పరమ భాగవతోత్తముడు అంబరీషుడు
ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల
పరమ భాగవతోత్తముడు అంబరీషుడు
ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 09:
భక్తి, శ్రద్ధ, విధేయతతో పరమ భాగవతోత్తముడు అంబరీషుడు శాప విముక్తుడై మరణాన్ని జయించిన ఘట్టం
భగవంతుడి భక్తిని ఎలా ఆచరించాలి అన్న సందేశాన్ని అందిస్తుందని
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, నటులు, చారిత్రక పరిశోధకులు, నాటక దర్శకులు, విశ్రాంత ప్రాచార్యులు, ఆధ్యాత్మిక ప్రాసంగికులు, విశేషించి పురాణ ప్రవాచకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సంగన భట్ల నర్సయ్య ఉద్ఘాటించారు.
ధర్మపురి క్షేత్రంలో కాకర్ల గోపాల్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో, పూర్వజులు కాశమ్మ, రాజ్య లక్ష్మమ్మల స్మృత్యర్థం కాకర్ల కృష్ణ, సనత్ శర్మ దంపతుల సహకారంతో,
నిర్వహించిన కార్యక్రమంలో స్కాంద పురాణ అంతర్గత కార్తిక మాస మహాత్మ్యం పురాణ ప్రవచనం గావించారు.
ఈ సందర్భంగా శనివారం స్కాంద పురాణం అంతర్గత కార్తిక మహాత్మ్యం పురాణ
ప్రవచనం ముగింపుగా అంబరీష ఉపాఖ్యాన అంశాలను వివరించారు.
అంబరీష మహారాజు కథ స్కంద పురాణంలోని కార్తీక మాసం సంబందిత కథలలో ముఖ్యమైనదన్నారు. అంబరీష మహారాజు ఎంతో భక్తిశ్రద్ధలతో వైష్ణవ భక్తుడిగా, శ్రీమహావిష్ణువు పట్ల పరమ భక్తిని కలిగి ఉండేవాడని, తన భార్యతో సహా ద్వాదశి రోజున కృష్ణ పక్షంలో ఏకాదశి వ్రతం ఆచరించాడన్నారు. ఈ వ్రతాన్ని ఎంతో నియమం, నియతంగా పాటించాడని, అంతేకాక, ద్వాదశి రోజు పరమ సంతోషంగా ప్రసాదం స్వీకరించేందుకు సిద్ధమయ్యాడని, ఆ సమయంలో ఆయన ఇంటికి దుర్వాస మహర్షి విచ్చేసిన సందర్భాన్ని వివరించారు.
అంబరీషుడు దుర్వాస మహర్షిని గౌరవంతో ఆహ్వానించి, ఆయనకు ఆహారం ఏర్పాటు చేయగా, దుర్వాసుడు తపస్కార్యాలకు వెళ్లి తిరిగి రాకముందే ద్వాదశి సమయం అయిపోతుందనే భయంతో అంబరీషుడు స్వల్పమాత్రలో జలమును స్వీకరించి వ్రతాన్ని ముగించాడన్నారు
దుర్వాసుడు తిరిగి వచ్చి జరిగింది తెలుసుకుని, కోపంతో అంబరీష మహారాజును శపించాడన్నారు. అంబరీషుడు తన సహనంతో భగవంతుని ఆశ్రయంతో శాపాన్ని సహించాడుని, శాపం ఎలాంటి విపత్తు కలిగించ కూడదని మహావిష్ణువు ఆగ్రహంతో దుర్వాసుని కోసం సుదర్శన చక్రాన్ని పంపి రక్షించిన నేపథ్యాన్ని సోదాహరణంగా వివరించారు.
కృష్ణ పూజతో ప్రారంభించి, వేద విదులు పెండ్యాల రాజేశ్ శర్మ ద్వారా శివార్చన గావించి, పౌరాణికులు డాక్టర్ సంగన భట్ల నరసయ్యను సాంప్రదాయ రీతిలో
నిర్వాహకులు, భక్తులు, బంధువులు ఘనంగా సన్మానించి ముగింపు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలో ఉన్న దొంగ మల్లన్న స్వామిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆదివారం దర్శించుకున్నారు. దండి ఆదివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి,... స్వగ్రామం అంతర్గామలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ దంపతులు
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)
రెండవ విడత ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తన స్వంత గ్రామం అంతర్గం లో ఓటు హక్కు వినియోగించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా. సంజయ్ కుమార్ రాధిక గోపాల్ రావు పేట గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత దంపతులు
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికలలో జగిత్యాల అర్బన్ మండలం గోపాల్ రావు పేట్ స్వగ్రామంలో జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ దంపతులు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల "చిరక్కల్ మహదేవన్" భోగోజి ముఖేష్ ఖన్నా స్వామి.
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) :
అయ్యప్ప స్వాములకు పరిచయం అక్కరలేని పేరు "చిరక్కల్ మహదేవన్".
"చిరక్కల్ మహదేవన్" అనేది కేరళకు చెందిన ఒక ప్రసిద్ధ ఏనుగు పేరు.
మహాదేవన్ అయ్యప్ప భక్తుడు ఒక శక్తివంతమైన ఏనుగు, ఇది సంప్రదాయ పూజలు చేసి, శబరిమల యాత్రలు చేసేది.
అలాంటి... ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్లో సీఎం రేవంత్రెడ్డి ఒక గోల్ సాధించగా, మెస్సీ రెండు గోల్స్తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్తో పాటు... నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్... వయోవృద్ధులకు టాస్కా ఆసరా. -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం ఆల్ సీనియర్ సిటీజేన్స్... సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి
కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల... రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్ డిసెంబర్ 13:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎల్కతుర్తి గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం
ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా... కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ... నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :
గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య):
గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో... 