చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి

- అదనపు కలెక్టర్ దివాకర.

On
చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

కొండగట్టు ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు )

కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవములకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు.

మంగళ వారం రోజున కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవముల ఏర్పట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ......

ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు కొండగట్టులో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సకాలంలో సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.

ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో అధిక ప్రాధాన్యత కల్పించాలని, అందుకు ఎక్కువ మొత్తంలో చలివేంద్రాలను భక్తులు వెళ్ళే దారుల వెంబడి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చే భక్తుల సౌకర్యంకు 7 వాహన పార్కింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు, ఆయా ప్రాంతాలలో నీడ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ త్రాగునీటి వసతి కల్పించాలని, రాత్రి వేళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా దీక్షలో ఉన్న భక్తులు కాలి నడకన వచ్చే వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

భక్తుల మాల ధారణ తీసివేయడం, కేశ ఖండన ప్రాంతాలు, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. 3 కేశ ఖండన ప్రాంతాలు, 125 షవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

50 సిసి టివీలతో పాటు మరో 50 అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు 50 చలివేంద్రాలను దేవాలయ ప్రాంగణం, సరిహద్దు, కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 6 మెడికల్ క్యాంపులను, 2 అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరంతర పారిశుద్ధ్యం నిర్వహించడానికి 380 మంది పారిశుద్ధ్య పనివారిని నియమిస్తున్నామని తెలిపారు. కోనేరులోని నీటినీ శుభ్రపరచాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూం, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వివిధ ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో కాలి నడకన వచ్చే భక్తులకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా రేడియం స్టిక్కర్లను అందించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి 2 అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పారిశుధ్య పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

కార్యక్రమాల నిర్వహణ బాధ్యత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటి సి.ఈ.ఓ.ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రసాదం కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జగిత్యాల ఆర్దిఒ పి. మధుసూధన్, డిఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.ఓ. ఏ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. శ్రీధర్, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, ఆయా మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Local News  State News 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన  ముంబై నవంబర్ 23: భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యారు. గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్ జట్టు ఇలా ఉంది : బ్యాట్స్‌మెన్: రోహిత్‌ శర్మ, యశస్వి...
Read More...

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు): వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శన తర్వాత కవిత...
Read More...
Local News 

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నందన్నను ఘనంగా సత్కరించే కార్యక్రమం ఇందిరా భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, సత్య సాయి సేవా సమితి...
Read More...
Local News 

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,...
Read More...
Local News 

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్‌లోని యూత్ హాస్టల్‌లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని   బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్...
Read More...
Local News 

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక మెట్టుపల్లి నవంబర్ 23(ప్రజ మంటలు దగ్గుల అశోక్)   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని  వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థి ఖో ఖో పోటీలకు *నల్ల నవీన్*అండర్-17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటిల్లో ఆడనున్నట్టు
Read More...
Local News  State News 

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి సికింద్రాబాద్,  నవంబర్ 23 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌లోని  పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 289వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరంలోని ఫుట్‌పాత్‌లు, సంచారజాతుల ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్పాత్ పై నివాసం ఉంటున్న వారికి ఉపాధి  ఇచ్చి శాశ్వత ఆవాసం కల్పించాలని...
Read More...
Local News  State News 

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్ హైదరాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు): యశోద హాస్పిటల్స్–హైటెక్ సిటీలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద మేనేజింగ్ డైరెక్టర్ డా. జి.ఎస్.రావు ప్రారంభించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. సీనియర్ పల్మోనాలజిస్ట్ డా. నాగార్జున మాటూరు మాట్లాడుతూ......
Read More...
National  State News  International  

జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త

జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త "Modi on board" అనే మాట ఎం చెబుతుంది ? ఇప్పుడొచ్చిన తాజా ఎపిస్టిన్ ఫైళ్లు (“Epstein Files”)లో భారతీయ రాజకీయ, వ్యాపార వర్గాలకి చెందిన కొన్ని ప్రముఖులతో గది చోటు పొందిన ఫైళ్లు వెళ్లదీయబడ్డాయి. ఈ విషయంపై లోతైన పరిశోధన ఇది ఎవరిని దోషుల గానో, బాధ్యులుగానో చెప్పడానికి కాదు.రాజకీయ,వ్యాపార సంబంధాలు ఎలా...
Read More...
Local News 

ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు

 ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..?  *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు సికింద్రాబాద్‌, నవంబర్ 23 ( ప్రజా మంటలు):  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు....
Read More...