కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ పలు విభాగాల్లో రోబో వైద్యసేవలు
- రోబోను ప్రారంభించిన డాక్టర్ గురవారెడ్డి
సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు) :
రోబోటిక్ టెక్నాలజీ వల్ల రోగికి మెరుగైన, ఖచ్చితమైన, సేఫ్టీ తో కూడిన శస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చని , కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ఎక్కడ లేని విధంగా ఆరు రోబోలు అందుబాటులో ఉన్నాయని, నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రోబోటిక్ డావిన్సి సాయంతో జనరల్ సర్జరీ, గైనకాలజీ, యూరాలజీలతో పాటు క్యాన్సర్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించవచ్చని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ వి గురవారెడ్డి తెలిపారు. సోమవారం బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో అత్యాధునిక శస్త్ర చికిత్స రోబోటిక్ డావిన్సి ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రోబోటిక్ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోగికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగానే డావిన్సి రోబోను అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. ఈ రోబో సాయంతో జిఐ, విపుల్, క్యాన్సర్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు ప్యాంక్రియాటిక్ పైత్య గొట్టాలు, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా కడుపు లోపలి భాగంలో ఎక్కడైనా శాస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చని తెలిపారు. యూరాలజీ, సర్వైకల్, లాంగ్ అండ్ కార్డియాక్ చికిత్సలో కూడా ఈ రోబో ను ఉపయోగించి నిర్వహించవచ్చని సందర్భంగా డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు. సర్జన్ ఆదేశాల మేరకు రోబో పనిచేస్తుందని తెలిపారు. రోబో సాయంతో నిర్వహించిన ఎర్నియా శాస్త్ర చికిత్స వీడియోను డాక్టర్ విమలాకర్ రెడ్డి ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మీడియా సమావేశంలో కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ పి ఎన్ రావు, యూరాలజిస్ట్ డాక్టర్ నందకుమార్, డాక్టర్ శ్రీహర్ష, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య లతో పాటు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తో పాటు హాస్పిటల్ లోని వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు.
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
