డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు. జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు.
1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని, ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి, పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు. తర్వాత ఠాగూర్కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి అనువదించారు కూడా.
ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.
నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో, ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.
జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది.
జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి, తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది.
పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
2వ చరణం... అహరహ తవ ఆహ్బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి), హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే,
ప్రేమ్ హార్ హొయె గాథా
జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
3వ చరణం... పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
సంకట దుఃఖ త్రాతా
జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
4వ చరణం... ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే, స్నేహమయి తుమి మాథా
జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!
5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే,
తవ చరణె నత మాథా
జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
More News...
<%- node_title %>
<%- node_title %>
2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన
న్యూఢిల్లీ ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ 2026-27 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 75 నిమిషాల తన ప్రసంగం, సామాన్యులను, స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేక పోయింది. దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగాలు, పన్ను సంస్కరణలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది.
Union Budget 2026-27... పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం
లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం
ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర బీమదేవరపల్లి మండలంలో ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. గ్రామాల నలుమూలల నుంచి మాత్రమే... పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి
ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు.... గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి
ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ... ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన
ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ... రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే... PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ - పోస్టర్ ఆవిష్కరణ
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
ఎఐజాక్ట్ పిలుపు మేరకు, పీఆర్టీయూ–టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ రద్దు మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్తో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న “చలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినిపెల్లి... పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు
గొల్లపల్లి, జనవరి 31 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమానికి మండల స్థాయి పూర్తి అధికారుల హాజరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన కీలక అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పౌరహక్కుల దినోత్సవం వంటి... కేసీఆర్పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిని సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యేనని జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ... ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ
జగిత్యాల జనవరి 31 ( ప్రజా మంటలు)జంతు సంక్షేమ పక్షోత్సవం కార్యక్రమం లో భాగంగా జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పురానిపేట జగిత్యాల లో జరిగిన కార్యక్రమం అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్. లత గారు మరియు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.ప్రకాష్ పాల్గొన్నారు... రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల జనవరి 31 (ప్రజా మంటలు)లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల, మరియు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు రోజు సందర్భంగా స్థానిక ఆర్డిఓ ఆఫీస్ ముందర హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలను నివారించడo, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడo,ప్రజలు... జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్... 