ద్వి చక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు మరియు 1 కారు స్వాదీనం
జగిత్యాల ఫిబ్రవరి 9( ప్రజా మంటలు )
ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారు అని పిర్యాదిదారుడు భారతపు పెద్ది రాజం s/o రాజం, r/o తిప్పన్నపేట గ్రామం అనునతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ SI సదాకర్ కేసు నమోదు చేసుకొని, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీం లో ఏర్పాటు చేయగా, జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ టీం ఆదివారం 09-02-2025 ఉదయం 05:30 గంటలకు తిప్పన్నపేట గ్రామ శివారులోని హుందాయి క్రేటా కారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా,
వారు,
1. జక్కుల గోపాల్ తండ్రి పేరు రాజన్న, వయస్సు 36 సంవత్సరాలు, కులము యాదవ,వృత్తి:డ్రైవర్
2.సింగం రాజు తండ్రి పేరు నారాయణ 37 సంవత్సరాలు కులము:గౌడ్, వృత్తి:డ్రైవర్
3.నేరెళ్ల నరేష్ తండ్రి పేరు వెంకటి గౌడ్ వయస్సు 35 సంవత్సరాలు కులము గౌడ, వృత్తి:డ్రైవర్
4.సంపతి కుమారస్వామి తండ్రి పేరు పోచయ్య, 27 సంవత్సరాలు, కులము యాదవ, వృత్తి:వ్యవసాయం r/o కలమడుగు గ్రామం, జన్నారం మండలం, జిల్లా మంచిర్యాల మరియు
5.బుర్ర రాజేందర్ తండ్రి పేరు సత్తయ్య గౌడ్, 27 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్ r/o తిర్యాని గ్రామం మరియు మండలం, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా
అనువారలను విచారించగా, వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్నామని, అట్టి దొంగిలించిన బైక్లను వారి స్వగృహంలో దాచి పెట్టినామని నేరం ఒప్పుకున్నారు. ఈ విధంగా వారు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో డిసెంబర్ నెలలో ఒక బైక్ ని దొంగిలించామని, అంతకు ముందు దండేపల్లి లోని వెలగనూర్ గ్రామం లో ఒక బైక్ ని, జనవరి నెలలో చిన్న బెల్లాల్ గ్రామం లోని ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ ని, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని ఒక బైక్ ని మరియు దండేపల్లి లోని ద్వారక గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లను దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు. వాటిని దాచిన అట్టి ప్రదేశాన్ని చూపెట్టినారు.
నిందుతుల నుండి స్వాదినం చేసుకున్న వాటి వివరాలు
1. రికవరీ చేసిన బైక్లు-5
2. క్రేటా కార్-1
3.మొబైల్ ఫోన్-5
ఈ రోజు వారిని జ్యూడిషల్ రిమాండ్ గురించి మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నామన్నారు.
ఇట్టి నిందితులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ CI కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ మరియు పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అభినందించారు.
డిఎస్పి,జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు) :
మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన... జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వచ్చే ఏడాది జరగనున్న ఎస్ఐఆర్, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన... కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం
బెంగళూరు డిసెంబర్ 25:
కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం
అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం... క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –
క్రైస్తవులకు శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.... కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు 50 మంది నాయకులు
బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్... శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి... తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి
కడలూరు, డిసెంబర్ 24:
తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు... కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో... ప్రజాపాలనలో రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దుర్భరం రిటైర్డ్ బెనిఫిట్స్ ని ఏక కాలంలో చెల్లించాలి. జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ నుండి రిటైర్డ్ అయినా ఉద్యోగుల... విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం....
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నారని దాని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు. స్థానిక తహశీల్ చౌరస్తాలోనిరసన ధర్నా చేపట్టిబంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు
ఈసందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు... 