డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :
పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం, మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని
గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా కలెక్టర్ కమిషనర్ ని ఆదేశించారని అన్నారు.
అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.
520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
న్యాక్ సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.
టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.
బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.
జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్పై మహిళా న్యాయవాదుల నిరసన
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ బార్ కౌన్సిల్లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
బార్ కౌన్సిల్ ఏర్పాటైన... సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
గ్రామీణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ములుకనూరు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్గా విజయం సాధించిన జాలి ప్రమోద్ రెడ్డితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి... సైబర్ మోసాలకు ఫుల్స్టాప్ : వంగరలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
సైబర్ మోసాలకు పూర్తిగా చెక్ పెట్టే లక్ష్యంతో భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్స్టేషన్ అధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంగర ఎంసీఆర్బి గోదాం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జి. దివ్య మాట్లాడుతూ, ఇటీవలి... ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
*ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష*జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)రెండవ విడత జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడవ ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
అనంతరం ఎన్నికల నిర్వహణ... ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాత్
(ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు)
ధర్మపురి సీఐ రాంనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం జగిత్యాల... గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం
ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్... కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన
న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల... దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత..." "ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి..." డా. భోగ శ్రావణి బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
"జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే నిర్వహించబడుతున్న మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ... 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 ( ప్రజా మంటలు)
S. వేణు గోపాల్ 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండరి ట్రస్టి చైర్మన్ శ్రీమతి చెల్లం స్వరూప ఆధ్వర్యంలో విశేష సంఖ్యలో మాతలు పాల్గొని... మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన అన్నా హజారే — మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
పుణె డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
దేశాన్ని ఒకప్పుడు కదిలించిన మహా నిరసనల నాయకుడు అన్నా హజారే… బీజేపీ ప్రభుత్వంపై పలుమార్లు కోరినా, ఆయన మళ్లీ ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంపై దీక్ష ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ ఏర్పడింది.
88 ఏళ్ల అన్నా హజారే,జనవరి 30 నుంచి స్వగ్రామం... తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ప్రతి సారి వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా, వెంటనే కోర్టు పిటిషన్లు, విచారణలు జరుగుతుండటం సాధారణమైంది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్పై విచారణలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం... 