ఉచిత రేషన్కు గుడ్బై? నగదు బదిలీ విధానానికి కేంద్రం సిద్ధం
– పైలట్ విజయంతో పూర్తి అమలుకు అడుగులు - వద్దంటున్న మహిళలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా కోట్లాది పేదలకు ఉచిత రేషన్ రూపంలో బియ్యం, గోధుమలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ పథకాన్ని మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంట్లో తాగడానికి బానిసలైన పురుషులు, ఈ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని, పిల్లలకు కనీసం రోజుకో ముద్దైన దొరకదని అంటున్నారు. మహారాష్ట్రలో చాలా మంది మహిళలు డబ్బుకన్నా, రేషన్ వస్తువులే మేలని అంటున్నారు.
ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు రేషన్ తీసుకోకపోవడం, లేదా వాటిని అక్రమంగా విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ కొత్త విధానం ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో వారు తమ అవసరానికి అనుగుణంగా ఆహార ధాన్యాలు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ లభించనుంది.
ప్రభుత్వానికి కోట్ల ₹ అదా
ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం, గోధుమల వదులు తల ₹150/- ఇస్తే ఆడబ్బుతో మార్కెట్ లో బియ్యం కానీ గోధుమలు కానీ రెండు, మూడు కిలోల కంటే ఎక్కువ రావు. కానీ ప్రభుత్వం ఐదు కిలోలు ఇస్తుంది.
సంక్షేమ పథకాలలో కోత
అలాగే ప్రభుత్వం ఒక కిలోపై ₹30-35 మధ్య ఖర్చు చేస్తుంది. రేషన్ వస్తువుల సరఫరా వల్ల ప్రభుత్వానికి రవాణా, డీలర్ కమీషన్, నిర్వహణ ఖర్చులను చేర్చి కిలోపై మరి పది రూపాయల ఖర్చువుతుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలలో ఖర్చు తగ్గించుకోవడానికి ఈ చర్యలు చేపడుతుందని, దీనివల్ల పేదలకు నష్టం కలుగుతుందని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఒకేసారి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయకుండా, ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా & నగర్ హవేలీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నగదు బదిలీ విధానం విజయవంతంగా అమలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఈ అనుభవం ఆధారంగా పూర్తి స్థాయి అమలుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ-రూపీ’ (e-RUPI)
ఈ కార్యక్రమంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ‘ఈ-రూపీ’ (e-RUPI) అనే డిజిటల్ వోచర్ వ్యవస్థను మరింత విస్తరించనుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్కు ప్రతి నెలా డిజిటల్ వోచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వోచర్తో రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు పొందవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం నకిలీ, డుప్లికేట్ రేషన్ కార్డులను తొలగించడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76 వేలకుపైగా డుప్లికేట్ రేషన్ కార్డులను గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది. నగదు బదిలీ అమలుతో బ్లాక్ మార్కెట్, అక్రమ రేషన్ విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తంగా ఈ మార్పు ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరేలా, పారదర్శకమైన రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ను ధ్వంసం చేయడంతో పాటు... జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్
జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య... సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?
న్యూఢిల్లీ మార్చ్ 05:
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత... సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... 