ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత
ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
బాన్సువాడ – కొయ్యగుట్ట తండా రెసిడెన్షియల్ కాలేజీలో కవిత పర్యటన
కవిత రెసిడెన్షియల్ కాలేజీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ క్యాంపస్, భద్రత, బోధన పద్ధతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాన్ని కోరారు.
విద్యార్థులకు సంబంధించిన సమస్యలు
- స్కూల్, కాలేజ్ క్యాంపస్ చాలా బాగుందని అభిప్రాయం.
- సెక్యూరిటీ, టీచర్లు బాగా పనిచేస్తున్నారని విద్యార్థులు చెప్పారని తెలిపారు.
- అయితే ముఖ్య సమస్య – టీచర్లు హాస్టల్ వార్డెన్స్గా పనిచేయడం.
- దీనిని వెంటనే మార్చాలని, ప్రత్యేక వార్డెన్లను నియమించాలని డిమాండ్.
- కాస్మొటిక్ ఛార్జీలు ఇవ్వడం నిలిపివేయడం తప్పు – వాటిని వెంటనే చెల్లించాలని అన్నారు.
- బాలికల వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
- చండూరు విద్యార్థి ఆత్మహత్య కేసులో పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు.
- స్కూల్ సూసైడ్ అంటుండగా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో నిష్పక్షపాత విచారణ అవసరమని అన్నారు.
- ఈ ప్రభుత్వం వచ్చాక 200 మందికి పైగా విద్యార్థులు మరణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
- ఒక్క స్కూల్లో మాత్రమే పరిస్థితులు బాగున్నాయని, మిగతా స్కూళ్లలో అనేక సమస్యలున్నాయని తెలిపారు.

ఎల్లారెడ్డి – నాగిరెడ్డిపేట్లో రైతులతో కవిత సమావేశం
నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీటిముంపు కారణంగా వేల ఎకరాలు నష్టపోయిన రైతులతో కవిత సమావేశమై సమస్యలను వివరంగా సేకరించారు.
రైతుల సమస్యలపై తీవ్ర అసంతృప్తి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు.
- స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కనబడకపోవడంతో అధికార యంత్రాంగం పనిచేయడం లేదని విమర్శించారు.
- నిజాం సాగర్ ముంపులో వేల ఎకరాలు నష్టపోయాయి – కానీ ప్రభుత్వానికి నిజమైన లెక్కలు లేవని పేర్కొన్నారు.
- వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని, లేకపోతే కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
- ఒక్కో ఎకరానికి కనీసం రూ.25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్.
- పాడైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తు చేయడం లేదని ఆందోళన.
- ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయకపోవడం రైతులకు పెద్ద ఇబ్బంది అని విమర్శ.
- “బోనస్ ఇస్తామని చెప్పి వడ్లు కూడా కొనడంలేదు… కాంగ్రెస్ మాటలు బోనస్ కాదు, బోగస్” అని తీవ్ర వ్యాఖ్య.
- 3 వేల ఎకరాల పాస్పట్టాలు పెండింగ్ – పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
- పత్తి పంట ఎక్కువగా పండుతున్నా CCI కొనడంలేదని, జిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
- ఫ్రీ బస్సు కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని, వారికి హామీ ఇచ్చిన రూ.12,000 మరియు ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని కోరారు.
- మహిళలకు చీరలు ఇవ్వకపోవడం, ఇందిరమ్మ ఇళ్లు కూల్చడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని విమర్శ.
- అన్ని పెన్షన్లను రూ.4,000కి పెంచాలని, 18 ఏళ్లు దాటిన ఆడబిడ్డలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్.
- “నేను పోరాటం చేస్తే ఆగను… సమస్య పరిష్కారం అయ్యే వరకు వదలను” అని కవిత చెప్పారు.
లింగంపేట – జాగృతి జనంబాటకు ఘన స్వాగతం
లింగంపేట మండల కేంద్రంలో జాగృతి జనంబాటలో భాగంగా, తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో కవితకు ప్రజలు, జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు):
సారంగాపూర్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా... ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత
ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
బాన్సువాడ –... హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్
సందర్శించిన అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు)::
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫోటో ప్రదర్శనను గురువారం తెలంగాణ హైకోర్టు భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు.... భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.
ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)... ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్
ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు... నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు.
జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
త్వరలోనే నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్... బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత
సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు) సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కులగణన... ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.
ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును... గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు
(అంకం భూమయ్య):
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ కార్యక్రమం కింద అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ విద్యార్థులు, తల్లులు,... తంజావూర్లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్కుమార్
తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:
తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది.
ప్రేమలో విఫలం – ఘాతుకానికి... సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు
అమరావతి నవంబర్ 27:
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది.
విజిలెన్స్ నివేదిక –... మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు
మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన వివరాలు
- మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు... 