అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరం రాజేశ్వరి అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ చోరీ కాదని 140 కోట్ల ప్రజల హృదయాన్ని చూరగున్నారని ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుకొస్తాయని బిజెపి రాష్ట్ర నాయకులు మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని ప్రజాస్వామ్యం,రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని హిందీ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం వలన ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయని దుష్ప్రచారం చేసి ఇప్పుడు కొత్తగా మీ ఓటు ప్రమాదంలో పడిందని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కలిసి మీ ఓటును దొంగిలిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని కానీ ఇవన్నీ ఏవీ ప్రమాదంలో పడలేదని ప్రమాదంలో పడింది 65సంవత్సరాలు దేశాన్ని పాలించిన నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రమాదంలో పడబోతుందని తెలుసుకొని దేశప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతిన్నారని పేర్కొన్నారు.
స్వాతంత్రానంతరం నెహ్రూ కాలం నుండి అసలైన ఓటు చోరీ కి పాల్పడింది నెహ్రూ కుటుంబ సభ్యులేనని విమర్శించారు.1947 సంవత్సరంలో మొదటి సారిగా ప్రధానమంత్రి ఎన్నికకు రాజ్యాంగ పరిషత్ లోని 15 ఓట్లకుగాను 12ఓట్లు సాధించిన సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి కాకుండా ఒక్క ఓటు వచ్చిన నెహ్రూ ప్రధాన మంత్రి అయి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు. తర్వాత అడ్డదారిలో గెలిచిన ఇందిరాగాంధీ నియామకం చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే తీర్పును కాలరాసి అత్యవసర పరిస్థితి ప్రకటించి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు.
1968లో సోనియా వివాహం జరిగితే 16 సంవత్సరాల వరకు భారత పౌరసత్వం తీసుకోలేదని కాని 1983లో జరిగిన ఎన్నికల్లో సోనియా ఓటు వేసి ఓటు చోరికి పాల్పడిందని పీవీ నరసింహ రావు ప్రధాన మంత్రి అయ్యక జరిగిన బల ప్రదర్శనలో పార్లమెంటు సాక్షిగా ఎంపీలను కొనుగోలు చేసి డబ్బుల సూటుకేసులు మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఓటు చోరికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 100నియోజకవర్గాల్లో ఓటు చోరీ జరిగింది అని చేస్తున్న ప్రచారం అది నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 99 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు హైద్రాబాద్ నుండి గెలిచిన అసదుద్దీన్ నియోజవర్గాల్లో మరియు కర్ణాటకలోని నంజెగౌడ ఎన్నిక చెల్లనేరదు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి పాల్పడినట్లు రాహుల్ గాంధీ ఒప్పుకోవాలని అన్నారు. బిజెపి ఓటు చోరికి పాల్పడేది అయితే వాజపేయి గారు ఒక్క ఓటు తేడాతో ప్రధాన మంత్రి పీఠాన్ని వదులుకునే వారు కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని ధర్మ సత్రంగా మార్చి పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి వచ్చిన రోహింగ్యాలకు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆరోపించారు.
ఆపరేషన్ సింధూర్ ను పాక్ విదేశాంగ మంత్రి ఒప్పుకున్న రాహుల్ ఒప్పుకోలేదని ఇప్పుడు నేపాల్ లో జరిగిన సంఘటన భారత్ లో జరిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడం శత్రుదేశాలకు మద్దతు తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి నాయకులకు గ్యారంటీ వారంటీ అయిపోయిందని అందుకే మతిబ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
---
-
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ విమానాశ్రయంలో ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు
400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు.
ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు
హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు:
దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది.... చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
– బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత... హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం ఆది బజార్–2025’
గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్: దివ్య దేవరాజన్
హైదరాబాద్, నవంబర్ 7 ( ప్రజా మంటలు):
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.... ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్... ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ
హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు:
ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం... వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది... ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్
సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.మూర్తి డిమాండ్ చేశారు.శుక్రవారం ముషీరాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ... సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు... TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ
TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది. 