ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచన? ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల కినుకు
ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచన? ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల కినుకు
జగిత్యాల జూన్ 24:
జగిత్యాల రాజకీయాలలో అనుకోని మలుపులు తిరిగి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
జగిత్యాల శాసనసభ్యుడిగా గత ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ముందు తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కొత్తవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి మనస్థాపం చెందినట్లు తెలుస్తుంది.
ఈరోజు ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులతో ఫోన్లో సంప్రదించిన జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన అనుచర వర్గం తెలిపింది.హైదారాబాద్ లోని సీనియర్ నాయకులు కొంత కాలం ఓపిక పట్టమని సలహా ఇచ్చినట్లు, ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఒనగూరే లాభం ఏమి లేదని చెప్పినట్లు తెలుస్తుంది.
ఈరోజు ఉదయం నుండి జగిత్యాల లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చిస్తున్న జీవన్ రెడ్డి తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను హఠాత్తుగా పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.
గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న జీవన్ రెడ్డి. గతంలో మంత్రిగా కొనసాగారు. జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి ని కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించడం స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జీవన్ రెడ్డి పై పోటీ చేసి గెలిచిన సంజయ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎటు తోచని దుస్థితిలో ఉన్నారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీలోని చిన్న నాయకులు కార్యకర్తలు పార్టీలో తమ భవిష్యత్తు ఏమిటా అని జిల్లాలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో తమకు నాయకత్వం కొరబడిందని, రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని దిగులు పడుతున్నారు.
జీవన్ రెడ్డి ప్రకటించబోయే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని, ఇన్నాళ్లుగా బిజెపి, బీఆర్ఎస్ పార్టీలతో పోటీపడి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఆయన రాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అన్ని వర్గాల వారు చర్చించుకుంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా... జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు
జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,... అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?
చెన్నై మార్చ్ 19:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు... తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల
హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.
రూ.2,15,200... ఆరెకటిక సంఘం భవననిధులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతి
జగిత్యాల మార్చి 19 ప్రజా మంటలుజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో కలిసిన జగిత్యాల ఆరెకటిక సంఘం సభ్యులు.జగిత్యాల కటికవాడలో ఆరెకటిక సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్
జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.ఈ సందర్భంగా ప్రత్యేక... వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు
వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లో... విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు) విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్.
ఇట్టి కార్యక్రమములో సంఘ సభ్యులు చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు బొల్లరపు గిరిధర్ స్వప్న, దయాల... జగిత్యాలలో కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి... రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్ కారు ఎక్కనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి... 