జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.
- కొప్పుల రాజ్ కుమార్ చావుకు డిఎంహెచ్ ఓ నే బాధ్యుడు.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు )
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ ఎస్.వినోద్ కుమార్ లకు మృతుడు కొప్పుల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు మాట్లాడుతూ....
జగిత్యాల జిల్లా కేంద్రంలోని 104 లో డ్రైవర్ గా పని చేసే కొప్పుల రాజ్ కుమార్ (56) అనే వ్యక్తి ఇటీవల మృతి చెందడానికి డిఎంహెచ్ ఓ పుప్పాల శ్రీధర్ తలపెట్టిన పని ఒత్తిడే కారణం అని వారు ఆరోపించారు. ఎలాంటి విరామం లేకుండా పని చెపుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్లనే కొప్పుల రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని వారు వివరించారు.
జగిత్యాల పట్టణ పోలీసులు డిఎంహెచ్ ఓ శ్రీధర్ పై పలు సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల వారు తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాకుండా హాండిసి పెటేడ్ బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు.
సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారిక సమావేశాలలో పాల్గొన్న పుప్పాల శ్రీధర్ ను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
పోలీసులు ముద్దాయికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిఎం హెచ్ ఓ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు.
మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ... రూ.50 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సెలవులో వెళ్ళిన డిఎం హెచ్ వో.
జగిత్యాల డిఎం హెచ్ వో పుప్పాల శ్రీధర్ ఈ నెల 15 నుండి 30 తేది వరకు అనారోగ్య కారణాల వలన సెలవులో వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డా.శమియోద్దీన్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడు లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు
చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ... NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్
:చెన్నై ,జులై 22:
“న్యాయం, NEET రెండూ కలసి ఉండలేవు. NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం” అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అన్నారు.తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు NEETను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ పలుమార్లు... ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):
బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలుప్రతినిధుల... ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు):
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ... సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు)
ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్ పర్సన్ బి. సత్యప్రసాద్... రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర
జగిత్యాల జూలై 22 (ప్రజా మంటలు)
రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం గంటలకు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం కావడంతో ప్రతి ఏటా నిర్వహించే వీరమ్మ బోనాల పండుగ సందర్భంగా మడలేశ్వర స్వామి వారి భారీ విగ్రహం... ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం... ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర... శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి జల అభిషేకం
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు... సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి
జగిత్యాల జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
జిల్లా కేంద్రంలోని... ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ
జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు) సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు. శ్రీనివాస్ తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి
ఈ... సూపర్ ఎల్నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత
గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి
కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు):
సూపర్ ఎల్నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప... 