డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

On
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :

పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం,  మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని

గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా  కలెక్టర్  కమిషనర్ ని ఆదేశించారని అన్నారు. 

అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.

520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
 న్యాక్  సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి  రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ  గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.

టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.

బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.

జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ  లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

 విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మార్చ్ 29 (ప్రజా మంటలు): విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గం గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన గడ్డం మహిపాల్ రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం అంతర్గం...
Read More...
National  Opinion  State News 

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం 

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం  - సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్  🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యండా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో,  శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు,...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం

అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం    జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సీతారామచంద్రస్వామి ఆలయం (ఎడ్లంగడి) లో శుక్రవారం సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించగా శనివారం పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విషెస్ సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వేదికపై సీతారాముల పరివారం ఉత్సవమూర్తులను...
Read More...
State News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం  ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు): ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి....
Read More...
Local News 

జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన

జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన జగిత్యాల మార్చ్ 28 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్‌లో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న సేవలను పరిశీలిస్తూ, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇటీవల ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్‌ను కూడా సందర్శించి...
Read More...
National  Local News  International   Social  State News 

పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!!

పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113).  హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) :  పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు?  పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష. మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్.  కానీ భారతీయులకు...
Read More...
Local News 

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం జగిత్యాల, మార్చి 27 (ప్రజా మంటలు): ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య (85) అనారోగ్యంతో మరణించారు. ఆదివారం 29 వ తేదీన జగిత్యాల లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.   జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మంచాలబీసీ...
Read More...
National  State News 

ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ?

ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ? నిజామాబాద్, మార్చ్ 27 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ అయిన తెలంగాణ జాగృతి త్వరలో రాజకీయ పార్టీగా మారబోతోందని వెల్లడించారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు...
Read More...
Local News 

టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా  అణిముత్యాలు  దొంతి రాజేశ్వరి గీర్దావర్  మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము

టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా  అణిముత్యాలు  దొంతి రాజేశ్వరి గీర్దావర్  మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము    జగిత్యాల మార్చి 26 (ప్రజా మంటలు) దొంత రాజేశ్వరి గిర్ధవర్ ఆర్చరికి ఘన సన్మానం దొంత రాజేశ్వరి గిర్దావర్ వెల్గటూర్        మండలం   ఓపెన్ మాస్టర్ గేమ్స్ 2025 లో నేషనల్ గేమ్స్ గోవా : బంగారు పథకం ఉత్తరఖాండు :బంగారు పథకం హిమాచల్ ప్రదేశ్ : బంగారు పథకం సౌత్ కొరియ : 2023 లో...
Read More...
Local News 

మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన  మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”*

మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన  మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”* *“ జగిత్యాల మార్చి 26 ప్రజా మంటలు)  జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో...
Read More...
Crime  State News 

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన...
Read More...
National  State News 

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు): రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్  ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయాన్ని...
Read More...