భగవంతుని ముందు అందరు సమానమే..

On
భగవంతుని ముందు అందరు సమానమే..

జగిత్యాల జిల్లా ప్రతినిధి మార్చి 29(ప్రజా మంటలు):

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజున నిర్వహించిన స్వామి వార్ల రథోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సందర్భంగా విప్ మాట్లాడుతూ..... 

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని,భగవంతుని ముందు అందరూ సమానమే అని, ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నంది విగ్రహం నుండి దేవాలయం వరకు వాహనాలను అనుమతించడం జరగలేదని,వచ్చే భక్తులకు అన్నదాన విషయంలో నాణ్యమైన సన్న బియ్యన్ని వాడటం జరిగిందని,ధర్మపురి నుండి హైదరాబాద్ కి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఎన్నికల కోడ్ అనంతరం బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని,స్వామి వారి కృప ఆశీస్సులు ధర్మపురి ప్రజానికంపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags