బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాం బీ.. గుంటూరులోని ఏసీ కాలేజీలో బీఏ చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు.
......
పాత్రికేయుడిగా పలు దినపత్రికల్లో పనిచేశారు.ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలలోను పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఇతని 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు రాశారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాశారు.
......
జర్నలిస్ట్ గా దేవి గారు తన పొలిటికల్ సెటైర్ తో పాటు వర్తమాన రాజకీయ సంఘటనలపై తెలుగు దినపత్రిక ఉదయమ్ లో "రన్నింగ్ కామెంటరీ" అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆ తర్వాత స్థానిక తెలుగు భాషా వార్తా ఛానళ్లలో కూడా ఇదే వ్యాఖ్యానాన్ని అందించారు. వ్యంగ్య కార్టూన్లకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన వార్తాపత్రిక సంపాదకీయాల సంకలనాన్ని అధ్యాక్ష మన్నిచండి గా ప్రచురించారు. ది హిందూ ప్రకారం, ఈ పుస్తకం స్థానిక భాషా పాత్రికేయులు, రచయితలు, రాజకీయ నాయకులకు అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తెలుగు దినపత్రికలైన ఉదయం, ఆంధ్రప్రభ, హైదరాబాద్ మిర్రర్, ఆంగ్ల వార్తాపత్రిక ది హన్స్ ఇండియాలో జర్నలిస్ట్ గా పనిచేశారు.
.....
కవిగా ఆయన తన కవిత్వంలో 'ప్రత్యక్ష, అలంకార' పద్యాల మధ్య చక్కని సమతుల్యతను తీసుకువచ్చారు. ఆయన తన కవిత్వం కోసం ఇతిహాసాలతో సహా భారతీయ పురాణాల నుండి స్వీకరించారు. ఇతని ప్రసిద్ధ రచనలలో గరీబి గీతాలు, అమ్మ చెట్టు చెపా చిలుక ఉన్నాయి.
మా భూమి కోసం "జంబల్ భరి భరి" పాటతో పాటు రాగులుతున్న భారతం, పల్లకి వంటి ఇతర చిత్రాలతో సహా తెలుగు సినిమాలకు గేయ రచయితగా కూడా పనిచేశారు. తన రచనల్లోని ఇతివృత్తాలలో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఒక ప్రముఖ తెలుగు రచయిత, కవి శ్రీశ్రీతో పోల్చారు.
.......
సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు వ్రాశారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు వ్రాశాడు. ప్రజాగాయకుడు గద్దర్ ఆంగ్లంలో పూర్తి నిడివి డాక్యుమెంటరీ ఫిలిం మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్షిప్ పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు.
.....
స్వయంగా 'మనోరమ' వారపత్రిక నడిపారు. 'హైదారాబాద్ మిర్రర్' దినపత్రికకు వ్యవస్థాపక ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. 'హెచ్ఎం టివీ'లో సీనియర్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. 'ఉదయం' దినపత్రిక నాటి 'రన్నింగ్ కామెంట్రీ'ని 'హెచ్ఎంటివీ'లో దృశ్యీకరిించారు.
