పరమ భాగవతోత్తముడు అంబరీషుడు

ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల

On
పరమ భాగవతోత్తముడు అంబరీషుడు

పరమ భాగవతోత్తముడు అంబరీషుడు
ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి నవంబర్ 09:

 భక్తి, శ్రద్ధ, విధేయతతో పరమ భాగవతోత్తముడు అంబరీషుడు శాప విముక్తుడై మరణాన్ని జయించిన ఘట్టం 
 భగవంతుడి భక్తిని ఎలా ఆచరించాలి అన్న సందేశాన్ని అందిస్తుందని 
 ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, నటులు, చారిత్రక పరిశోధకులు, నాటక దర్శకులు, విశ్రాంత ప్రాచార్యులు, ఆధ్యాత్మిక ప్రాసంగికులు, విశేషించి పురాణ ప్రవాచకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సంగన భట్ల నర్సయ్య ఉద్ఘాటించారు.IMG-20241109-WA0399

 ధర్మపురి క్షేత్రంలో కాకర్ల గోపాల్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో, పూర్వజులు కాశమ్మ, రాజ్య లక్ష్మమ్మల స్మృత్యర్థం కాకర్ల కృష్ణ, సనత్ శర్మ దంపతుల సహకారంతో, 
నిర్వహించిన కార్యక్రమంలో స్కాంద పురాణ అంతర్గత కార్తిక మాస మహాత్మ్యం పురాణ ప్రవచనం గావించారు.

ఈ సందర్భంగా శనివారం స్కాంద పురాణం అంతర్గత కార్తిక మహాత్మ్యం పురాణ 
ప్రవచనం ముగింపుగా అంబరీష ఉపాఖ్యాన అంశాలను వివరించారు. 
అంబరీష మహారాజు కథ స్కంద పురాణంలోని కార్తీక మాసం సంబందిత కథలలో ముఖ్యమైనదన్నారు. అంబరీష మహారాజు ఎంతో భక్తిశ్రద్ధలతో వైష్ణవ భక్తుడిగా, శ్రీమహావిష్ణువు పట్ల పరమ భక్తిని కలిగి ఉండేవాడని, తన భార్యతో సహా ద్వాదశి రోజున కృష్ణ పక్షంలో ఏకాదశి వ్రతం ఆచరించాడన్నారు. ఈ వ్రతాన్ని ఎంతో నియమం, నియతంగా పాటించాడని, అంతేకాక, ద్వాదశి రోజు పరమ సంతోషంగా ప్రసాదం స్వీకరించేందుకు సిద్ధమయ్యాడని, ఆ సమయంలో ఆయన ఇంటికి దుర్వాస మహర్షి విచ్చేసిన సందర్భాన్ని వివరించారు.

అంబరీషుడు దుర్వాస మహర్షిని గౌరవంతో ఆహ్వానించి, ఆయనకు ఆహారం ఏర్పాటు చేయగా, దుర్వాసుడు తపస్కార్యాలకు వెళ్లి తిరిగి రాకముందే ద్వాదశి సమయం అయిపోతుందనే భయంతో అంబరీషుడు స్వల్పమాత్రలో జలమును స్వీకరించి వ్రతాన్ని ముగించాడన్నారు 

దుర్వాసుడు తిరిగి వచ్చి జరిగింది తెలుసుకుని, కోపంతో అంబరీష మహారాజును శపించాడన్నారు. అంబరీషుడు తన సహనంతో భగవంతుని ఆశ్రయంతో శాపాన్ని సహించాడుని, శాపం ఎలాంటి విపత్తు కలిగించ కూడదని మహావిష్ణువు ఆగ్రహంతో దుర్వాసుని కోసం  సుదర్శన చక్రాన్ని పంపి రక్షించిన నేపథ్యాన్ని సోదాహరణంగా వివరించారు. 
కృష్ణ పూజతో ప్రారంభించి, వేద విదులు పెండ్యాల రాజేశ్ శర్మ ద్వారా శివార్చన గావించి, పౌరాణికులు డాక్టర్ సంగన భట్ల నరసయ్యను సాంప్రదాయ రీతిలో 
 నిర్వాహకులు, భక్తులు, బంధువులు ఘనంగా సన్మానించి ముగింపు పలికారు.

Tags
Join WhatsApp

More News...

National  Filmi News  State News 

‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన

‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన కొత్త విడుదల తేదీ త్వరలో!ప్రకటిస్తారు? హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):  బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చింది. చిత్ర విడుదల కోసం చివరి దశ పనులు పూర్తిచేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది. నిర్మాణ సంస్థ...
Read More...
State News 

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్! కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ...
Read More...
State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని...
Read More...
Local News 

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) : తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుంద‌ని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ...
Read More...

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు
Read More...

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి.
Read More...
State News 

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్‌లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు. తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం...
Read More...
National  Comment 

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి? గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం. దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు...
Read More...
National  International   State News 

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం బర్మింగ్‌హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు): అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది...
Read More...

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు హైదరాబాద్‌, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్‌ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు...
Read More...
State News 

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా, అలాగే ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా...
Read More...

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత    జగిత్యాల డిసెంబర్  5 (ప్రజా మంటలు) పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ ఆటల పోటీలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి. ఎస్ లత ప్రారంభించారు. జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలి...
Read More...