చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన
చీమలంటే తీవ్ర భయం (మైర్మెకోఫోబియా) తో ఆత్మహత్య
సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు):
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలంటే తీవ్ర భయం (మైర్మెకోఫోబియా) ఉందని, ఈ భయం ఇటీవల మరింతగా పెరిగిందని సీఐ నరేష్ తెలిపారు.
మనీషా భర్త శ్రీకాంత్ (35) 2022లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి అన్నికా (3) అనే చిన్న కుమార్తె ఉంది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మనీషా ఈ దారుణ చర్యకు పాల్పడింది.
ఘటన స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మనీషా “I am sorry, అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నవరం, తిరుపతి హుండీలో రూ.1116 వేయండి. ఎల్లమ్మకు వాడు బియ్యం పోయడం మర్చిపోకండి” అని రాసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మానసిక భయం, మైర్మెకోఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుందనే ప్రాథమిక సమాచారం లభ్యమైంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
క్రికెటర్ ధవన్, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
న్యూ ఢిల్లీ నవంబర్ 07:
అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ 1xBet కేసులో మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేశ్ రైనాల ఆస్తులను అమలు దళం (ED) గురువారం జప్తు చేసింది.మొత్తం రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ... బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్
పాట్నా, నవంబర్ 6 (ప్రజామంటలు):
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు మరియు వలస కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఉత్సాహభరితంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా... జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు.
జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య... కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్
కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల... గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.
సమస్యను... వృద్ద అనాధల మరణాలు నిత్యకృత్యమయ్యాయి. :: పరిష్కారం చూపండి సార్.
ఎస్హెచ్ఆర్సీ చైర్మన్ కు ఏసీపీ విజ్ఞప్తి
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనాథల మరణాలు సర్వసాధారణంగా మారయ్యాయని, ఈ అంశంపై ఫోకస్ చేసి, పరిష్కారం చూపాలని చిలకలగూడ డివిజన్ ఏసీపీ శశాంక్ రెడ్డి రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డా.షమీమ్ అక్తర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీ... థాయిలాండ్లో మిస్ యూనివర్స్ పోటీల్లో వివాదం – పోటీ పర్యవేక్షకురాలిపై అవమాన ఆరోపణలు
బ్యాంకాక్ (థాయిలాండ్), నవంబర్ 06 :
థాయిలాండ్లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల్లో తీవ్ర వివాదం చెలరేగింది. పోటీ పర్యవేక్షకురాలు నవత్ ఇత్సారక్రిషిల్, మిస్ యూనివర్స్ థాయిలాండ్ అధ్యక్షురాలు, పాల్గొనే అందగత్తెలను అవమానించారన్న ఆరోపణలు బహిరంగంగా వెల్లువెత్తాయి.
బ్యాంకాక్లోని ప్రధాన వేదికలో జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అందాల... మహబూబాబాద్ జిల్లాలో రూ.10 వేల లంచం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ శాఖ అధికారి
మహబూబాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
మహబూబాబాద్ జిల్లాలో లంచం కేసులో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. అనేపురం గ్రామం, మర్రిపాడ మండలంలో పనిచేస్తున్న **వ్యవసాయ విస్తరణ అధికారి జీ. సందీప్ (29)**ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారంగల్ రేంజ్ పరిధిలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... అసిఫాబాద్ సివిల్ సప్లైస్ కార్యాలయ అధికారులపై ఏసీబీ ఉచ్చు – రూ.75 వేల లంచం కేసు
అసిఫాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
అసిఫాబాద్ జిల్లాలో లంచం కేసులో ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలో పట్టుకున్నారు. సివిల్ సప్లైస్ కార్యాలయానికి చెందిన డిస్ట్రిక్ట్ మేనేజర్ (AO-1) గురుబెల్లి వెంకట్ నరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ (AO-2) కోతగొల్ల మనికాంత్ లపై ఏసీబీ ఉచ్చు వేసింది.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... నవీన్ యాదవ్కు మద్దతుగా కోట నీలిమ ప్రచారం
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బరిలో ఉత్సాహం
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ఉపఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి వి.నవీన్యాదవ్కు మద్దతుగా పీసీసీ వైస్ప్రెసిడెంట్డాక్టర్కోట నీలిమ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఆమె స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్ మెంట్వాసులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో... 13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స..
బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ సక్సెస్
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
వరంగల్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తికి బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో చేసిన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి గుండె ప్రధాన రక్తనాళం ఆయోర్టాలో 13.5 సెంటీమీటర్ల మేర ఏర్పడిన ఆన్యురిజం కారణంగా పూర్తిగా
ఆయన... చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన
సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు):
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు... 