చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి
- అదనపు కలెక్టర్ దివాకర.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
కొండగట్టు ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు )
కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవములకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు.
మంగళ వారం రోజున కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవముల ఏర్పట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ......
ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు కొండగట్టులో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సకాలంలో సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.
ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో అధిక ప్రాధాన్యత కల్పించాలని, అందుకు ఎక్కువ మొత్తంలో చలివేంద్రాలను భక్తులు వెళ్ళే దారుల వెంబడి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చే భక్తుల సౌకర్యంకు 7 వాహన పార్కింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు, ఆయా ప్రాంతాలలో నీడ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ త్రాగునీటి వసతి కల్పించాలని, రాత్రి వేళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా దీక్షలో ఉన్న భక్తులు కాలి నడకన వచ్చే వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తుల మాల ధారణ తీసివేయడం, కేశ ఖండన ప్రాంతాలు, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. 3 కేశ ఖండన ప్రాంతాలు, 125 షవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
50 సిసి టివీలతో పాటు మరో 50 అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు 50 చలివేంద్రాలను దేవాలయ ప్రాంగణం, సరిహద్దు, కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 6 మెడికల్ క్యాంపులను, 2 అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరంతర పారిశుద్ధ్యం నిర్వహించడానికి 380 మంది పారిశుద్ధ్య పనివారిని నియమిస్తున్నామని తెలిపారు. కోనేరులోని నీటినీ శుభ్రపరచాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూం, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో కాలి నడకన వచ్చే భక్తులకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా రేడియం స్టిక్కర్లను అందించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి 2 అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పారిశుధ్య పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
కార్యక్రమాల నిర్వహణ బాధ్యత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటి సి.ఈ.ఓ.ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రసాదం కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఆర్దిఒ పి. మధుసూధన్, డిఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.ఓ. ఏ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. శ్రీధర్, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, ఆయా మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి నవంబర్ 25 ( ప్రజా మంటలు)మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_ మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెగడపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న... ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం
జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణము నెలకొందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.
▪️ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి,9మంది ఆడబిడ్డలకు మంజూరైన 9... రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు ,వాహనాలు వెళ్లడం ఎలా?
? జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో నానాటికి ట్రాఫిక్ పెరుగుతుంది. దీనికి కారణం రవాణా సౌకర్యాలు పెరిగి పోరుగు జిల్లాలు దగ్గర కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి పొరుగు జిల్లాల వాళ్ళు రావడం మరింత ట్రా "ఫికర్ " అయింది. వీటన్నిటికీ తోడు జిల్లాలో ఏ మూల చూసినా పశువులే... తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్కు దేశ-విదేశాల నుండి భారీగా ప్రతినిధులు హాజరుకానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అన్ని... వరంగల్లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ
వరంగల్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే నిత్య పెళ్లికూతురు ఘరానా మరోసారి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ఇదే తరహా మోసాలతో పలువురిని మభ్యపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే…
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి... మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్
మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు):
మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పని చేస్తున్న కె. చందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం... ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు... బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.
జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి... న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
ఐ
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి... ఐబొమ్మ రవి కన్ఫెషన్లో సంచలన వివరాలు వెల్లడి?
హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు):
ఐబొమ్మ బెట్టింగ్ వెబ్సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు... పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18 ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్... గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్సేవలను వినియోగించుకోవాలి
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్డివిజన్సీనియర్సూపరింటెండెంట్, ఐపీఓఎస్అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్ప్రొఫెసర్వాణిని సోమవారం కలిసి పోస్టల్శాఖ అందిస్తున్న పోస్టల్ఖాతాలు, లైఫ్ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు.
ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్శాఖ అని పేర్కొన్నారు.... 