చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి
- అదనపు కలెక్టర్ దివాకర.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
కొండగట్టు ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు )
కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవములకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు.
మంగళ వారం రోజున కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవముల ఏర్పట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ......
ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు కొండగట్టులో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సకాలంలో సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.
ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో అధిక ప్రాధాన్యత కల్పించాలని, అందుకు ఎక్కువ మొత్తంలో చలివేంద్రాలను భక్తులు వెళ్ళే దారుల వెంబడి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చే భక్తుల సౌకర్యంకు 7 వాహన పార్కింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు, ఆయా ప్రాంతాలలో నీడ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ త్రాగునీటి వసతి కల్పించాలని, రాత్రి వేళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా దీక్షలో ఉన్న భక్తులు కాలి నడకన వచ్చే వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తుల మాల ధారణ తీసివేయడం, కేశ ఖండన ప్రాంతాలు, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. 3 కేశ ఖండన ప్రాంతాలు, 125 షవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
50 సిసి టివీలతో పాటు మరో 50 అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు 50 చలివేంద్రాలను దేవాలయ ప్రాంగణం, సరిహద్దు, కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 6 మెడికల్ క్యాంపులను, 2 అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరంతర పారిశుద్ధ్యం నిర్వహించడానికి 380 మంది పారిశుద్ధ్య పనివారిని నియమిస్తున్నామని తెలిపారు. కోనేరులోని నీటినీ శుభ్రపరచాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూం, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో కాలి నడకన వచ్చే భక్తులకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా రేడియం స్టిక్కర్లను అందించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి 2 అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పారిశుధ్య పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
కార్యక్రమాల నిర్వహణ బాధ్యత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటి సి.ఈ.ఓ.ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రసాదం కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఆర్దిఒ పి. మధుసూధన్, డిఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.ఓ. ఏ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. శ్రీధర్, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, ఆయా మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉప ముఖ్యమంత్రి భట్టి డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్రావు సంచలన ఆరోపణలు!
హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంటిపై జరిగిన ఐటీ దాడులు బీజేపీతో ఉన్న గోప్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు.
హరీశ్రావు మాట్లాడుతూ “భట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే... iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్తో వస్తుందా?
అల్ట్రా-స్లిమ్ డిజైన్లో కొత్త తరహా రూపం
హైదరాబాద్ నవంబర్ 08:
ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.
మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం... తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
సికింద్రాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్ టెంపుల్ యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్, జోసెఫ్, శివ, అనిల్ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు.... ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు.... ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 8 (ప్రజామంటలు):
ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్, కోశాధికారిగా నూకల నర్సింగ్రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్, కొడరపు అశోక్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి... నల్లగుట్ట నాలా స్ట్రెచ్లో హైడ్రా స్పెషల్ డ్రైవ్ :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్లలో సిల్ట్ తొలగింపు
పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్ వాటర్ డ్రెయిన్లలో పేరుకున్న సిల్ట్, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్ కార్పొరేటర్ చీర... తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో... గాంధీ మెడికల్కాలేజీలో ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్కాలేజీ ఆర్థోపెడిక్స్విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్పోస్ట్గ్రాడ్యుయేట్టీచింగ్ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్లినికల్నైపుణ్యాలను, డయగ్నస్టిక్అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్ఎగ్జామినేషన్, క్లినికల్చర్చలు, కేస్బేస్డ్డిస్కషన్లు, హ్యాండ్స్ఆన్ట్రైనింగ్వంటి అంశాలు... బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు):
బోరబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్ 7062/2025 ఆధారంగా కమిషన్ ఈ... గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుక..
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 08 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ప్రజాసేవలో... 100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు... సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జగిత్యాల పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో... 