డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :
పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం, మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని
గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా కలెక్టర్ కమిషనర్ ని ఆదేశించారని అన్నారు.
అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.
520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
న్యాక్ సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.
టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.
బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.
జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ
గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్గా నన్ను గెలిపించిన సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ
గొల్లపల్లి... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మరిచిపోయింది - కవిత
కొత్తగూడెం డిసెంబర్ 18 :ప్రజా మంటలు)::తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రెండు రోజుల పాటు జిల్లాలో ప్రజల సమస్యలను తెలుసుకొని, బాధితులతో నేరుగా మాట్లాడి పరిష్కార దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇల్లందు: దర్గా–ఆలయ సందర్శన, మత సామరస్యానికి నిదర్శనం... వృద్ధుడి దప్పు మల్లయ్య పరిస్థితిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సువో–మోటో కేసు
హైదరాబాద్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తను ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. షమీం అక్తర్ సువో–మోటోగా పరిగణనలోకి తీసుకున్నారు. రంగా రెడ్డి జిల్లా, కోతూర్ మండలం, మల్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు దప్పు మల్లయ్య తన సంతానం నిర్లక్ష్యానికి గురై, ఆస్తి నుంచి... డిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీ కి కనువిప్పు కలుగాలి... వేధింపుల రాజకీయం మానుకొని.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి... ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ఇందిరా భవన్ నుండి తహశీల చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులూ,కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు
తహసిల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల బైఠాయించారు
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియా... ఈ నెల 24 న పెన్షనర్ల నిరాహార దీక్షలు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడి.
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రాలలో ఈ నెల 24 న నిరాహార దీక్షలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడించింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు ఏ.నరేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ... మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు సహస్ర వస్త్రాల అలంకరణ ప్రత్యేక పూజలు
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా గురువారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించి సహస్ర లింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించి సహస్ర లింగాలకు భక్తుల స్వహస్తాలతో అభిషేకించి చక్కగా వస్త్రాలతో అలంకరించి... మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పలువురుపై వెలుగటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
వెల్గటూర్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ 17 వ తేదీన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు... రాయికల్ మండలం పలు గ్రామపంచాయతీ సర్పంచి వార్డు సభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)మండలం మాంఖ్యనాయక్ తండ సర్పంచ్ గా మాలోత్ తిరుపతి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు నూతనంగా ఎన్నికైనందున మరియు ఓడ్డేలింగాపూర్ ఉపసర్పంచిగా బుక్యా శేఖర్ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..... జగిత్యాల రూరల్ /బీర్పూర్/ సారంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించి శాలువ తో
సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్జగిత్యాల/ బీర్పూర్/ సారంగాపూర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామం వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..బీర్పూర్ .....మండలం చర్లపల్లి గ్రామం సర్పంచ్ గా... 1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి?
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)
మహారాష్ట్రలో జనన ధ్రువపత్రాల భారీ స్కామ్:
ముంబై డిసెంబర్ 18:
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న శేందుర్సనీ గ్రామ పంచాయతీలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 27,397 జననాలు నమోదవడం అధికారులను అవాక్కయ్యేలా... అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే
యాది....
*అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.
- అల్లె రమేష్
*మానేటి మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు
సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన
తెలుగు... ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం
కరీంనగర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రభుత్వం ముందుగా 20వ తేదీన నూతనంగా ఏర్పడిన గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి నిర్ణయించగా ఆ ముహూర్తం బాగాలేదని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్యులు ప్రభుత్వానికి ,ప్రభుత్వ పెద్దలకు సూచించడంతో వారు ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని 22వ తేదీ... 