కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :
ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలవారిని కలిసి వారి వారి పిల్లలను జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేర్పించాలని కోరుతూ, ప్రత్యేకంగా ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా, మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కళాశాలనుండి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వారు కళాశాలలో ఉన్న వసతులు, మంచి విద్యను అందించేందుకు అధ్యాపకబృందం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు.
పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు.
తమ అధ్యాపక బృందమైన ncc కో ఆర్డినేటర్, జువాలజీ విభాగం పి. రాజు, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. GVR సాయిమధుకర్, పి.జి కో ఆర్డినేటర్, కామర్స్ విభాగం అంకం గోవర్ధన్, లైబ్రరియన్ కే. సురేందర్ తో పాటు పలువురు పట్టణ మరియు సమీప గ్రామాలలో పర్యటించి, అన్ని హంగులున్న sknr ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన చేపడతారని వివరించారు.
ఇంకా, కళాశాలకు 32 ఎకరాల భూదాత శ్రీ కాసుగంటి నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కాసుగంటి ట్రస్ట్ పేరిట, రాష్ట్ర బార్ కౌన్సిలర్ సభ్యులు కాసుగంటి లక్ష్మన్ కుమార్ నేత్రుత్వంలో ప్రతీ సంవత్సరం నాలుగు విభాగాలలో ప్రథమ స్థానం పొందిన నలుగురు విద్యార్థులకు సుమారు 2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందడం హర్షనీయమని కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు.
గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ప్రోత్సామునిస్తుందన్నారు.
కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.అరిగెల అశోక్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆడెపు శ్రీనివాస్ లతోపాటు అధ్యాపాక బృందం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, సిబ్బంది కందుకూరి శ్రీనివాస్, వేణు, గణపతి, ప్రమోద్, దివ్యరాణి, స్వరూప, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్... లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు... ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు... కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,... సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్–నాదర్గుల్–కందుకూర్ ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... 