చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు
వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు
సికింద్రాబాద్ ఏప్రిల్ 10 (ప్రజామంటలు) :
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనలు నడిపిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు హెచ్చరించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎల్.మధు బాబు తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు మాట్లాడుతూ, ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా మైనర్లు వాహనాలు నడపడం పై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించామన్నారు.ఉత్తర మండలం పరిధిలో 109 కేసు లు నమోదైనట్లు వెల్లడించారు.వీరిలో మైనర్లు అత్యధికంగా ఉన్నారని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈసందర్భంగా గుర్తు చేశారు.
మోటారు వాహన చట్టం 1988 సెక్షన్ 180 ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి నందు కాను వెయ్యి రూపాయల జరిమాన తో పాటు మూడు నెలల జైలు శిక్ష, లేదా ఈ రెండు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.సెక్షన్ 181 ప్రకారం డ్రైవింగ్ చేసే వాహనదారుడు వయస్సు సరిపోకపోతే 500 రూపాయల జరిమాన లేదా మూడు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది, సెక్షన్ 207 ప్రకారం వాహనానికి రిజిస్ట్రేషన్, పర్మిట్ లేకుండా నడిపితే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇక మైనర్లు తప్పు చేస్తే సెక్షన్ 199ఏ 2019 ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు అవుతుందని, ఆ వాహనదారుడు కి 25 ఏళ్లు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం లేదన్నారు. మైనర్లు వాహనాలను నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు.
మైనర్ల తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిల్లిగ్ నిర్వహించారు. అనంతరం చట్టాల పై అవగాహన కల్పించారు.చట్టాన్ని గౌరవిద్దాం, నియమాలకు లోబడి వాహనాలు నడుపుదాం అంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.ఉత్తర మండలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి బోయిన్ పల్లి 17, తిరుమలగిరి 19, మరేడ్ పల్లి 23, బేగంపేట 24,గోపాలపురం09, మహంకాళీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదైనట్లు జి.శంకర్ రాజ్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో మైనర్ పిల్లల వారి తల్లిదండ్రులు,ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
