మాదిగ హక్కుల దండోరా జగిత్యాల జిల్లా కన్వీనర్గా మంతెన స్వామి మాదిగ నియామకం
జగిత్యాల, మే 19 (ప్రజా మంటలు)
మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్డీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, మాదిగల సంక్షేమం, హక్కుల సాధన లక్ష్యంగా జరుగుతున్న ఉద్యమాన్ని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా జిల్లా కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కన్వీనర్గా ఎండపల్లి మండలం రాజరాంపల్లె గ్రామానికి చెందిన మంతెన స్వామి మాదిగ ని నియమించడమైనట్లు రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మాదిగ హక్కుల దండోరా” ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోనుండి రాష్ట్ర స్థాయికి విస్తరించి, మాదిగల హక్కుల సాధనలో సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .దీని కోసం ప్రతీ జిల్లాలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో సమర్ధవంతమైన నాయకత్వం ఉండాలని, అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కన్వీనర్గా మంతెన స్వామి మాదిగ ని నియమించామని” తెలిపారు. ఉద్యమ నిబద్ధత, జాతి పట్ల ఉన్న కట్టుబాటు, సుదీర్ఘ అనుభవం నేపథ్యంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలియజేశారు.
మాదిగ హక్కుల సాధనలో సంఘటిత కృషికి పిలుపు
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తూ, మాదిగల సమస్యలను పరిష్కరించాలంటే అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి ఒకటైన శక్తిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఉద్యమ విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
