గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ
పలు అభివృద్ది పనుల పరిశీలన
సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి,గాంధీ మెడికల్ కాలేజీ లో బుధవారం డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ పర్యటించారు. శనివారం గాంధీ ఆసుపత్రిలో నీటి పంపింగ్ నిలిచిపోవడం వల్ల రోగులకు కలిగిన ఇబ్బందులను తెలుసుకుని, దాని పరిష్కారం కోసం చేపట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. కేబుల్ ఏర్పాటు పని పూర్తి అయ్యిందని, నీటి పంపింగ్ ఇప్పుడు సజావుగా జరుగుతున్నదని సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ఆయనకు వివరించారు. అనంతరం ఓపి బ్లాక్ లో ఆయుష్మాన్ భారత్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని, రేడియాలజీ విభాగంలో స్కానింగ్, ఎక్స్ రే ల పనితీరును తెలుసుకున్నారు. జీరియాట్రిక్ వార్డులను ఆయన సందర్శించారు. గాంధీ వైద్య కళాశాల లైబ్రరీ, పీజీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు ఏవైనా ఉంటే సత్వరమే పూర్తి చేయాలని ఆమె కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ఇందిరకు సూచించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పీజీ విద్యార్థుల స్టైఫండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డీఎమ్ఈ ని కోరారు.ఆయన వెంట ఆసుపత్రి ఆర్ఎంవోలు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
