విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ధర్మ పరిరక్షకుడు చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 19 ప్రజా మంటలు)
విదేశీయ, విదర్మీయ పాలనను అంతమొందించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాటం చేసిన యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ అన్నారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో ధర్మ ధ్వజానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీత విద్యాలయం వద్దకు చేరుకొని ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి, శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు. ఈసందర్భంగా చిట్ల గంగాధర్ మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన మొగల్ సామ్రాజ్యాన్ని, ఆదిల్ షాహి, రాజ్యాన్ని ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు.
అతి సామాన్య కుటుంబంలో జన్మించిన శివాజీ తోటి గిరిజనులైన మావళీలలో దేశభక్తిని, స్వరాజ్య భావనను నింపి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి శివాజీ అన్నారు.
పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం, పరిపాలన దక్షత, యుద్ధ నైపుణ్యం వంటి గుణాలలో శివాజీకి సాటి ఎవరూ లేరని అన్నారు. శివాజీ స్ఫూర్తిని చాటి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)