జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

- కొప్పుల రాజ్ కుమార్ చావుకు డిఎంహెచ్ ఓ నే బాధ్యుడు.

On
జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు )

 

జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ ఎస్.వినోద్ కుమార్ లకు మృతుడు కొప్పుల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు మాట్లాడుతూ....

జగిత్యాల జిల్లా కేంద్రంలోని 104 లో డ్రైవర్ గా పని చేసే కొప్పుల రాజ్ కుమార్ (56) అనే వ్యక్తి ఇటీవల మృతి చెందడానికి డిఎంహెచ్ ఓ పుప్పాల శ్రీధర్ తలపెట్టిన పని ఒత్తిడే కారణం అని వారు ఆరోపించారు. ఎలాంటి విరామం లేకుండా పని చెపుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్లనే కొప్పుల రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని వారు వివరించారు.

జగిత్యాల పట్టణ పోలీసులు డిఎంహెచ్ ఓ శ్రీధర్ పై పలు సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల వారు తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాకుండా హాండిసి పెటేడ్ బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు.

సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారిక సమావేశాలలో పాల్గొన్న పుప్పాల శ్రీధర్ ను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

పోలీసులు ముద్దాయికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిఎం హెచ్ ఓ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు. 

మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ... రూ.50 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సెలవులో వెళ్ళిన డిఎం హెచ్ వో.

జగిత్యాల డిఎం హెచ్ వో పుప్పాల శ్రీధర్ ఈ నెల 15 నుండి 30 తేది వరకు అనారోగ్య కారణాల వలన సెలవులో వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డా.శమియోద్దీన్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు  ధర్మపురి అరవింద్  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బోగ శ్రావణి  తో కలిసి హైదరాబాద్ లో...
Read More...
Local News 

ఎంపీ అరవిందును డా బోగ శ్రావణి తో కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్లు

ఎంపీ అరవిందును డా బోగ శ్రావణి తో కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్లు హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు  ధర్మపురి అరవింద్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  డా .భోగ శ్రావణి  తో కలిసి హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   జగిత్యాల ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు) ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు...
Read More...
Local News 

ఓ సి(అగ్రవర్ణాల) రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ 10 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి : పొలాడి రామారావు.

ఓ సి(అగ్రవర్ణాల) రిజర్వేషన్ల అమలుకు డిమాండ్  10 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి : పొలాడి రామారావు. న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 23(ప్రజా మంటలు) దేశంలో ఇతర కులాలు (ఓ సి– అధర్ క్యాస్ట్ / అగ్రవర్ణాలు) ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక అన్యాయాలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఓసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక,న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా...
Read More...
Local News 

టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునికి వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జిఓలు

టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునికి వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జిఓలు కరీంనగర్ ఫిబ్రవరి 22 ( ప్రజా మంటలు)సన్మానించిన జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి.  కరీంనగర్ లో ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మరియు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వివాహ వార్షికోత్సవం సందర్బంగా జగిత్యాల టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి అధ్వర్యంలో...
Read More...
State News 

దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి

దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి ములుగు జిల్లా (ప్రజా మంటలు):ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు ₹600 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు అన్ని అంచనాలను ప్రభుత్వ ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.  దేవాదుల పంప్...
Read More...
Local News 

మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం

మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం జగిత్యాల జిల్లా (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ తిర్మణి రమణ మల్యాల వరద కాలువలో కారుతో సహా మృతిచెందిన స్థితిలో కనిపించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...
Read More...
Local News 

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి  కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు....
Read More...
Local News 

పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత

పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు): ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి అజ్మీరా రాజేశ్వరి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు మరియు క్రీడలపై అపార ఆసక్తితో కృషి చేస్తున్న రాజేశ్వరి, హైదరాబాద్‌లోని Koti Women's College లో...
Read More...
State News 

అనాథపీలలకు ఆర్థిక సహాయం అందించిన సూరజ్ శివశంకర్

అనాథపీలలకు ఆర్థిక సహాయం అందించిన సూరజ్ శివశంకర్ జగిత్యాల, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు): అనారోగ్య కారణాలతో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో అనాధలైన పిల్లలకు రూ.12,000 ఆర్థిక సహాయం అందించి సామాజిక సేవకులు మానవత్వాన్ని చాటారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివ శంకర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ సహాయాన్ని అందించారు. పెద్దపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామానికి...
Read More...
Local News 

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు); నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్‌డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహా...
Read More...
Local News 

నిరాశ్రయుల కోసం 295వ అన్నదాన కార్యక్రమం

నిరాశ్రయుల కోసం 295వ అన్నదాన కార్యక్రమం సికింద్రాబాద్,  ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):  హైదరాబాద్ నగరంలో నిరాశ్రయులు, అనాథలు, సంచారజాతుల కోసం ఆదివారం 295వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతినెల రెండవ, నాల్గవ ఆదివారాల్లో జరిగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు రహదారులపై అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డా....
Read More...