ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 

జగిత్యాల ఏప్రిల్ 4 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి  మాట్లాడారు. 

కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సభ్యులకు వినతి పత్రం సమర్పించి, పలు అంశాలను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

అన్ని వర్గాల ప్రజలకు విద్యానందించాలనే సంకల్పంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్న విద్య హక్కును యూపీఏ హయాంలో చైర్ పర్సన్ సోనియా గాంధీ సారద్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2009లో విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి, విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 25%  సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు కేటాయించి, అమలు చేసేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు.

భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లు బీసీలకు 25% మైనార్టీలకు నాలుగు శాతం ఎస్సీలకు 15% ఎస్టిలకు 10% సీట్లు జనాభా ప్రాతిపదికన ప్రైవేట్ పాఠశాలలో సీట్లు కేటాయించాలని, నిరుపేదలకు విద్యను మరింత చేరువ చేయాలని కోరారు. 

ఫీజు రెగ్యులేషన్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల్లోని మౌలిక వసతులు బోధన సౌకర్యాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ధారించే ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఏయే పాఠశాలల్లో ఏ మేరకు ఫీజు నిర్ణయించారో విద్యా సంవత్సరానికి ప్రారంభంలోనే ప్రకటించాలని, తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలో తెలుసుకొనే స్వేచ్ఛపూరిత వాతావరణాన్ని కల్పించాలని ఆయన విన్నవించారు. 

అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నిరుపేద దళితులకు తమ హక్కుల సాధనలో న్యాయం జరగడం లేదని జీవన్ రెడ్డి వాపోయారు.

రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దళిత యువతి కంటే సునీత నూతన జిల్లాల ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన విద్యాభ్యాసం కొనసాగించిందని, అనంతరం ఐఈఆర్పి  రాత పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించినప్పటికీ నాన్ లోకల్ అంటూ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో  బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సైతం సునీతకు ఉద్యోగం ఇవ్వాలని తీర్పు చెప్పినప్పటికీ కూడా నేటికీ హైకోర్టు ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోలేదు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులను కోరారు. 

జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వీఆర్ఏ ఎన్నికల విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని కారుణ్య నియామకం కోసం  దరఖాస్తు చేసుకున్నప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హై కోర్టు ను ఆశ్రయించగా,  అర్హతకు అనుగుణంగా ఏదైన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోర్టు  సూచించగా, వీ ఆర్ఏ వ్యవస్థ రద్దు అయిందంటూ  ప్రభుత్వం సమాధానం ఇవ్వడం తో అన్ని అర్హతలు ఉండి కూడా దళితుడికి న్యాయం జరగకపోవడం బాధాకరమని అన్నారు. ఈ రెండు అంశాలను పరిశీలించాలని కమిషన్ చైర్మన్, సభ్యులకు జీవన్ రెడ్డి విన్నవించగా, జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చిన రెండు అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి, సమస్య పరిష్కరించి, న్యాయం చేస్తామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు.

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్ల కేటాయింపు చేయడంతో పాటు అమలు చేసే విధంగా, భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల కు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు చేపట్టేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Tags
Join WhatsApp

More News...

National  Sports  State News 

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం హైదరాబాద్‌ డిసెంబర్ 13 (ప్రజా మంటలు): ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు...
Read More...
Local News 

నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు): రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్...
Read More...
Local News 

వయోవృద్ధులకు టాస్కా ఆసరా.                                -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ  దినోత్సవం  వేడుకలు.

వయోవృద్ధులకు టాస్కా ఆసరా.                                -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ  దినోత్సవం  వేడుకలు. జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):     వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం  ఆల్ సీనియర్ సిటీజేన్స్...
Read More...
Local News  State News 

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) : సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల...
Read More...
State News 

రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం

రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్ డిసెంబర్ 13: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Read More...
Local News 

ఎల్కతుర్తి  గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం 

ఎల్కతుర్తి  గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం  ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం  గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి  ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి  మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో  ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా...
Read More...
Local News 

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :

నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా : గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య): గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు  గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో...
Read More...

బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ

బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు): జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్‌ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద...
Read More...
National  Comment  International  

రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..

 రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు .. ఆడపిల్లలకు ఆరాధ్యదైవం     భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా...
Read More...
National  State News 

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13: జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి...
Read More...
National  Comment 

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత లక్నో డిసెంబర్ 13: ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్‌తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ...
Read More...