ఘనంగా అంబేడ్కర్ 134 జయంతి ఉత్సవాలు
పలువురుకి దళిత రత్న అవార్డుల ప్రధానం
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు):
2025 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల 134 వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం కంటోన్మెంట్ బాలం రాయి లోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గం మాదిగ హక్కుల పార్టీల సంఘాల ఐక్యత జేఏసీ సారథ్యంలో ఎంపిక చేసిన వారికి చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా దళిత రత్న అవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఇటుక రాజు మాట్లాడుతూ... నిస్వార్ధంగా సమాజానికి తమ బాధ్యతగా దళిత జాతికి సేవలందిస్తున్న వారికి ఈ దళిత రత్న అవార్డు ప్రధానంతో సమాజం పట్ల మెరుగైన సేవలు అందించడంలో ఇంకా బాధ్యత పెరుగుతుందని ఆయన అన్నారు అవార్డు అందుకున్న వారిలో మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకుడు ఏసూరి మహేష్, ఎం. రాంబాబు, రేవుల శంకర్, ఆడవెల్లి కుమార్, పల్లె సుధాకర్, పూజారి స్వామి, ఈ. నర్సింగ్ రావు, సుంకపాక రాజు , రిటైర్డ్ సిఆర్పిఎఫ్ జవాన్ బొడ్డు పరుశురాం, సుంచు యాదగిరి, కుమ్మరి రాజు, రాసళ్ళ సెల్వరాజ్, జే. నర్సింగ్ రావు (ఫోటోగ్రాఫర్), కారంగుల నరేష్ (ఆర్.టి.ఐ), ఎర్ర బాబురావు, కే. నిరంజన్, పి. మోహన్ కృష్ణ లను ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారు ఉత్సవాల చైర్మన్ ఇటుక రాజుకు, వైస్ చైర్మన్ కనకరాజుకు, మాదిగ జేఏసీ నాయకులు పుల్లూరి మహేందర్, డప్పుల వేణుగోపాల్, బొడ్డు మహేష్, కొంగరి సతీష్, కుమ్మరి శంకర్, పి. చంద్రశేఖర్ (బబ్బర్)లకు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
