నిమ్స్ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్
నిమ్స్ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ
* లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు):
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ తన 19 వ లైబ్రరీని పంజాగుట్టలోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రి రేడియాలజీ అంకాలజీ విభాగంలో ఏర్పాటు చేశారు. మంగళవారం క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి లు ప్రారంభించారు. ఆసుపత్రిలోని అంకాలజీ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న క్యాన్సర్ పేషంట్ల కోసం ఆకర్షణ తాను సొంతంగా సేకరించిన, కొనుగోలు చేసిన 600 పుస్తకాలను ఈ లైబ్రరీలో పెట్టారు. ఈ పుస్తకాల పఠనంలో పేషంట్లు కొంత సాధారణ స్థితికి వస్తారనే ఆశతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపారు. చిన్న వయస్సులోనే పెద్ద మనసుతో తన పాకెట్ మనీతో పాటు పలు చోట్ల పుస్తకాలను సేకరిస్తూ అనాధ పిల్లలు, స్టూడెంట్స్, పేషంట్ల కోసం ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సీవీ ఆనంద్ ఆకర్షణ ను అభినందించారు. ఇప్పటివరకు ఆకర్షణ ఏర్పాటు చేసిన 19 ఓపెన్ లైబ్రరీల్లో మొత్తం 12605 పుస్తకాలను అందచేసినట్లు ఆకర్షణ తండ్రి సతీష్ తెలిపారు. మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభించనున్నామని, ప్రతి మెట్రో స్టేషన్ లో ప్రయాణీకుల కోసం లైబ్రరీలను అందుబాటులో ఉంటాయన్నారు. ఆకర్షణ ఏర్పాటు చేయబోయే 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ కు వస్తారని తెలిపారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఆకర్షణ ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి న్యూఢిల్లీ వెళ్ళి వచ్చారు. కార్యక్రమంలో రేడియేషన్ అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మోనికా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా... కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు
జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా... లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.
మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో
క్రిమినల్... ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) :
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్ప్రెసిడెంట్, సనత్నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల... అడ్డగుట్టలో అయ్యప్ప స్వామి పడిపూజ
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఇంద్రలక్ష్మీనగర్లో కాంగ్రెస్ నాయకుడు గంట రాజు సాగర్ నివాసంలో సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శరణుఘోషలతో కాలనీ మారుమోగగా, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపకటాక్షాలు ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెద్ద... పెన్షనర్లకు సత్వరసేవలు అందిస్తాం. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ .మధు కుమార్.
జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)పెన్షనర్లకు ట్రెజరీ శాఖ తరపున సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి ఎస్.మధు కుమార్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటీజేన్స్ కేంద్రంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం వేడుకలు రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలోఘనంగా... సోషల్ మీడియా స్టార్డమ్తో సర్పంచ్ పీఠం
భీమదేవరపల్లి, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
కలిసివచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో. సోషల్ మీడియా ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారిందనడానికి ఇది ఓ స్పష్టమైన ఉదాహరణ. లఘుచిత్రాల్లో నటిస్తూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఓ మహిళ ఇప్పుడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా నిలిచారు.
ఇటీవల తెలంగాణలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ... సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా
డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కు మార్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు... గాంధీ బస్ షెల్టర్ లో ప్రైవేట్ వాహనాలు..
సికింద్రాబాద్, డిసెంబ 17 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎంసీహెచ్ (మాతా,శిశు కేంద్రం) విభాగ భవనం సమీపంలో ఉన్న బస్ షెల్టర్ ప్రైవేట్ వాహనాలకు అడ్డగా మారింది. నిత్యం వివిద ప్రాంతాల నుంచి వందలాది మంది గర్బిణీలు, బాలింతలు, వారి సహాయకులు ఎంసీహెచ్ భవనానికి వైద్యానికి వస్తూ, పోతుంటారు. అయితే ఇక్కడి బస్ షెల్టర్... పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు.
పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్... ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... 