తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

సంజయ్ కు మంత్రి పదవి...కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది - తెలంగాణ బీజేపీ శ్రేణులు

On
తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

హైద్రాబాద్ జూన్ 9 (ప్రజా మంటలు) : 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి.

సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా... నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్ కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.

సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.  

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం... నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే. 

రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు.

నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.

అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే.

ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు. 

నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే... ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.

రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా... ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక...
Read More...
Local News  State News 

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు. మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ...
Read More...

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు)    జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఫిబ్రవరి  మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం ఈ...
Read More...

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్          జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్  మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య...
Read More...

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని...
Read More...
Local News 

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు...
Read More...

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు): నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఐక్యతతో ముందుకు...
Read More...

Today's cartoon

Today's cartoon Today's Cartoon
Read More...
Local News 

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.      

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం 2024...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్ 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్  కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు): కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి...
Read More...

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన...
Read More...