చారు . చాలామంది ఈ సమాజం ఎటు పోతుంది అనే ఆలోచనలను పంచుకున్న వారితో చివరి వరకూ జరిగింది.
అరుణోదయ కళాకారులు పాడుకునే పాటలలో ఎక్కువగా రచించిన కవి మిత్ర అలియాస్ అమర్ అలియాస్ కూర దేవేందర్ ఈ సభలో ఉండడం విశేషం. ఆయన సహచరి విమల అధ్యక్షత వహించడం వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడం మాత్రమే కాదు వీరు ఎంతో ఆత్మీయంగా కలివిడిగా మాట్లాడే తీరును చూస్తే ప్రజా ఉద్యమాల నిర్మాణంలో నిబద్ధత ఆచరణ ప్రత్యక్షంగా కనబడింది.
అంతేకాకుండా ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం పనిచేసే అమరవీరులైన వారి భార్యలు, అనేక విధాలుగా గాయపడిన మాజీ సహచరులు ఈ ఒక పూట సభలో తమ తమ ఊర్ల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
అమెరికాలోని ఇతర దేశాలలోని వివిధ యూనివర్సిటీలను హ్యుమానిటీస్ భాగంలో బోధన చేసింది. తిరిగి వచ్చి హైదరాబాదులోని అమెరికా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కొల్లాపురం విమల ఉపన్యాసంలో స్థానిక ఉదాహరణ లను తీసుకొని సమాజ సంక్షోభం గురించి వివరించిన అంశాలు పాల్గొన్న వారిని దీర్ఘమైన ఆలోచనలు పడవేసింది. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అనేక చిక్కుముళ్లను సుధా రంగా విద్యార్థులకు చెప్పినట్టు విప్పి చెప్పింది.
సభాధ్యక్షత వహించిన గాయకురాలు, నాయకురాలైన విమల ఇక్కడ జరిగిన పోరాటాల గురించి ఆయా పోరాటంలో ఆయా సంఘటనలలో నేల కొరిగిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివరించింది.
నేను ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకతను నా యొక్క అనుభవాలు,నేను చదివిన పుస్తకాలు నన్ను తీర్చిదిద్దిన గ్రంధాల గురించి వివరించాను. ప్రస్తుత అత్యాధునిక కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాత్వికవేత్తల గ్రంథాలను మహనీయుల ఆత్మకథలను జీవిత వాస్తవాలకు అద్దం పట్టిన గొప్ప కథలు, నవలలు వ్యాసాల పుస్తకాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నాను. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడానికి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక ప్రజా దృక్పథం ఏర్పరచుకోవడానికి ప్రజా గ్రంధాలయాల అవసరం గ్రామ గ్రామాలలో నెలకొల్పాల్సిన ఆవశ్యకత మరింత ఏర్పడిందని చెప్పాను.
ఉపన్యాసానికి ఉపన్యాసానికి నడుమ అరుణోదయ కళాకారులు అద్భుతమైన పాటలు పాడారు. డబ్బు దరువులతో కాళ్ల గజ్జల సవ్వడితో సభా ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. చివరగా ఆ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడించడం వలన వివిధ సమస్యల సమాహారమైన సంధి కాలం దిశ దశల తీరు పైన వారి ఆలోచనలను మిగతావారు పంచుకున్నట్లు అయింది. సమావేశం దాదాపు మూడు గంటల పైగా జరిగింది. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఆయా వ్యక్తుల జీవితాలను ఒకరికొకరు కలబోసుకుంటూ భోజనం చేశాము.
సభ ముగియగానే ఎక్కడి వారు అక్కడికి వెళ్ళక విజ్ఞాన కేంద్రంలో కూర్చుని సాయంత్రం వరకు అందరూ కలిసి మెలిసి మాట్లాడుకున్నారు.
అనేక ప్రజా పోరాటాల సమావేశాలను, ప్రజాస్వామ్య పార్టీల సభలను దగ్గరగా చూసిన అనుభవాలు అనేకం ఉన్నాయి.. కానీ ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్లీ ఇటువంటి సభలో పాల్గొనడం వలన నాకు ఒక ఆశాజనకమైన ఊరట లభించింది.ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణం గురించిన కలలకు కొత్త రెక్కలు వచ్చాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆశాజనకమైన ఇంధనాన్ని అందించింది. ఒకానొక నూతనోత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించిందనడంలో ఏమాత్రం సంశయం లేదు.
----జూకంటి జగన్నాథం, అధ్యక్షులు,
అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక.FB నుండి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే... మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా... ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా... గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి... శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత
వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు)
జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్, ఈ కార్యక్రమం... ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్
వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు)
జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్) సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్ తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న... రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై మహిళ ఆరోపణలు
అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు):
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని,... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి మున్సిపల్ ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)
ఎన్నికల కోడ్ నియమావళిని అందరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అడిషనల్... కరీంనగర్ కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: మంత్రులు
కరీంనగర్, జనవరి 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,... ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జీఓ లు
జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు)ఇటీవల షిరిడి లో నిర్వహించిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాల లో భాగంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా రెండవసారిఎన్నికైన సందర్బంగా కరీంనగర్ టీఎన్జీవో భవన్ లో కరీంనగర్ జిల్లా... అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ఎఫ్ సి ఐ స్టేట్ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి కిరణ్ దంపతులు
అనంతపురం జనవరి ( 28 ప్రజా మంటలు)అనంతపురం జిల్లా కు నూతనంగా బాధ్యతలు తీసుకున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు .
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా..ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్... 