వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) :
జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ.
- ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ఒక మారుమూల గ్రామం వెనికిరాలలో జన్మించి ఎంతో మందికి మార్గం చూపిన జీవతగాథ.
- ఆయన భారత వాయుసేనలో 23 సంవత్సరాలు సేవ చేసిన ఈ అధికారి, పదవీ విరమణ తరువాత తన జీవితాన్ని వ్యక్తిత్వ వికాసానికి మరియు విద్యాభివృద్ధికి అంకితం చేశారు.
వాయుసేనలో నిస్వార్థ సేవ :
- రామకృష్ణ 1994 నుండి 2017 వరకు భారత వాయుసేనలో వారెంట్ ఆఫీసర్గా వాయుసేన ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 130 కి పైగా ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు మరియు 98 కేంద్రీయ విద్యాలయాల విద్యా పరిపాలనాధికారిగా సమర్థవంతంగా తన భాద్యతలను నిర్వర్తించారు.
- సుమారు 52,000 మంది విద్యార్థులకు, 5000 మంది ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసి, విద్యా రంగంలో కొత్త శకానికి నాంది పలికారు.

పదవీ విరమణ తర్వాత విద్యా రంగంలో వెలుగులు నింపే ప్రయత్నం :
- 2017లో వాయుసేన నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత, డాక్టర్ రామకృష్ణ సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
- హైదరాబాద్లోని నాచారంలో నివసిస్తూ, ప్రస్తుతం రెండు శిక్షణ సంస్థలను నెలకొల్పి వ్యవస్థాపకుడిగా, నిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నారు.
- దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణలతో 150000 లక్షల మందికి పైగా జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.
అధ్యయనం, రచన, ప్రేరణ: త్రివేణి సంగమం
- ఇప్పటివరకు 5 పుస్తకాలను రచించిన రామకృష్ణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
- ఆయన వ్యాసాలు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమై, పలు అవార్డులను అందుకున్నారు.

శిక్షణా ప్రస్థానానికి ప్రతిబింబం :
- డాక్టర్ రామకృష్ణ అనేక ప్రఖ్యాత సంస్థల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
- ఐఐటీ గాంధీనగర్, లారస్ ల్యాబ్స్, ఎంఆర్ఎఫ్, సాండ్విక్, హెరిటేజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, నిర్మాణ జాతీయ అకాడమీ, లోయోలా అకాడమీ, TSRTC, వ్యవసాయ శాఖ, ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు వంటి పలు సంస్థల్లో కార్పొరేట్ శిక్షణలు అందిస్తూ, జీవిత నైపుణ్యాల పరంగా ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు.
- కొన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో భాగస్వామ్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
- దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణలు అందిస్తూ, వేలాది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నారు.
ప్రామాణికతలు :
డాక్టర్ రామకృష్ణ నాబెట్ నుండి సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, అమెరికా సంస్థల ద్వారా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్గా గుర్తింపు పొందారు.
సమాజ సేవ :
- వృత్తిపరమైన విజయాలతో పాటు, డాక్టర్ రామకృష్ణ సామాజ సేవలోనూ ముందున్నారు.
- ఆర్థికంగా బలహీన వర్గాల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు.
- నిత్యావసర వస్తువుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్యా సహాయం, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవార్డులు,పురస్కారాలు :
- హానరరీ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ), 2019
- సేవా రత్న అవార్డు – 2019
- ఇండియన్ గ్లోరీ అవార్డు, 2019
- ఉగాది నంది అవార్డు (2023)
- ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు (2025)
- వాయుసేన నుండి లాంగ్ సర్వీస్ మెడల్, సైన్య సేవా మెడల్.

మాటల ద్వారా మార్పు :
- " మాటల్లో మార్పు ఉంది. మార్పుతో ఎదుగుదల ఉంది" అనే నినాదంతో, ఆయన ప్రసంగాలు విన్న ప్రతివారు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిషా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆయన వాణి మార్గదర్శకంగా నిలుస్తోంది.
వ్యక్తిగత వివరాలు :
- తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై డాక్టర్ రామకృష్ణకు పూర్తి పట్టు ఉంది.
- హైదరాబాద్లో నివసిస్తూ దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.
- ఎప్పటికీ నేర్చుకుంటూ, నేర్పిస్తూ, మార్పుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
సంక్షిప్తంగా :
- డాక్టర్ యెలమంచి రామకృష్ణ — ఒక సైనికుడిగా ప్రారంభమై, లక్షల మందికి జీవిత మార్గదర్శిగా మారిన శిక్షకుడు, రచయిత, ప్రేరణాత్మక నిర్దేశకుడు.
యూట్యూబ్ ఛానల్ – Redefine Life with Dr RK
ఫోన్ నంబర్: 9958361110
ఇమెయిల్: drramakrishna02@gmail.com.

More News...
<%- node_title %>
<%- node_title %>
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల... జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.
ఈ 3డి సైకత శిల్ప... మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ... తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే... “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు.
హైదరాబాద్లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ... జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..
వార్డు
రిజర్వేషన్
BRS
BJP
కాంగ్రెస్
1
BC(G)
నిమిషకవి వంశీకృష్ణ
పుప్పాల రాజేష్
అనిల్ కుమార్ కూసరి
2
UR(W)
వొడ్డినేని సంధ్య కుమారి
కాశెట్టి... ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా... క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి
(పి కోటేశ్వర్)
సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :
క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన
ఈ... రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్ఈ
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.... కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న
హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23... జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల... స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్ఎస్లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం
ఈ తీర్పుపై... 