కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్

On
కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) : 

ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి.

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్ 

 తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)3వ జనరల్ కౌన్సిల్ సమావేశం స్థానిక డి సి ఈ బి కార్యాలయంలో, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది.

ఇట్టి సమావేశానికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ...

గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం బదిలీలు,పదోన్నతులు-ఉపాధ్యాయుల నూతన నియామకం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లో గత ప్రభుత్వము మాదిరిగానే వ్యవహరిస్తోందని,5 డి.ఏ.లు పెండింగ్ లో ఉండగా ఒక్క డి.ఏ.మాత్రమే మంజూరు చేసిన తీరు ఉద్యోగ-ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ-నిస్పృహలకు గురిచేసిందని,ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే ఉద్యోగ-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన విద్య కావాలని,అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని,ప్రాథమిక తరగతులలో మాతృభాషలో విద్య ఉండాలని, ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి,మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక తరగతుల్లో కూడా ఆటల కొరకు పి ఈ టి టీచర్ ను నియమించాలని తద్వారా సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని, దానికి కావాల్సిన చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇట్టి జనరల్ కౌన్సిల్ సమావేశంలో టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షులుగా కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వి సత్య ప్రకాష్, సిహెచ్ సత్యం, గండి రాజయ్య, ఎలిగేటి సంజీవరాణి,కూరగాయల చంద్రశేఖర్,చింత మోహన్ ప్రసాద్ ,రాచమల్ల మహేష్, పాక కుమారస్వామి,జిల్లా కార్యదర్శులుగా పి రాజనర్సయ్య,వేముల సుధాకర్, పొన్నం శ్రీనివాస్, పిన్నంశెట్టి శివరంజని, గుడిసె రమేష్, కాచర్ల నాగరాజు, ఎక్కలదేవి రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి సత్యస్వామి, సభ్యులుగా ఆర్మూర్ భీమరాజు,ఏ.రాజ మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా లావుడ్య రాజయ్య ,ఎండి ఫక్రుద్దీన్,ఎల్ మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా కొలుగూరి కిషన్ రావు,బోగ రమేష్,గొడుగు రఘుపతి యాదవ్,పి కల్పన తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇట్టి ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య,పరిశీలకులుగా లక్ష్మయ్య యాదవ్ లు వ్యవహరించారు.

ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఫెడరేషన్ నాయకులు సూద రాజేందర్,నాగేంద్రం,రవీందర్ వివిధ మండలాల బాధ్యులు చిర్నేని రాజిరెడ్డి,కొత్త రాంకుమార్,గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,ఆసం శ్రీనివాస్,గజ్జల లచ్చయ్య, ఐల రఘుపతి,గొల్లపల్లి సత్యనారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి కందుకూరి శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, వహీద్, సలాముద్దీన్, సిరికొండ వేణు, జి చంద్రమౌళి,గంగారాం,రాజేశం మహిళా ఉపాధ్యాయులు వనిత,, మంజుల, సునీత ,సంజీవరాణి, శివరంజని ,పప్పీరాణి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి...
Read More...
State News  Spiritual  

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి...
Read More...
Local News 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.    జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు,  శాసన...
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.   హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వైదిక...
Read More...
Local News 

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి.  ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ    జగిత్యాల మే 10 (ప్రజా మంటలు  ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా...
Read More...
Local News 

ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి

ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి    సారంగపూర్ మీ 10 ( ప్రజా మంటలు)మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టా మరియు పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు దీవెనలు అందరి పైన పైన ఉండాలనీ అన్నింటి కన్న ప్రమాదకరమైన వృత్తి...
Read More...
Local News 

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ మే 10(ప్రజా మంటలు)  మండలము  లచ్చక్క పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  రేణుక ఎల్లమ్మ దయతో పాడి పంటలు ,ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ రక్షణకు అందరూ పాటుపడాలన్నారు. ఇతర...
Read More...
State News 

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు హైదరాబాద్ మే 10 (ప్రజా మంటలు): ఉద్యమకారుల డిమాండ్లకు మద్దతుగా, హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువుఅమలు లేకపోతే ఉద్యమకారులతో కలిసి ఆందోళనకు హెచ్చరిక చేస్తూ,  టి ఆర్ఎస్ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘాల...
Read More...
Local News 

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్    జగిత్యాల మే 8(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.      సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రతినెల...
Read More...
Local News 

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు): కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను...
Read More...