పరమ భాగవతోత్తముడు అంబరీషుడు

ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల

On
పరమ భాగవతోత్తముడు అంబరీషుడు

పరమ భాగవతోత్తముడు అంబరీషుడు
ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి నవంబర్ 09:

 భక్తి, శ్రద్ధ, విధేయతతో పరమ భాగవతోత్తముడు అంబరీషుడు శాప విముక్తుడై మరణాన్ని జయించిన ఘట్టం 
 భగవంతుడి భక్తిని ఎలా ఆచరించాలి అన్న సందేశాన్ని అందిస్తుందని 
 ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, నటులు, చారిత్రక పరిశోధకులు, నాటక దర్శకులు, విశ్రాంత ప్రాచార్యులు, ఆధ్యాత్మిక ప్రాసంగికులు, విశేషించి పురాణ ప్రవాచకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సంగన భట్ల నర్సయ్య ఉద్ఘాటించారు.IMG-20241109-WA0399

 ధర్మపురి క్షేత్రంలో కాకర్ల గోపాల్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో, పూర్వజులు కాశమ్మ, రాజ్య లక్ష్మమ్మల స్మృత్యర్థం కాకర్ల కృష్ణ, సనత్ శర్మ దంపతుల సహకారంతో, 
నిర్వహించిన కార్యక్రమంలో స్కాంద పురాణ అంతర్గత కార్తిక మాస మహాత్మ్యం పురాణ ప్రవచనం గావించారు.

ఈ సందర్భంగా శనివారం స్కాంద పురాణం అంతర్గత కార్తిక మహాత్మ్యం పురాణ 
ప్రవచనం ముగింపుగా అంబరీష ఉపాఖ్యాన అంశాలను వివరించారు. 
అంబరీష మహారాజు కథ స్కంద పురాణంలోని కార్తీక మాసం సంబందిత కథలలో ముఖ్యమైనదన్నారు. అంబరీష మహారాజు ఎంతో భక్తిశ్రద్ధలతో వైష్ణవ భక్తుడిగా, శ్రీమహావిష్ణువు పట్ల పరమ భక్తిని కలిగి ఉండేవాడని, తన భార్యతో సహా ద్వాదశి రోజున కృష్ణ పక్షంలో ఏకాదశి వ్రతం ఆచరించాడన్నారు. ఈ వ్రతాన్ని ఎంతో నియమం, నియతంగా పాటించాడని, అంతేకాక, ద్వాదశి రోజు పరమ సంతోషంగా ప్రసాదం స్వీకరించేందుకు సిద్ధమయ్యాడని, ఆ సమయంలో ఆయన ఇంటికి దుర్వాస మహర్షి విచ్చేసిన సందర్భాన్ని వివరించారు.

అంబరీషుడు దుర్వాస మహర్షిని గౌరవంతో ఆహ్వానించి, ఆయనకు ఆహారం ఏర్పాటు చేయగా, దుర్వాసుడు తపస్కార్యాలకు వెళ్లి తిరిగి రాకముందే ద్వాదశి సమయం అయిపోతుందనే భయంతో అంబరీషుడు స్వల్పమాత్రలో జలమును స్వీకరించి వ్రతాన్ని ముగించాడన్నారు 

దుర్వాసుడు తిరిగి వచ్చి జరిగింది తెలుసుకుని, కోపంతో అంబరీష మహారాజును శపించాడన్నారు. అంబరీషుడు తన సహనంతో భగవంతుని ఆశ్రయంతో శాపాన్ని సహించాడుని, శాపం ఎలాంటి విపత్తు కలిగించ కూడదని మహావిష్ణువు ఆగ్రహంతో దుర్వాసుని కోసం  సుదర్శన చక్రాన్ని పంపి రక్షించిన నేపథ్యాన్ని సోదాహరణంగా వివరించారు. 
కృష్ణ పూజతో ప్రారంభించి, వేద విదులు పెండ్యాల రాజేశ్ శర్మ ద్వారా శివార్చన గావించి, పౌరాణికులు డాక్టర్ సంగన భట్ల నరసయ్యను సాంప్రదాయ రీతిలో 
 నిర్వాహకులు, భక్తులు, బంధువులు ఘనంగా సన్మానించి ముగింపు పలికారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

బాలుడిపై వీధి కుక్కల దాడి – స్వప్రేరితంగా కేసు నమోదు చేసిన  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

బాలుడిపై వీధి కుక్కల దాడి – స్వప్రేరితంగా కేసు నమోదు చేసిన  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): హయత్‌నగర్‌లో జరిగిన 8 ఏళ్ల మూగబాలుడు ప్రేమచంద్‌పై వీధికుక్కల దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) స్వప్రేరితంగా కేసు నమోదు చేసింది. గౌరవ ఛైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  ఆధ్వర్యంలో SR No.3907/2025 గా నమోదు చేసిన ఈ కేసు ప్రజా భద్రత,...
Read More...

