డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

On
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :

పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం,  మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని

గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా  కలెక్టర్  కమిషనర్ ని ఆదేశించారని అన్నారు. 

అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.

520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
 న్యాక్  సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి  రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ  గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.

టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.

బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.

జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ  లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):  పంచాయతి ఎన్నికలు -2025  మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు....
Read More...
Local News 

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం  అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ  గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు  తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి...
Read More...

ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...

ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...   కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా    మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో  కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల  దుస్తువులను  కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని...
Read More...
Local News  State News 

హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి 

హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి  గాంధీ ఏఆర్‌టీ సెంటర్ లో అందుబాటులో  చక్కటి వైద్యం సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) :  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్  నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు. అనంతరం ఎ ఆర్...
Read More...

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)   మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR  అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిధిలో  పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136  మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది

ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని  ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు...
Read More...
Local News  State News 

ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్

ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెం‍బర్ 01 ( ప్రజా మంటలు): ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్‌పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు ప్రతీక అయిన ఈశ్వరీబాయి 100 ఏళ్ల క్రితమే లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత...
Read More...

‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?

 ‘భూతశుద్ధి వివాహం’  అంటే ఏమిటి? హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు): సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈషా నిర్వాహకుల వివరణ ప్రకారం, భూతశుద్ధి వివాహం అనేది...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి.                -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.      

సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి.                -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 01 (ప్రజా మంటలు): తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ డిమాండ్లు సత్వరం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని టాస్కా కార్యాలయంలో అయన విలేకరులతో  మాట్లాడారు.సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కారం, సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్...
Read More...
National  Filmi News  State News 

సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం

 సినీనటి  సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరులో  హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు): టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా...
Read More...

ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ    సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ...
Read More...

గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు

గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు   జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక  కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఉదయం  సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18...
Read More...