డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

On
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం


డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.


భారత దేశంలో 1986లో  వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం  వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్‌ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు. 

 నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఈ-కామర్స్‌, టెలిషాపింగ్‌ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు.  ప్రజలను మోసగించే సైబర్‌ నేరాలు దీని వల్ల  చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్‌ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. 
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.

జాతీయస్థాయిలో సెంట్రల్‌ కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది.  జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను  కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు. 

రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి 
 విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.

Tags
Join WhatsApp

More News...

State News 

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు): మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్...
Read More...
Local News 

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ...
Read More...

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో   ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్ ఉదయం...
Read More...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు....
Read More...
State News 

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచింగ్‌ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని విద్యార్థులకు...
Read More...
State News 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు): తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను...
Read More...
National 

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన : పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ...
Read More...
Local News  State News 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం  సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):  ఛత్తీస్‌గఢ్‌ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది....
Read More...

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్ సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9: బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది. సమాచారం ప్రకారం, ఈ...
Read More...

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన “100...
Read More...