డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.
భారత దేశంలో 1986లో వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు.
నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో, ఈ-కామర్స్, టెలిషాపింగ్ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలను మోసగించే సైబర్ నేరాలు దీని వల్ల చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు.
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.
జాతీయస్థాయిలో సెంట్రల్ కన్స్యూమర్ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్ అథారిటీకి ఉంటుంది. జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్లో ప్రెసిడెంట్తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు.
రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి
విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత రాజ్యాంగం ఎవరు రాశారు?
ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకుంటుంది. 1949లో ఇదే రోజున డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని స్వీకరించారు.భారత రాజ్యాంగం సాధారణమైన పత్రం కాదు; ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
1. ... శంషాబాద్ GMR ఏరోపార్క్లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
శంషాబాద్లోని GMR ఏరోపార్క్లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ... ఎన్విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?
భయాలతో $115 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి
న్యూయార్క్ నవంబర్ 26:
ప్రపంచ ఏఐ చిప్ రంగాన్ని దశాబ్దం పైగా ఆధిపత్యం చేసిన ఎన్విడియా షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. గూగుల్ తన స్వంత కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) మరింత శక్తిగా ముందుకు వస్తున్నాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో... దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ నవంబర్ 26:
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది.
ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ... ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న
తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు.
వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల... బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ
ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
✔ప్రభుత్వం హామీ (42%)
✘ అమలైన... చైనా–అరుణాచల్ పాస్పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన
న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి):
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది.
లండన్ నుంచి జపాన్కు ట్రాన్సిట్ ప్రయాణం... నల్లగొండ కాంగ్రెస్లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి... “ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):
జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని... ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) : తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు.
RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM... చాచా నెహ్రూ నగర్లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు):
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా... 