ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందని తెలిపారు.
శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
ఎన్నికల నియమావళి ప్రకారం గ్రామ ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉన్నదని, 50 వేలకు పైబడి ఉన్న నగదు కు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎవరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, స్పెషల్ టీమ్ల పాత్ర ఎలా ఉంటుందనే విషయాలపై వివరించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఈ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ప్రత్యేక బృందాల్లో తప్పనిసరిగా మెజిస్ట్రేట్ స్థాయి అధికారి ఒకరు, నలుగురు పోలీసు సిబ్బంది, అవసరమైతే కెమెరామెన్/వెబ్క్యామ్ సామగ్రి, ప్రత్యేక వాహనం ఉంటాయి. ఎన్నికల అధికారులు, పోలీసులకు వచ్చే సమాచారం, పౌరులు చేసే ఫిర్యాదుల ఆధారంగా వీరి కార్యాచరణ ఉంటుందన్నారు.
ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నాయకులు పెట్టే ప్రలోభాలు, ఇచ్చే బహుమతులు, పంచే డబ్బులు, మద్యం వంటి వాటిపై కూడా ఈ ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు దృష్టిసారించాలని సూచించారు. తమ గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఎన్నికల ఏర్పాట్లు, ప్రక్రియను వీరు పరిశీలిస్తారని, అవసరమైతే స్థానిక అధికారులకు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ల విధి నిర్వహణ ఎప్పటికప్పుడు కెమెరాలో రికార్డు అవుతుందని, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని ఎం.సి.సి లో ఎఫ్.ఎస్.టి, వి.ఎస్.టిలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిన వారిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక అందించేలా సిబ్బందికి సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, వారిని జి.పి.ఎస్ ట్రాక్ సిస్టం ద్వారా నిరంతరాయంగా పరిశీలిస్తామని తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల నిర్వహణలో భాగంగా మద్యం, లిక్కర్ తదితర వస్తువులు పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ వీడియో రికార్డ్ తప్పనిసరిగా చేయాలి తెలిపారు. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రి పై వీడియో సర్వేలెన్స్ టీమ్లు రికార్డు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ లు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించాలని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ కు సమర్పించాలని తెలిపారు. ఈ సెల్ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదు ను సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు.
రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉంది అన్న సమాచారం అందిన వెంటనే ఇన్ కం ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఫ్లయింగ్ స్కాడ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ ఏం. మనోహర్, జిల్లా మరియు నోడల్ అధికారులు రఘువరన్, మదన్ మోహన్, బి.నరేష్, పి. నరేష్, రేవంత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక... ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందని తెలిపారు.
శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.... జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు.... భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం
లోతైన విశ్లేషణ
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1. స్వచ్ఛ భారత్, 2.శౌచాలయ నిర్మాణం, 3.స్మార్ట్ సిటీ మిషన్, 4.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, 5.అమృత్ మిషన్, 6.దీనదయాళ్ అంత్యోదయ యోజన, 7.హెరిటేజ్ సిటీ అభివృద్ధి యోజన వంటి పలు ఫ్లాగ్షిప్ పథకాలు భారీ ఎత్తున నిధులతో నడిచాయి. వీటిలో మొత్తం 36.65... కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
కోరుట్ల, నవంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం అధికారులపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు.
అన్ని సెక్షన్లలో రికార్డుల పరిశీలన
విజిలెన్స్ బృందం• టౌన్ ప్లానింగ్• ఇంజనీరింగ్• ఫైనాన్స్• ట్యాక్స్• సానిటేషన్... కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్తో కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కల్వకుంట్ల కవిత పిలుపుతో జరిగిన రైలు రోకో ఆందోళన కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలును అధికారులు నిలిపివేశారు.
కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆందోళన ఉధృతమవుతుండటంతోకల్వకుంట్ల కవితను పోలీసులు... తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?
నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?
తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?
(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)
తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,... చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు):
సారంగాపూర్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా... ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత
ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
బాన్సువాడ –... హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్
సందర్శించిన అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు)::
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫోటో ప్రదర్శనను గురువారం తెలంగాణ హైకోర్టు భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు.... భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.
ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)... ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్
ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు... 