మారింది పాలకులే.. పాలన కాదు ఏడాది కాంగ్రెస్ పాలనపై భాజపా చార్జిషీట్. భాజపా సీనియర్ నేత కన్నం అంజయ్య
మారింది పాలకులే.. పాలన కాదు
ఏడాది కాంగ్రెస్ పాలనపై భాజపా చార్జిషీట్.
భాజపా సీనియర్ నేత కన్నం అంజయ్య
ధర్మపురి డిసెంబర్ 05:
తెలంగాణ రాష్ట్రంలో అధికార బదిలీ జరిగి పాలకులు మారారే కాని, పాలన మాత్రం ఏమాత్రం మారలేదని బి జె పి సీనియర్ నేత,కన్నం అంజయ్య ఆరోపించారు. ధర్మపురి క్షేత్రంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆంజయ్య ప్రసంగిస్తూ...నాడు తెరాస ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దొచ్చుకుంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో ఎసరు పెడుతున్నదని.
ఆరోపించారు. నాడు 12మంది ఎమ్మెల్యేలను పార్టీ మార్పిస్తే, నేడు 20మందిని చేర్చు కున్నారని విమర్శించారు. ధరణితో 19లక్షలరైతుల భూములు మాయ మైతే, హైడ్రా పేరున కూల్చి వేతలు జరుగుతున్నాయని దుయ్య బట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి అని మోసం చేసిందని, చేయూత పెన్షన్లు రావడం లేదని, సొంతిల్లు కలగానే మిగిలిందని, రైతు భరోసా లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో భాజపాను ఆదరించాలని కోరారు.
నాయకులు నలమాసు వైకుంఠం, పిల్లి శ్రీనివాస్, కస్తూరి సత్యం, కస్తూరి మురళి, బండారి లక్ష్మణ్, ఆకుల శ్రీనివాస్, బెజ్జారపు లవన్, గాజు భాస్కర్, రాజేశ్, నరేష్ తదితరులు వేదికాశీనులు అయినారు. వందలాదిగా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : బిఆర్ఎస్ కుమున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు : ఎంపీ అరవింద్
జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాలని బీజేపీ ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ ప్యాకేజీలకు లొంగుతాడా? లేక చట్టపరంగా చర్యలు తీసుకుంటాడా? అన్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పీఎంఆర్... పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు. జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్
బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు?
జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే... భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ
భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు):
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది.
ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్... మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు
మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు):
మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న... బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు
నిర్మల్, జనవరి 23 (ప్రజా మంటలు):
తెలంగాణలోని ప్రసిద్ధ విద్యాపీఠమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యాదేవత సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక హోమాలు,... కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు
కొండగట్టు, జనవరి 23 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో భక్తుల దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాదిమంది భక్తులు నిలిచిపోగా, కొందరు భక్తులు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగారు.... ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్
హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు):
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ దురుద్దేశంతో రూపొందించిన దృష్టి మళ్లింపు కుట్రగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలు వైఫల్యం, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును ముందుకు... జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్లో అరుదైన పరిణామం
జైపూర్, జనవరి 23:
రాజస్థాన్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులో ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు కోర్టు పరోల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
హైప్రొఫైల్ దుష్యంత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియ సెత్ (నేహా సెత్) కు... యుద్ధానికి ముగింపు కోసం పుతిన్తో భేటీ: ట్రంప్ ప్రకటన
డావోస్ | జనవరి 22 :
ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్లోని డావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్... బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?
ముంబై జనవరి 22:
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి.
తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన... మీర-భాయందర్కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్ఎస్ తీవ్ర వ్యతిరేకత
ముంబై జనవరి 22:ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి ‘మరాఠీ వర్సెస్ బయటి వారు’ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఈ వివాదానికి కేంద్రంగా మారింది ముంబై సమీపంలోని మీరా-భాయందర్. మేయర్ పదవికి సంబంధించి బీజేపీ తీసుకునే అవకాశమున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
మీరా-భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) తాజా ఎన్నికల్లో... 