డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.
భారత దేశంలో 1986లో వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు.
నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో, ఈ-కామర్స్, టెలిషాపింగ్ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలను మోసగించే సైబర్ నేరాలు దీని వల్ల చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు.
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.
జాతీయస్థాయిలో సెంట్రల్ కన్స్యూమర్ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్ అథారిటీకి ఉంటుంది. జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్లో ప్రెసిడెంట్తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు.
రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి
విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
సందేశాత్మక చిత్రాలను ప్రజలు అదరించాలి తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్
మెట్ పెల్లి నవంబర్ 21(ప్రజా మంటలు)సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ సినీ నిర్మాతలు భరత్ కుమార్ అంకతి పుల్లూరి నవీన్ లు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర... ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ
ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ—“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం... గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల రాజకీయ కుట్ర
రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్
రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన జిల్లా తొలి జడ్పీ... బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు):
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత
మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి... హైదరాబాద్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐ క్యాంపస్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్... వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు.
మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య
.... కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... 