బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి
రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో తక్షణమే అవసరమైన నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, మత్స్యకారులు, స్థానిక నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాజెక్టు సమస్యలపై వివరాలు
మాజీ మంత్రి మాట్లాడుతూ, అరగుండాల ప్రాజెక్టుకు ప్రధాన సమస్య నీటి నిల్వలేనని అన్నారు. రోళ్లవాగు నుంచి రావాల్సిన నీరు, వాగుపై ఉన్న 100కు పైగా మోటార్ల కారణంగా దిగువకు చేరడం కష్టమవుతోందన్నారు. వారం రోజుల క్రితం నీరు తగ్గిపోయి, మళ్లీ ప్రాజెక్టుకు చేరాలంటే కనీసం రెండు రోజుల పాటు నీటి ప్రవాహం అవసరమని తెలిపారు.
ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో, చీఫ్ ఇంజినీర్తో చర్చించి డీ–53 కాలువకు 12 ఎల్ (సుమారు 500 క్యూసెక్కులు) నీటి సరఫరా పెంచేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
అరగుండాల కెనాల్ గేట్ విరిగిపోవడంతో పాటు కాలువల్లో జంగిల్ పెరిగిపోయిందని, రూ.75 వేల అంచనాతో మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్ఆర్జీఈఎస్ (NRGS) ద్వారా కాలువల శుద్ధి సాధ్యం కాకపోవడంతో ప్రత్యేక నిధులు కేటాయించి స్లూయిస్ గేట్ల మరమ్మత్తులు, కాలువల శుభ్రత పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
నీటి నిల్వలు – భవిష్యత్ ప్రణాళిక
గతంలో రోళ్లవాగులో 0.25 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండేదని, దీనిపై అటవీ శాఖ అభ్యంతరం లేదని తెలిపారు. అదనపు నిల్వ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఈ నిల్వతో బీర్పూర్, నరసింహులపల్లి, తుంగూరు, కొల్వాయి, కమ్మునూరు, చెర్లపల్లి, కండ్లపల్లి, మంగేల్, రంగసాగర్ ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశముందని తెలిపారు.
మూడు గేట్లకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చామని, రెండు వారాల్లో అమర్చితే భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తదని తెలిపారు.
మత్స్యకారుల సమస్యలపై స్పందన
గత నాలుగేళ్లుగా చెరువుల్లో నీరు నిల్వ లేకపోవడంతో కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద నష్టపోయిందని, మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ఈ ఏడాది చేప పిల్లలను వదిలి మత్స్య సంపదను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
ఇతర పనులు
కమ్మునూరులో లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగల్ ప్రాంతంలోనూ దొంగతన ఘటనలు జరగడంతో జనవరి 15లోగా నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొల్వాయి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఇసుక పేరుకుపోవడంతో పనులు నిలిచాయని, ప్రస్తుతం లేబర్ అందుబాటులోకి రావడంతో వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
బీర్పూర్ మండలం మొత్తం వ్యవసాయాధారిత ప్రాంతమని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే ఈ పర్యటన చేపట్టామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు, ముఖ్యంగా చెక్రు నాయక్ గారి సూచనలతో సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని తెలిపారు.
రాబోయే రబీ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర... పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)
పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు.
సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో... ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా... అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో... బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి
రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర... తెలంగాణ ఉద్యమకారుల భూమి హక్కుల కోసం భూపోరాటం చేస్తా – కల్వకుంట్ల కవిత
మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి వంటా వార్పులో పాల్గొన్న కవిత
మానకొండూరు/కరీంనగర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానకొండూరులో భూపోరాటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ఉద్యమకారులతో కలిసి వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిసెలో పాలు పొంగించి,... జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎనికైనా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి... బీఆర్ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా
శ్రీ... రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
తెలంగాణ రాష్ర్టంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్,
ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.బుర్ర జ్ఞానేశ్వర్... వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస నగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు... గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు అని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో కాసుగంటి సుధాకర్ రావు సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే డా... 