ద్వి చక్ర వాహనాల  దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు   మరియు 1 కారు స్వాదీనం

On
ద్వి చక్ర వాహనాల  దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు   మరియు 1 కారు స్వాదీనం

జగిత్యాల ఫిబ్రవరి 9(   ప్రజా మంటలు     )     

ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారు అని పిర్యాదిదారుడు భారతపు పెద్ది రాజం s/o రాజం, r/o తిప్పన్నపేట గ్రామం అనునతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ SI సదాకర్   కేసు నమోదు చేసుకొని, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీం లో ఏర్పాటు చేయగా, జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ టీం ఆదివారం 09-02-2025  ఉదయం 05:30 గంటలకు తిప్పన్నపేట గ్రామ శివారులోని హుందాయి క్రేటా కారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా,
వారు,
1. జక్కుల గోపాల్ తండ్రి పేరు రాజన్న, వయస్సు 36 సంవత్సరాలు, కులము యాదవ,వృత్తి:డ్రైవర్
2.సింగం రాజు తండ్రి పేరు నారాయణ 37 సంవత్సరాలు కులము:గౌడ్, వృత్తి:డ్రైవర్
3.నేరెళ్ల నరేష్ తండ్రి పేరు వెంకటి గౌడ్ వయస్సు 35 సంవత్సరాలు కులము గౌడ, వృత్తి:డ్రైవర్
4.సంపతి కుమారస్వామి తండ్రి పేరు పోచయ్య, 27 సంవత్సరాలు, కులము యాదవ, వృత్తి:వ్యవసాయం  r/o కలమడుగు గ్రామం, జన్నారం మండలం, జిల్లా మంచిర్యాల మరియు 
5.బుర్ర రాజేందర్ తండ్రి పేరు సత్తయ్య గౌడ్, 27 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్ r/o తిర్యాని గ్రామం మరియు మండలం, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా 
అనువారలను విచారించగా, వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్నామని, అట్టి దొంగిలించిన బైక్లను వారి స్వగృహంలో దాచి పెట్టినామని నేరం ఒప్పుకున్నారు. ఈ విధంగా వారు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో డిసెంబర్ నెలలో ఒక బైక్ ని దొంగిలించామని, అంతకు ముందు దండేపల్లి లోని వెలగనూర్  గ్రామం లో ఒక బైక్ ని, జనవరి నెలలో చిన్న బెల్లాల్ గ్రామం లోని ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ ని, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని ఒక బైక్ ని మరియు దండేపల్లి లోని ద్వారక గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లను దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు. వాటిని దాచిన అట్టి ప్రదేశాన్ని చూపెట్టినారు. 
నిందుతుల నుండి స్వాదినం చేసుకున్న వాటి వివరాలు
1. రికవరీ చేసిన బైక్లు-5
2. క్రేటా కార్-1
3.మొబైల్ ఫోన్-5
ఈ రోజు వారిని జ్యూడిషల్ రిమాండ్ గురించి మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నామన్నారు. 


ఇట్టి నిందితులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ CI కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ మరియు  పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అభినందించారు.
డిఎస్పి,జగిత్యాల

Tags
Join WhatsApp

More News...

National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...
Local News 

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు  సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. మహాత్మ జ్యోతిరావు పూలే  ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.     ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి
Read More...
Local News 

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..   రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ...
Read More...
Local News 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన...
Read More...
State News 

దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం

దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం   చొప్పదండి, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): చొప్పదండి మండలంలోని కోనేరుపల్లె గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు “క్రీడా మిత్ర పంచాయతీ” ప్రణాళికలో భాగంగా యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.క్వాలిటీ...
Read More...
Local News  State News 

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని,...
Read More...
State News 

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం...
Read More...
State News 

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు   హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని...
Read More...
Local News 

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.రియల్ ఎస్టేట్...
Read More...
Local News 

జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ.

జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 10 ఏప్రిల్ ( ప్రజా మంటలు ) :  భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని హిందూ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలో మహిళలు బైక్...
Read More...