కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :
ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలవారిని కలిసి వారి వారి పిల్లలను జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేర్పించాలని కోరుతూ, ప్రత్యేకంగా ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా, మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కళాశాలనుండి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వారు కళాశాలలో ఉన్న వసతులు, మంచి విద్యను అందించేందుకు అధ్యాపకబృందం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు.
పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు.
తమ అధ్యాపక బృందమైన ncc కో ఆర్డినేటర్, జువాలజీ విభాగం పి. రాజు, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. GVR సాయిమధుకర్, పి.జి కో ఆర్డినేటర్, కామర్స్ విభాగం అంకం గోవర్ధన్, లైబ్రరియన్ కే. సురేందర్ తో పాటు పలువురు పట్టణ మరియు సమీప గ్రామాలలో పర్యటించి, అన్ని హంగులున్న sknr ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన చేపడతారని వివరించారు.
ఇంకా, కళాశాలకు 32 ఎకరాల భూదాత శ్రీ కాసుగంటి నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కాసుగంటి ట్రస్ట్ పేరిట, రాష్ట్ర బార్ కౌన్సిలర్ సభ్యులు కాసుగంటి లక్ష్మన్ కుమార్ నేత్రుత్వంలో ప్రతీ సంవత్సరం నాలుగు విభాగాలలో ప్రథమ స్థానం పొందిన నలుగురు విద్యార్థులకు సుమారు 2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందడం హర్షనీయమని కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు.
గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ప్రోత్సామునిస్తుందన్నారు.
కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.అరిగెల అశోక్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆడెపు శ్రీనివాస్ లతోపాటు అధ్యాపాక బృందం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, సిబ్బంది కందుకూరి శ్రీనివాస్, వేణు, గణపతి, ప్రమోద్, దివ్యరాణి, స్వరూప, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్
జగిత్యాల, సెప్టెంబర్ 13( ప్రజా మంటలు) తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి యూ డబ్ల్యూ జె ఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జగిత్యాలలోని స్పైసీ హోటల్లో నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మిర్జా ఫజలుల్లా బేగ్ను తెలంగాణ... గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం
కీసర సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) కుందన్ పల్లి లోని గౌరీ ప్రియ కాలనీలో శనివారం కాలనీలో నూతనంగా గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ వారు గణేశ ఉత్సవాలు నిర్వహించడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించి ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు గూర్చి చర్చించి విధివిధానాలు ఖరారు... జపాన్లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి
కేరళ, సెప్టెంబర్ 11:
జపాన్లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వీ. దేవిక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
దేవిక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె... మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):
2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్క్లబ్లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్-1 అధికారులు
బీహార్లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం
ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్ రాష్ట్రానికి చెందిన గ్రూప్-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని... గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)
గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి... మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ... *కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్... "ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ
ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు.... #Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... 