డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

On
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం


డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.


భారత దేశంలో 1986లో  వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం  వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్‌ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు. 

 నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఈ-కామర్స్‌, టెలిషాపింగ్‌ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు.  ప్రజలను మోసగించే సైబర్‌ నేరాలు దీని వల్ల  చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్‌ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. 
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.

జాతీయస్థాయిలో సెంట్రల్‌ కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది.  జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను  కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు. 

రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి 
 విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.

Tags
Join WhatsApp

More News...

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా...
Read More...

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో  గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి...
Read More...

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్,   ఈ కార్యక్రమం...
Read More...

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్    వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్)  సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్  తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న...
Read More...
Crime  State News 

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు): రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని,...
Read More...

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి మున్సిపల్ ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి  మున్సిపల్ ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు) ఎన్నికల కోడ్‌ నియమావళిని అందరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.  బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అడిషనల్...
Read More...
Local News  State News 

కరీంనగర్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: మంత్రులు

కరీంనగర్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: మంత్రులు   కరీంనగర్, జనవరి 28 (ప్రజా మంటలు): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,...
Read More...

ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జీఓ లు

ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జీఓ లు జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు)ఇటీవల షిరిడి లో నిర్వహించిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాల లో భాగంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు  మారం జగదీశ్వర్ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా  రెండవసారిఎన్నికైన సందర్బంగా  కరీంనగర్ టీఎన్జీవో భవన్ లో కరీంనగర్ జిల్లా...
Read More...

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ఎఫ్ సి ఐ స్టేట్ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి కిరణ్ దంపతులు 

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ఎఫ్ సి ఐ స్టేట్ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి కిరణ్ దంపతులు  అనంతపురం జనవరి ( 28 ప్రజా మంటలు)అనంతపురం జిల్లా కు నూతనంగా బాధ్యతలు తీసుకున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు . బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా..ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్...
Read More...