కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి.
టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)3వ జనరల్ కౌన్సిల్ సమావేశం స్థానిక డి సి ఈ బి కార్యాలయంలో, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఇట్టి సమావేశానికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ...
గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం బదిలీలు,పదోన్నతులు-ఉపాధ్యాయుల నూతన నియామకం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లో గత ప్రభుత్వము మాదిరిగానే వ్యవహరిస్తోందని,5 డి.ఏ.లు పెండింగ్ లో ఉండగా ఒక్క డి.ఏ.మాత్రమే మంజూరు చేసిన తీరు ఉద్యోగ-ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ-నిస్పృహలకు గురిచేసిందని,ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే ఉద్యోగ-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన విద్య కావాలని,అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని,ప్రాథమిక తరగతులలో మాతృభాషలో విద్య ఉండాలని, ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి,మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక తరగతుల్లో కూడా ఆటల కొరకు పి ఈ టి టీచర్ ను నియమించాలని తద్వారా సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని, దానికి కావాల్సిన చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇట్టి జనరల్ కౌన్సిల్ సమావేశంలో టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షులుగా కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వి సత్య ప్రకాష్, సిహెచ్ సత్యం, గండి రాజయ్య, ఎలిగేటి సంజీవరాణి,కూరగాయల చంద్రశేఖర్,చింత మోహన్ ప్రసాద్ ,రాచమల్ల మహేష్, పాక కుమారస్వామి,జిల్లా కార్యదర్శులుగా పి రాజనర్సయ్య,వేముల సుధాకర్, పొన్నం శ్రీనివాస్, పిన్నంశెట్టి శివరంజని, గుడిసె రమేష్, కాచర్ల నాగరాజు, ఎక్కలదేవి రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి సత్యస్వామి, సభ్యులుగా ఆర్మూర్ భీమరాజు,ఏ.రాజ మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా లావుడ్య రాజయ్య ,ఎండి ఫక్రుద్దీన్,ఎల్ మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా కొలుగూరి కిషన్ రావు,బోగ రమేష్,గొడుగు రఘుపతి యాదవ్,పి కల్పన తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇట్టి ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య,పరిశీలకులుగా లక్ష్మయ్య యాదవ్ లు వ్యవహరించారు.
ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఫెడరేషన్ నాయకులు సూద రాజేందర్,నాగేంద్రం,రవీందర్ వివిధ మండలాల బాధ్యులు చిర్నేని రాజిరెడ్డి,కొత్త రాంకుమార్,గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,ఆసం శ్రీనివాస్,గజ్జల లచ్చయ్య, ఐల రఘుపతి,గొల్లపల్లి సత్యనారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి కందుకూరి శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, వహీద్, సలాముద్దీన్, సిరికొండ వేణు, జి చంద్రమౌళి,గంగారాం,రాజేశం మహిళా ఉపాధ్యాయులు వనిత,, మంజుల, సునీత ,సంజీవరాణి, శివరంజని ,పప్పీరాణి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు. జనగామ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం — ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టి ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
ll హఫీజ్పేట్లో రుమాల్ హోటల్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
హైదరాబాద్ హఫీజ్పేట్లోని రుమాల్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన
పూడూరు నవంబర్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి పై శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామం వద్ద స్థానిక రైతులు రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం
పూడూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు లేకపోవడం, ప్రభుత్వ... కరీంనగర్లో అమానవీయ ఘటన:
కరీంనగర్ నవంబర్ 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి ప్రాంతంలో శుక్రవారం ఉదయం అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, పిల్లల అంగవైకల్యం కారణంగా తండ్రి మల్లేశం తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కూతురిని హత్య చేసిన మల్లేశంమల్లేశం ముందుగా తన... ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని... రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.
మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్)
పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
కార్తీక ఏకాదశి పర్వదినాన... రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
హైదరాబాద్కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్ను పొందిన వారిలో ఆమెనే... వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి
సికింద్రాబాద్, నవంబర్ 15 ( ప్రజా మంటలు):
ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు.... గ్లోబ్ ట్రాటర్ (SSMB29) – మహేష్ బాబు, రాజమౌళి సినిమా టీజర్ విడుదల
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్–వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్ SSMB29), అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్తో గ్రాండ్ ఈవెంట్లో టీజర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫస్ట్... 