నచ్చిన వారికే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం

– మైనార్టీ గురుకులంలో సీనియర్‌ను పక్కనపెట్టి జూనియర్‌కు ఉద్యోగం కట్టబెట్టిన అధికారులు – నిబంధనలకు విరుద్ధంగా నియమకం

On
నచ్చిన వారికే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం

– ఏడాది పాటు న్యాయం కోసం సీనియర్‌ ఉద్యోగి పోరాటం
– మంత్రి ఆదేశించినా ఉద్యోగం ఇవ్వకుండా అధికారులు కాలయాపన 

(అంకం భూమయ్య)

 
గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు) 

జిల్లాలోని జగిత్యాల జిల్లా కేంద్రం లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సీనియర్‌ను పక్కన పెట్టి జూనియర్‌కు ఉద్యోగం ఇవ్వడం పట్ల సీనియర్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి అన్యాయం జరగడంతో ఏడాది కాలంగా బాధితుడు కార్యాలయం చుట్టూ న్యాయ పోరాటం చేస్తున్నాడు. అక్రమంగా ఉద్యోగం సాధించిన వారిపై చర్యలు తీసుకుని అదే ప్లేస్‌లో తనకు ఉద్యోగం ఇప్పించాలని జిల్లా, రాష్ట్రస్థాయి కార్యాలయాల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నాడు.

మంత్రి చెప్పినా పట్టించుకొని అధికారులు

మంత్రికి విన్నవించగా మంత్రి స్పందించి సదరు బాధితునికి న్యాయం చేసి ఉద్యోగం ఇప్పించాలని ఆదేశించినప్పటికీ వారు చేసిన తప్పిదంతో సీనియర్‌ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేక,భవిష్యత్తులో  ఖాళీ ఏర్పడితేనే ఉద్యోగం ఇస్తామని కాలయాపన చేస్తూ బాధితునికి అన్యాయం చేయడంతో విసిగి వేసారిన బాధితుడు విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్న వైనం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 గొల్లపల్లి మండలం లోని భీంరాజ్‌పల్లికి గ్రామానికి చెందిన తొగిటి గణపతి మెట్‌పల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా మూడు సంవత్సరాల 7 నెలలు విధులు నిర్వహించాడు. ఆ పాఠశాలకు గత సంవత్సరం రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు రావడం వల్ల గణపతిని విధుల నుంచి తొలగించారు. అదే సమయంలో జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల జగిత్యాల బాయ్స్‌–1లో పీజీటీ తెలుగు ఉపాధ్యాయులు జేఎల్‌గా ప్రమోట్‌అయినందున ఖాళీ ఏర్పడింది.

దానికి హెడ్‌ ఆఫీస్‌ రూల్స్‌ ప్రకారం జిల్లాలో మైనార్టీ పాఠశాలల్లో పనిచేసిన వారిని సీనియార్టి ప్రతిపాదికన భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ అప్పుడు ఆర్‌ఎల్‌సీగా విధులు నిర్వహించిన దాసరి రాజేందర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి చిత్రు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రెండు సంవత్సరాల సీనియార్టి కలిగిన సుదర్శన శర్మను నియమించుకున్నారని బాధితుడు వాపోయారు. అదే సమయంలో అదే పాఠశాలలో నియమించిన ఆర్ట్‌ టీచర్‌ నియమకం కూడా వారికి నచ్చిన వారికే ఇవ్వడం జరిగిందని వాపోయారు.

ఆర్ట్ ఉద్యోగి నియామకం అంతే 

ఆర్ట్‌ ఉద్యోగానికి గతంలో కోరుట్ల మైనార్టీ పాఠశాలలో పనిచేసిన చంద్రశేఖర్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడంతో పై అధికారులు ఎంక్వైరి జరిపి అతన్ని విధుల నుంచి తొలగించారని  పేర్కొన్నారు. కానీ ఆర్‌ఎల్‌సీ దాసరి రాజేందర్‌ అదే వ్యక్తిని తిరిగి టీచర్‌గా నియమించుకున్నారు. ఈ అక్రమ నియమకాలపై ఆరు నెలల క్రితమే జిల్లా మైనార్టీ సంక్షేమాధికారికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు. ఆగస్టు నెలలో ఆర్టీఏ కింద దరఖాస్తు చేసుకున్నా జిల్లాస్థాయి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు.

రాష్ట్రస్థాయి అధికారులను కలిసినా ..

రాష్ట్రస్థాయి అధికారులను కలిసి న్యాయం చేయాలని విన్నవించగా జిల్లా మైనార్టీ అధికారికి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆలస్యం కావడంతో అప్పటి మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిశానని, వెంటనే స్పందించిన మంత్రి సీనియర్టి ఉన్న గణపతిని ఉద్యోగంలో నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నెల రోజులు గడిచినా కాలయాపన చేస్తున్నారని వాపోయారు.

మరో ఖాళీ వస్తే తప్ప న్యాయం చేయలేం 

ఖాళీ ఏర్పడితే తప్ప ఉద్యోగం ఇవ్వలేమని నిర్లక్ష్యంగా అధికారులు సమాదానం చెబుతున్నారని వాపోయారు. దీనిపై పరిశీలించి తప్పుడు మార్గంలో నియమించబడిన వారిని తొలగించి అట్టి ఉద్యోగాల్లో రెండింటికి అర్హత ఉన్న నాకు ఏదైనా ఒక ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. గత సంవత్సరం కాలంగా ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, అట్టి ఉద్యోగం నాకు ఇవ్వకుండా నన్ను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిన ఆర్‌ఎల్‌సీ దాసరి రాజేందర్, డీఎండబ్ల్యూవో చిత్రులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International   State News 

మాధ్యమాలు ఏకపక్షంగా మారాయి: ప్రపంచంలో చెత్త టీవీ న్యూస్ ఛానల్స్‌లోనే..