ప్రజా భద్రతకు హోమ్ గార్డుల సేవలు అమూల్యము ఎస్పీ  అశోక్ కుమార్ 

ప్రజా భద్రతకు హోమ్ గార్డుల సేవలు అమూల్యము ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)    రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన హోమ్ గార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది.    ఈ సందర్భం గా ఎస్పి  మాట్లాడుతూ .. శాంతిభద్రత లు, ట్రాఫిక్‌, క్రైమ్‌ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్‌, విపత్తు నిర్వహణ...
Read More...
State News 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – పవన్ కళ్యాణ్ వివాదం: రైసింగ్ తెలంగాణ ఆహ్వానం చర్చనీయాంశం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – పవన్ కళ్యాణ్ వివాదం: రైసింగ్ తెలంగాణ ఆహ్వానం చర్చనీయాంశం హైదరాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు): తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ‘రైసింగ్ తెలంగాణ’ కార్యక్రమానికి ఆహ్వానించడంతో రాజకీయ వర్గాలలో కొత్త చర్చ మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ ప్రజల దృష్టి వల్ల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి”...
Read More...
National  Comment  International  

పుతిన్ భారత యాత్ర: భారత్ విదేశాంగ స్వతంత్రతకు  నిదర్శనం ?

పుతిన్ భారత యాత్ర: భారత్ విదేశాంగ స్వతంత్రతకు  నిదర్శనం ? నేటి నుండి రష్యా అధినేత వడ్లిమిర్ పుతిన్ భారత పర్యటన  2030 నాటికి $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం – ఆర్థికవేత్తలు ఏమంటున్నారు? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన భారత యాత్రతో, భారత్-రష్యా సంబంధాలు మరింత బలంగా మారాయి. ఈ పర్యటనలో భారత్ ఏ దేశానికీ “లొంగదు”, పశ్చిమ దేశాల ఒత్తిడికి లోబడదు,...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం జగిత్యాల డిసెంబర్  03 (ప్రజా మంటలు): వైకల్యం దేనికైనా అడ్డు రాదని నిరూపించే ఆదర్శనీయులు దివ్యంగులని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న...
Read More...
Edit Page Articles  International  

దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు

దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు (సిహెచ్ వి ప్రభాకర్ రావు) ఆధునిక అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. ప్రత్యేకంగా, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న శక్తి ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులతో సమసమాన దూరం పెట్టుకుంటూ—Strategic Autonomy అనే తన దౌత్య సిద్ధాంతాన్ని దృఢంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, యుకే, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు కలిసి Times...
Read More...
National  State News 

ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు

ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు న్యూ ఢిల్లీ డిసెంబర్04: ✈️ IndiGo విమానాలకు భారీ ఆలస్యాలు, రద్దులు – ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగిన రోజు దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ అయిన IndiGo భారీ విమాన లేటీలు, కొన్ని రద్దులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రూ కొరత తీవ్రంగా పెరగడంతో, మొత్తం కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 2న కేవలం 35% విమానాలే సమయానికి...
Read More...
Local News  State News 

త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా RTC ఎక్స్‌ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. అనంతరం 70...
Read More...
State News 

సీఎం రేవంత్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత

సీఎం రేవంత్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోజిస్తూ, తెలంగాణ జాగృతి ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సమర్పించిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. “ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం… సీఎం...
Read More...
Local News  State News 

తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన .హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్‌బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న...
Read More...
National  State News 

తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ ‌‌యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం

తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ ‌‌యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం విజిలెన్స్ దర్యాప్తు – ముఖ్య నివేదిక సీఎం వద్దకు కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది :  కోవర్ట్ పాత్రపై కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ హైదరాబాద్‌ డిసెంబర్ 03:తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యంత కీలక నిర్ణయాలు బహిర్గతం అవుతుండటంపై అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీ వంటి సున్నితమైన అంశం కేబినెట్‌లో...
Read More...
Local News 

కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం

కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం సికింద్రాబాద్‌, డిసెంబర్ 03 (ప్రజామంటలు):  కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు  ఎన్‌.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్‌జోన్ జోనల్ కమిషనర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్‌కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా...
Read More...