డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

On
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం


డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.


భారత దేశంలో 1986లో  వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం  వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్‌ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు. 

 నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఈ-కామర్స్‌, టెలిషాపింగ్‌ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు.  ప్రజలను మోసగించే సైబర్‌ నేరాలు దీని వల్ల  చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్‌ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. 
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.

జాతీయస్థాయిలో సెంట్రల్‌ కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది.  జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను  కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు. 

రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి 
 విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.

Tags
Join WhatsApp

More News...

State News 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు. ఈ 3డి సైకత శిల్ప...
Read More...
Local News 

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ...
Read More...
State News 

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే...
Read More...
State News 

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ...
Read More...

జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా.. వార్డు రిజర్వేషన్ BRS BJP కాంగ్రెస్ 1 BC(G) నిమిషకవి వంశీకృష్ణ పుప్పాల రాజేష్ అనిల్ కుమార్ కూసరి  2 UR(W) వొడ్డినేని సంధ్య కుమారి కాశెట్టి...
Read More...

ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా...
Read More...
State News 

క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి

క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి (పి కోటేశ్వర్) సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :    క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ...
Read More...
Crime  State News 

రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి....
Read More...

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23...
Read More...
Local News  State News 

జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్

జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్ జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల...
Read More...

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం ఈ తీర్పుపై...
Read More...