చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి
- అదనపు కలెక్టర్ దివాకర.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
కొండగట్టు ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు )
కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవములకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు.
మంగళ వారం రోజున కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవముల ఏర్పట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ......
ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు కొండగట్టులో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సకాలంలో సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.
ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో అధిక ప్రాధాన్యత కల్పించాలని, అందుకు ఎక్కువ మొత్తంలో చలివేంద్రాలను భక్తులు వెళ్ళే దారుల వెంబడి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చే భక్తుల సౌకర్యంకు 7 వాహన పార్కింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు, ఆయా ప్రాంతాలలో నీడ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ త్రాగునీటి వసతి కల్పించాలని, రాత్రి వేళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా దీక్షలో ఉన్న భక్తులు కాలి నడకన వచ్చే వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తుల మాల ధారణ తీసివేయడం, కేశ ఖండన ప్రాంతాలు, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. 3 కేశ ఖండన ప్రాంతాలు, 125 షవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
50 సిసి టివీలతో పాటు మరో 50 అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు 50 చలివేంద్రాలను దేవాలయ ప్రాంగణం, సరిహద్దు, కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 6 మెడికల్ క్యాంపులను, 2 అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరంతర పారిశుద్ధ్యం నిర్వహించడానికి 380 మంది పారిశుద్ధ్య పనివారిని నియమిస్తున్నామని తెలిపారు. కోనేరులోని నీటినీ శుభ్రపరచాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూం, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో కాలి నడకన వచ్చే భక్తులకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా రేడియం స్టిక్కర్లను అందించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి 2 అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పారిశుధ్య పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
కార్యక్రమాల నిర్వహణ బాధ్యత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటి సి.ఈ.ఓ.ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రసాదం కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఆర్దిఒ పి. మధుసూధన్, డిఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.ఓ. ఏ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. శ్రీధర్, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, ఆయా మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు... IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు
బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర... చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై సస్పెన్షన్
కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... బీహార్ BJP ఎమ్మెల్యే ప్రమోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య
ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
పాట్నా డిసెంబర్ 04:
బీహార్లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,... ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా... హైదరాబాద్లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ను కుదిపేసింది. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.
నిందితులు:బండి... MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే... రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్పై ఏసీబీ సోదాలు
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నడుమ ఏసీబీ (ACB) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
సమాచారం ప్రకారం, రంగారెడ్డి... గొల్లపల్లి మండల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన డీఎస్పీ రఘు చందర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా జగిత్యాల డిఎస్పి రఘుచందర్ గొల్లపల్లి కేంద్రంలో నామినేషన్ ఎలక్షన్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి తగు సూచనలను సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు... 