కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్

On
కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) : 

ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి.

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్ 

 తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)3వ జనరల్ కౌన్సిల్ సమావేశం స్థానిక డి సి ఈ బి కార్యాలయంలో, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది.

ఇట్టి సమావేశానికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ...

గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం బదిలీలు,పదోన్నతులు-ఉపాధ్యాయుల నూతన నియామకం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లో గత ప్రభుత్వము మాదిరిగానే వ్యవహరిస్తోందని,5 డి.ఏ.లు పెండింగ్ లో ఉండగా ఒక్క డి.ఏ.మాత్రమే మంజూరు చేసిన తీరు ఉద్యోగ-ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ-నిస్పృహలకు గురిచేసిందని,ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే ఉద్యోగ-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన విద్య కావాలని,అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని,ప్రాథమిక తరగతులలో మాతృభాషలో విద్య ఉండాలని, ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి,మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక తరగతుల్లో కూడా ఆటల కొరకు పి ఈ టి టీచర్ ను నియమించాలని తద్వారా సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని, దానికి కావాల్సిన చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇట్టి జనరల్ కౌన్సిల్ సమావేశంలో టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షులుగా కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వి సత్య ప్రకాష్, సిహెచ్ సత్యం, గండి రాజయ్య, ఎలిగేటి సంజీవరాణి,కూరగాయల చంద్రశేఖర్,చింత మోహన్ ప్రసాద్ ,రాచమల్ల మహేష్, పాక కుమారస్వామి,జిల్లా కార్యదర్శులుగా పి రాజనర్సయ్య,వేముల సుధాకర్, పొన్నం శ్రీనివాస్, పిన్నంశెట్టి శివరంజని, గుడిసె రమేష్, కాచర్ల నాగరాజు, ఎక్కలదేవి రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి సత్యస్వామి, సభ్యులుగా ఆర్మూర్ భీమరాజు,ఏ.రాజ మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా లావుడ్య రాజయ్య ,ఎండి ఫక్రుద్దీన్,ఎల్ మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా కొలుగూరి కిషన్ రావు,బోగ రమేష్,గొడుగు రఘుపతి యాదవ్,పి కల్పన తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇట్టి ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య,పరిశీలకులుగా లక్ష్మయ్య యాదవ్ లు వ్యవహరించారు.

ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఫెడరేషన్ నాయకులు సూద రాజేందర్,నాగేంద్రం,రవీందర్ వివిధ మండలాల బాధ్యులు చిర్నేని రాజిరెడ్డి,కొత్త రాంకుమార్,గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,ఆసం శ్రీనివాస్,గజ్జల లచ్చయ్య, ఐల రఘుపతి,గొల్లపల్లి సత్యనారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి కందుకూరి శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, వహీద్, సలాముద్దీన్, సిరికొండ వేణు, జి చంద్రమౌళి,గంగారాం,రాజేశం మహిళా ఉపాధ్యాయులు వనిత,, మంజుల, సునీత ,సంజీవరాణి, శివరంజని ,పప్పీరాణి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్ చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని...
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత  సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్...
Read More...

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.  జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై  ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు....
Read More...

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను...
Read More...
Local News 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య) గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,...
Read More...
Local News  State News 

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు): సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్...
Read More...
State News 

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.. సికింద్రాబాద్,  డిసెంబర్ 15 (ప్రజా మంటలు):  పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున  వచ్చాయి.   కాగా ప్రవీణ్ రామన్నపేట---...
Read More...
Local News 

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్  తన భార్య  శ్యామలాదేవితో కలిసి పాషం...
Read More...
State News 

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. వి. ప్రకాష్ అనే వ్యక్తి...
Read More...

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు...
Read More...

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి    జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు)  మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిల్కూరి...
Read More...
National  State News  International  

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్ న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ...
Read More...