ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచన? ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల కినుకు
ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచన? ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల కినుకు
జగిత్యాల జూన్ 24:
జగిత్యాల రాజకీయాలలో అనుకోని మలుపులు తిరిగి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
జగిత్యాల శాసనసభ్యుడిగా గత ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ముందు తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కొత్తవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి మనస్థాపం చెందినట్లు తెలుస్తుంది.
ఈరోజు ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులతో ఫోన్లో సంప్రదించిన జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన అనుచర వర్గం తెలిపింది.హైదారాబాద్ లోని సీనియర్ నాయకులు కొంత కాలం ఓపిక పట్టమని సలహా ఇచ్చినట్లు, ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఒనగూరే లాభం ఏమి లేదని చెప్పినట్లు తెలుస్తుంది.
ఈరోజు ఉదయం నుండి జగిత్యాల లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చిస్తున్న జీవన్ రెడ్డి తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను హఠాత్తుగా పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.
గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న జీవన్ రెడ్డి. గతంలో మంత్రిగా కొనసాగారు. జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి ని కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించడం స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జీవన్ రెడ్డి పై పోటీ చేసి గెలిచిన సంజయ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎటు తోచని దుస్థితిలో ఉన్నారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీలోని చిన్న నాయకులు కార్యకర్తలు పార్టీలో తమ భవిష్యత్తు ఏమిటా అని జిల్లాలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో తమకు నాయకత్వం కొరబడిందని, రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని దిగులు పడుతున్నారు.
జీవన్ రెడ్డి ప్రకటించబోయే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని, ఇన్నాళ్లుగా బిజెపి, బీఆర్ఎస్ పార్టీలతో పోటీపడి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఆయన రాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అన్ని వర్గాల వారు చర్చించుకుంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్,... జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర
జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు):
కన్వెన్షన్ హాల్లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన... ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... 