విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి
* సికింద్రాబాద్ పీజీ కాలేజీ వద్ద ఏబీవీపీ ధర్నా
* ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
నేడు ప్రవేశపెట్టబోయే రాష్ర్ట బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ 15 శాతం నిధులను కేటాయించాలని, తక్షణమే విద్యామంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ పీజీ కాలేజీ వద్ద ధర్నా నిర్వహించారు. కాలేజీ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్బంగా కూకల్ పల్లి విభాగ్ కన్వీనర్ శ్రీనాథ్, సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ చెర్క బాలు లు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్ షిప్ , పీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని, నూతన బిల్డింగ్స్ నిర్మించాలని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఓయూ వీసీ తీసుకువచ్చిన సర్క్యూలర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు పాండురంగా, అభి,జ్యోత్య్న, శివాని, పవన్, కృష్ణ,శ్రీకాంత్, రవి,రాజు, అభిలాష్, ప్రసాద్, పరమేశ్, అలిఫియా, అంకిత, ప్రణిత పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)