ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్
వెల్గటూరు సెప్టెంబర్ 11:
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారాన్ని మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డికి,ప్రభుత్వానికి విప్ లక్ష్మణ్ కుమార్ దన్యవాదాలు తెలిపారు.
10 సంవత్సరాలు నిర్వాసితుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు మా పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయనీ అన్నారు.
వెల్గటూర్ మండలానికి చెందిన 45,05,220 లక్షల రూపాయల విలువ గల 45 చెక్కులను మరియు ఎండపెల్లి మండలానికి చెందిన 31,03,596 లక్షల రూపాయల విలువ గల 31 చెక్కులను అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బుధవారం రోజున వెల్గటూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.
అనంతరం వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేటకు చెందిన ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 52 లక్షల విలువ గల 24 పరిహార చెక్కులను జిల్లా RDO గారితో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న ప్రతి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని,శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన ముక్కట్రావు పేట గ్రామనికి చెందిన 24 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,పరిహారం అందని వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని,అదే విధంగా చేగ్యం గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి,మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అట్టి డబ్బులను కూడా మంజూరు చేయించడం జరిగిందని,వాటిని కూడా త్వరలోనే నిర్వాసితులకు పంపిణీ చేస్తామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని,10 సంవత్సరాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల గురించి పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వారి మాటలపై అప్రమత్తంగా ఉండాలని,నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని,మి ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని,ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – పవన్ కళ్యాణ్ వివాదం: రైసింగ్ తెలంగాణ ఆహ్వానం చర్చనీయాంశం
హైదరాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ‘రైసింగ్ తెలంగాణ’ కార్యక్రమానికి ఆహ్వానించడంతో రాజకీయ వర్గాలలో కొత్త చర్చ మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ ప్రజల దృష్టి వల్ల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి”... పుతిన్ భారత యాత్ర: భారత్ విదేశాంగ స్వతంత్రతకు నిదర్శనం ?
నేటి నుండి రష్యా అధినేత వడ్లిమిర్ పుతిన్ భారత పర్యటన
2030 నాటికి $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం – ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన భారత యాత్రతో, భారత్-రష్యా సంబంధాలు మరింత బలంగా మారాయి. ఈ పర్యటనలో భారత్ ఏ దేశానికీ “లొంగదు”, పశ్చిమ దేశాల ఒత్తిడికి లోబడదు,... సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం
జగిత్యాల డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
వైకల్యం దేనికైనా అడ్డు రాదని నిరూపించే ఆదర్శనీయులు దివ్యంగులని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న... దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఆధునిక అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. ప్రత్యేకంగా, భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న శక్తి ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులతో సమసమాన దూరం పెట్టుకుంటూ—Strategic Autonomy అనే తన దౌత్య సిద్ధాంతాన్ని దృఢంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, యుకే, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు కలిసి Times... ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు
న్యూ ఢిల్లీ డిసెంబర్04:
✈️ IndiGo విమానాలకు భారీ ఆలస్యాలు, రద్దులు – ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగిన రోజు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్ అయిన IndiGo భారీ విమాన లేటీలు, కొన్ని రద్దులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రూ కొరత తీవ్రంగా పెరగడంతో, మొత్తం కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
డిసెంబర్ 2న కేవలం 35% విమానాలే సమయానికి... త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా RTC ఎక్స్ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ను ప్రారంభించారు. అనంతరం 70... సీఎం రేవంత్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత
హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోజిస్తూ, తెలంగాణ జాగృతి ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సమర్పించిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
“ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం… సీఎం... తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన
.హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్బీ నగర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న... తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం
విజిలెన్స్ దర్యాప్తు – ముఖ్య నివేదిక సీఎం వద్దకు
కాంగ్రెస్కు పెద్ద ఇబ్బంది :
కోవర్ట్ పాత్రపై కాంగ్రెస్లో తీవ్ర చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 03:తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యంత కీలక నిర్ణయాలు బహిర్గతం అవుతుండటంపై అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీ వంటి సున్నితమైన అంశం కేబినెట్లో... కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజామంటలు):
కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు ఎన్.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్జోన్ జోనల్ కమిషనర్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా... హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను... భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ... 