భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం
లోతైన విశ్లేషణ
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1. స్వచ్ఛ భారత్, 2.శౌచాలయ నిర్మాణం, 3.స్మార్ట్ సిటీ మిషన్, 4.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, 5.అమృత్ మిషన్, 6.దీనదయాళ్ అంత్యోదయ యోజన, 7.హెరిటేజ్ సిటీ అభివృద్ధి యోజన వంటి పలు ఫ్లాగ్షిప్ పథకాలు భారీ ఎత్తున నిధులతో నడిచాయి. వీటిలో మొత్తం 36.65 లక్షల కోట్ల వరకు నిధులు గల్లంతయ్యాయని, పనుల్లో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయని, లక్ష్యాలకు విరుద్ధంగా పనులు జరిగాయని సామాజిక సంస్థలు, పరిశోధనా సంస్థలు, ముఖ్యంగా అజీమ్ ప్రేమ్జి ఫౌండేషన్, మరియు ప్రభుత్వ లెక్కల పరిశీలన సంస్థ CAG తమ నివేదికల్లో వెల్లడించాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఈ విషయాలపై అనేక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
స్వచ్ఛ భారత్ మిషన్లో, మరుగుదొడ్ల నిర్మాణం లక్షల్లో జరిగిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నప్పటికీ, CAG తన పరిశీలనలో అనేక ప్రాంగణాలలో వాస్తవంగా మరుగుదొడ్లు లేనప్పటికీ ఫోటోలు, బిల్లులు చూపించి నిధులు తీసుకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది. కాగ్ మరో కీలక అంశాన్ని గుర్తించింది—అనేక రాష్ట్రాలు నిర్మించిన శౌచాలయాల్లో నీటి కనెక్షన్లు లేకపోవడం, డ్రైనేజ్లు సమర్థంగా పనిచేయకపోవడం, ఈ నిర్మాణాలు కేవలం టార్గెట్లు నెరవేర్చడానికి మాత్రమే చేసినట్లు స్పష్టమయ్యింది.
10% నిధులు కూడా ఖర్చు చేయలేదు
స్మార్ట్ సిటీ మిషన్లో పరిస్థితి మరింత దిగజారింది. వేల కోట్ల నిధులు కేటాయించినప్పటికీ, అనేక నగరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల పనులు పూర్తి కాకపోవడం, పలు నగరాల్లో ప్రాజెక్టులు కాగితంలోనే ఉండిపోవడం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను కమిటీ నివేదికలు హైలైట్ చేశాయి. అనేక స్మార్ట్ సిటీలు ఇప్పటికీ సాధారణ నగరాలకంటే మెరుగైన సదుపాయాలు లేవు.
అనర్హులైన 45% మందికి ఇళ్ల కేటాయింపు
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో కూడా గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. CAG నివేదికలు చెబుతున్నట్లుగా, నిజంగా ఇళ్లు అవసరమైన పేద కుటుంబాల జాబితా సిద్ధం చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున తారుమార్లు, అనర్హులకు ఇళ్లు మంజూరు చేయడం, అనేక జిల్లాల్లో ఆమోదించిన ఇండ్లు భౌతికంగా నిర్మించకపోయినా పూర్తి అయినట్లు చూపించడం వంటి అవినీతి పద్ధతులు వెలుగులోకి వచ్చాయి.
ఎవరికి అందని పథకాలు : మంచినీటికి ప్రజల గొగ్గోలు
అమృత్ మిషన్, దీనదయాళ్ అంత్యోదయ యోజన, హెరిటేజ్ సిటీ యోజన వంటి పథకాలలో కూడా ఒకే తరహా సమస్యలు కనిపించాయి—నిధులు విడుదలయ్యాయి, కానీ పనులు జరగలేదు, జరిగినా నాణ్యత లోపించింది. ఈ పథకాలన్నింటిలో పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ మాఫియాతో కుమ్మక్కు, డిజైన్ తప్పిదాలు ప్రధాన కారణాలు.
ఇన్ని కోట్ల నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం మానం
సామాజిక పరిశీలన సంస్థలు చెబుతున్నదేమిటంటే—ఈ పథకాలు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అమలు దశలో అవినీతి, పర్యవేక్షణ రాహిత్యం కారణంగా నిధులు గల్లంతుకావడం, పనులు సగం పూర్తవడం సహజమైపోయాయి. ఇవి భారత అభివృద్ధి వ్యవస్థలో తీవ్రమైన పగుళ్లను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇకపై దృఢ పర్యవేక్షణ, పారదర్శక వ్యవస్థ, సోషల్ ఆడిట్లు లేకుండా ఈ పథకాలు నిజంగా ఫలాలు ఇవ్వడం అసాధ్యం.
More News...
<%- node_title %>
<%- node_title %>
టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన జగిత్యాల టిఎన్జీఓ లు
కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు.
కరీంనగర్... కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.
. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ
జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్ తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.
ఈ... తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.... ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి
కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు) హనుమాన్ చిన్న జయంతికి 914 మంది సిబ్బందితో పటిష్ట భద్రత
సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు.
ప్రసిద్ధ... “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
:హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్... అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత
రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు... కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు
చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని... మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్
జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక పై మైనర్... డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి
జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం... రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –
హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు);
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు):
ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల... 