డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

On
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం


డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.


భారత దేశంలో 1986లో  వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం  వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్‌ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు. 

 నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఈ-కామర్స్‌, టెలిషాపింగ్‌ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు.  ప్రజలను మోసగించే సైబర్‌ నేరాలు దీని వల్ల  చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్‌ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. 
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.

జాతీయస్థాయిలో సెంట్రల్‌ కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది.  జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను  కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు. 

రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి 
 విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.

Tags
Join WhatsApp

More News...

State News 

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు): ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర...
Read More...
Local News 

శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి   జల అభిషేకం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి   జల అభిషేకం    జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో  అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు...
Read More...
Local News 

సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి 

సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి  జగిత్యాల    జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. జిల్లా కేంద్రంలోని...
Read More...
Local News 

ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ

ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు)  సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ  దంపతులు పాఠశాల యూనిఫామ్స్  అందజేశారు. శ్రీనివాస్  తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి ఈ...
Read More...
State News 

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు): సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప...
Read More...
Local News  State News 

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్ ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు): రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్‌వర్క్‌తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో...
Read More...
Local News 

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు    జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను  దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు... పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు       జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు ) కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి  డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి...
Read More...
Local News 

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి  ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో  వర్షపు నీరు సంరక్షణ...
Read More...
Local News 

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం    జగిత్యాల జులై 15(ప్రజా మంటలు) జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో  సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు  అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం...
Read More...
Local News 

చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో...
Read More...
State News 

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు) యూసుఫ్‌గూడ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్...
Read More...