మాధ్యమాలు ఏకపక్షంగా మారాయి: ప్రపంచంలో చెత్త టీవీ న్యూస్ ఛానల్స్‌లోనే.. “భారత మీడియా విమర్శించే శక్తిని కోల్పోయింది నితీష్, మోడీ, రాహుల్ – ఎవ్వరూ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు న్యూఢిల్లీ నవంబర్ 15: భారత టెలివిజన్ వార్తా ఛానల్స్ నాణ్యతపై ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎన్‌. రామ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌ ఎన్నికల మీడియా కవరేజ్‌పై ‘ది వైర్‌’ కోసం...
Read More...

గౌతమ ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు 

గౌతమ ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు  జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు) గౌతమ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థల్లో  రెండు రోజులుగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా శనివారం గౌతమ ఉన్నత పాఠశాల లో చిల్డ్రన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను  ఎంతగానో...
Read More...

పదేళ్ల బాలికపై లైంగిక దాడి: కేరళలో బీజేపీ నేతకు జీవిత ఖైదు

పదేళ్ల బాలికపై లైంగిక దాడి: కేరళలో బీజేపీ నేతకు జీవిత ఖైదు థలసేరి / కన్నూర్ నవంబర్ 15: కేరళలోని పలాథాయి పాఠశాలలో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో బీజేపీ మాజీ నేత కె. పద్మరాజన్ కు థలసేరి POCSO ఫాస్ట్-ట్రాక్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఐదేళ్లుగా నడుస్తున్న ఈ కీలక కేసు ముగిసింది. ఘటన ఎలా జరిగింది? 2020...
Read More...

రాజీమార్గమే రాజ మార్గం

రాజీమార్గమే రాజ మార్గం జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు)రాజీమార్గమే రాజమార్గమని జిల్లా న్యాయమూర్తి రత్నప్రభవతి అన్నారు .శనివారం చీఫ్ రిజిస్టర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్ కేసులు సివిల్ తగాదాలు చెక్ బౌన్స్ మ్యారేజ్ ఇష్యూస్ స్పెషల్ లోక్ అదాలత్ లో  పరిశీలించుకోవచ్చునని తెలిపారు. చిన్నచిన్న...
Read More...

నౌగామ్ బ్లాస్ట్‌: ‘కిటికీ తీసే సరికి పోలీస్ స్టేషన్‌ మంటల్లో…

నౌగామ్ బ్లాస్ట్‌: ‘కిటికీ తీసే సరికి పోలీస్ స్టేషన్‌ మంటల్లో… శ్రీనగర్/నౌగామ్ (జమ్మూకాశ్మీర్) నవంబర్ 15; నౌగామ్ సెక్టార్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ బ్లాస్ట్‌తో ప్రాంతమంతా ఒకేసారి షాక్‌కు గురై, కుటుంబాలు చిన్నపిల్లలతో సహా రాత్రి చీకటి మధ్య ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల మాటల్లో—“కిటికీ తీసే సరికి...
Read More...
National  State News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు న్యూ ఢిల్లీ నవంబర్ 15 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీలను భేటీ అయ్యారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 98,888...
Read More...
Local News  State News 

సమయం సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఇంటర్ బోర్డు స్పెషల్ అధికారి వి. రమణ రావు

సమయం సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఇంటర్ బోర్డు స్పెషల్ అధికారి వి. రమణ రావు జగిత్యాల, నవంబర్ 15 (ప్రజా మంటలు): విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ అధికారి వి. రమణ రావు సూచించారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పలు కళాశాలలను ఆయన పరిశీలించారు. పరిశీలన సందర్భంగా కళాశాలల్లో విద్యార్థుల...
Read More...

మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన   కల్వకుంట్ల కవిత

 మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన   కల్వకుంట్ల కవిత మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు): మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో ఇటీవల చోటుచేసుకున్న భారీ వరదల నేపథ్యంలో బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ధూప్ సింగ్ తండా పరిసరాల్లో వరద ముంపు కారణంగా దెబ్బతిన్న కల్వర్టును...
Read More...
Local News 

ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ::జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ::జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం లోని రాపల్లె, మరియు పెగడపల్లి మండలం లోని కొండయ్య పల్లి  గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  ప్రత్యక్షంగా సందర్శించి, కొనుగోలు కేంద్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్  వరి ధాన్య...
Read More...

జగిత్యాల రూరల్‌లో బాల్యవివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

జగిత్యాల రూరల్‌లో బాల్యవివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జగిత్యాల రూరల్ నవంబర్ 15 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలన కోసం మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత విభాగం, సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన జిల్లా బాలల పరిరక్షణ...
Read More...
Local News  State News 

"తెలంగాణ రాష్ట్రం – విద్యా వ్యవస్థ” అంశంపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం

ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్రంలోని విద్యా రంగ ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీజేటీఎఫ్ అధ్యక్షుడు మోరం వీరభద్రరావు...
Read More...

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి “సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని” కవిత విమర్శించారు. ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని...
Read More...