జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.
- కొప్పుల రాజ్ కుమార్ చావుకు డిఎంహెచ్ ఓ నే బాధ్యుడు.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు )
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ ఎస్.వినోద్ కుమార్ లకు మృతుడు కొప్పుల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు మాట్లాడుతూ....
జగిత్యాల జిల్లా కేంద్రంలోని 104 లో డ్రైవర్ గా పని చేసే కొప్పుల రాజ్ కుమార్ (56) అనే వ్యక్తి ఇటీవల మృతి చెందడానికి డిఎంహెచ్ ఓ పుప్పాల శ్రీధర్ తలపెట్టిన పని ఒత్తిడే కారణం అని వారు ఆరోపించారు. ఎలాంటి విరామం లేకుండా పని చెపుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్లనే కొప్పుల రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని వారు వివరించారు.
జగిత్యాల పట్టణ పోలీసులు డిఎంహెచ్ ఓ శ్రీధర్ పై పలు సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల వారు తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాకుండా హాండిసి పెటేడ్ బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు.
సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారిక సమావేశాలలో పాల్గొన్న పుప్పాల శ్రీధర్ ను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
పోలీసులు ముద్దాయికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిఎం హెచ్ ఓ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు.
మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ... రూ.50 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సెలవులో వెళ్ళిన డిఎం హెచ్ వో.
జగిత్యాల డిఎం హెచ్ వో పుప్పాల శ్రీధర్ ఈ నెల 15 నుండి 30 తేది వరకు అనారోగ్య కారణాల వలన సెలవులో వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డా.శమియోద్దీన్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ... నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు):
నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు.
లక్డికాపూల్లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను... బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) 2014 నుండి దాదాపు దశాబ్ద కాలం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ (టిఆర్ఎస్) పార్టీ కార్యకర్తగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన గట్టు సతీష్ వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ... భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ
జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ... కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం
హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు.
కల్వకుంట్ల కవిత 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి... కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన... ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు( అమరావతి) లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంపికైన 120 మంది గాయని గాయకులలో జగిత్యాల వాసి సముద్రాల రాములు ఒకరిగా ఎంపికయ్యారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ సముద్రాల రాములు గూర్చి మాట్లాడుతూ... నోడల్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)
జిల్లాలోని 5 మున్సిపల్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి... శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, లలితా చాలీసా పారాయణం సామూహికంగా భక్తులచే సాయంత్రం 7 గంటల నుండి సామూహిక పారాయణం కొనసాగింది.
.అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో... మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
జగిత్యాల డిసెంబర్ 5 ( ప్రజా మంటలు)ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.
ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని... 