తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే. - ఆర్డీవో ఎన్.శ్రీనివాస్.

On
తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే. - ఆర్డీవో ఎన్.శ్రీనివాస్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

మెట్ పల్లి మే 30 (ప్రజా మంటలు ) : 

వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ అన్నారు.గురువారం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజేన్స్ పిలుపు,వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ ఆవిష్కరించారు.

అనంతరం వయోధికుల చట్టం కింద తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసులను విచారించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ..... తల్లిదండ్రులైన వయో వృద్ధులను పోషించక నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష ,జరిమాన విధించే వీలుందన్నారు.

జిల్లాలో వయోధికుల రక్షణ,నిరాదరణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను, మెట్ పల్లి డివిజన్ పరిథి లో సేవలను అందిస్తున్న సీనియర్ సిటీజన్స్ డివిజన్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్ లను ఆర్డీవో అభినందించారు.

కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్, జిల్లా,డివిజన్, మండలాల ,గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3...
Read More...
Local News 

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి...
Read More...
State News 

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,” తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్ కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు): మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన...
Read More...
State News 

“ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

“ఏం సాధించారని సంబరాలు “స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు): ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల...
Read More...
Local News 

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్ మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

ఇబ్రహీంపట్నంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన ఇబ్రహీంపట్నం డిసెంబర్ 8 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోని మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల రిసెప్షన్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అధికారులు పరిశీలించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మొత్తం ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అన్న దానిపై మెట్టుపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ...
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   జగిత్యాల డిసెంబర్ 8(ప్రజా మంటలు)   గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 గురు  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని  బాధితులకు న్యాయం చేయాలని  ఆదేశించారు. ప్రజలకు
Read More...
Local News 

IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ వర్షకొండ పూర్వ విద్యార్థి

IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ వర్షకొండ పూర్వ విద్యార్థి   ఇబ్రహీంపట్నం డిసెంబర్ 7(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్లో  ఐదవ తరగతి వరకు చదివి, ఆరవ తరగతి కొరకు  ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో విద్య అభ్యాసిస్తూన్న, విద్యార్థి *పాండ్రవీశం మిట్టూర్తి*, IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రాష్ట్రస్థాయి మోడల్...
Read More...

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి – 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి – 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ    మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఆనంద్ బాగ్, మల్కాజిగిరి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు నెమ్మాని విష్ణుమూర్తి శర్మ, అధ్యక్షులు మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు దామెర సత్యనారాయణ శర్మ, గణపురం రాంప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి యలమంచి...
Read More...
Local News 

ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక

ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన – *  ప్రశాంత ఎన్నికల పిలుపు
Read More...
Local News 

కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్...
Read More...
Local News 

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ  సమావేశం.                            -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.                          

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ  సమావేశం.                            -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.                                                 జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం  తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా  టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ  హైదరాబాద్ లోని ఈ...
Read More...