డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :
పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం, మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని
గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా కలెక్టర్ కమిషనర్ ని ఆదేశించారని అన్నారు.
అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.
520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
న్యాక్ సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.
టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.
బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.
జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు.
, మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా... మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ అమలు) విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు
జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ... దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత
ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్... ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.
జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి... యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు
న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు... నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .
జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా
ఎమ్మెల్యే సంజయ్తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్... చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను... 