• దేవిప్రియగా తన రచయిత పేరునే స్థిరపరుచుకున్న అరుదయిన రచయిత....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన 8వ తరగతి పాఠ్యపుస్తకాలు చాలా ఆలస్యంగా విద్యార్థుల చేతుల్లోకి వచ్చాయి. మార్చిన పాఠ్యాంశాలతో వచ్చిన ఈ పుస్తకాలలో తెలుగు పాఠ్య పుస్తకంలో సింగమనేని నారాయణ కథ ‘పయనం’, పైడి తెరేష్ బాబు గజల్ ‘సమదృష్టి’, దేవిప్రియ కవిత ‘చిరమాలిన్యం’ చేర్చడం సంతోషించదగ్గ విషయం. అయితే చిరమాలిన్యం పాఠం శీర్షిక క్రింద కవి పరిచయం దగ్గర షేక్ ఖాజా హుస్సేన్ అని, బ్రాకెట్లో దేవిప్రియ అని ప్రచురించారు. నిజానికి దేవిప్రియ అతని కలం పేరు కాదు. ఖాజా హుస్సేన్ పేరును పూర్తిగా మార్చుకొని ఆయన తన పేరును దేవిప్రియగా స్థిరపరచుకున్నారు. సాధారణంగా కలం పేర్లతో కవిత్వం రాయడం 70, 80ల కాలంలో చాలా విరివిగా కొనసాగింది. అప్పట్లో కలం పేర్లు లేదా తమ పేర్లలోని అక్షరాలను కుదించుకొని రాసుకోవడం అప్పటి కవులు రచయితలు చేసేవారు.
అటువంటి పేర్లే ఆరుద్ర, ఆత్రేయ, కరుణశ్రీ, శ్రీశ్రీ, రావిశాస్త్రి, సినారె, బాపు లాంటివన్ని. అయితే వీరంతా సృజన రంగంలో మాత్రమే వారి పేర్లను మార్చుకొని కలం పేర్లను ఉపయోగించుకున్నారు కానీ వారి వారి అసలు పేర్లతోనే వారి లావాదేవీలన్నీ జరిగేవి. అయితే దేవిప్రియ అలా కాక పూర్తిగా తన పేరునే మార్చుకున్నాడు. తాను పుట్టి పెరిగిన తాడికొండను తన ఇంటిపేరుగా మలుచుకున్నాడు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంకు అకౌంట్ అన్నింటికీ తాడికొండ దేవిప్రియ అనే పేరునే ఉపయోగించుకున్నారు.
ఆయన శ్రీమతి పేరు తాడికొండ రాజ్యలక్ష్మి, కుమారుని పేరు తాడికొండ ఇవసూర్య, కుమార్తె పేరు తాడికొండ సమత. ఖాజా హుస్సేన్ అనే పేరు సృజన రంగంలో దాదాపుగా ఎవరికీ తెలియదు. అతి సమీపంగా మెలిగిన కొంతమంది మిత్రులకు తప్ప. కుటుంబ సభ్యులు కూడా ఆ పేరును ఎప్పుడో మర్చిపోయారు. దేవిప్రియగా ఉండటమే ఆయన అభిమతం కూడా. ఎవరి అనుమతితో దేవిప్రియ పేరును ఖాజా హుస్సేన్గా ప్రచురించారో తెలియదు. ఆయన ఎప్పుడూ ఎక్కడా తన పేరు ఖాజా హుస్సేన్ అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అటువంటిది పాఠ్యపుస్తకంలో ఆయన పేరును షేక్ ఖాజా హుస్సేన్గా ప్రచురించడం తీవ్ర అభ్యంతరకరం. కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలిగా పేరున్న దేవిప్రియ పరిచయం పాఠ్య పుస్తకంలో కేవలం ఆరు లైన్లలో అదీ తప్పులతో ప్రచురించడం శోచనీయం. తదుపరి ప్రచురణలోనైనా ఈ తప్పులను సరిదిద్దుతారని ఆశిస్తున్నాను.
-
......
దేవిప్రియ రచనలు: అమ్మచెట్టు (1979), సమాజానందస్వామి (1977), గరీబు గీతాలు (1992), నీటిపుట్ట (1990), తుఫాను తుమ్మెద (1999), రన్నింగ్ కామెంటరీ (3 సంపుటాలు) (2013), అరణ్య పురాణం, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (2001), చేపచిలుక (2005), అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు) (2010), గాలిరంగు (2011), గంధకుటి (2009), ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం), Poornamma the golden doll (అనువాదం), The Cobra Dancer (కేజే రావు జీవితకథ)
• పురస్కారాలు.....
1) 1980లో అమ్మచెట్టు కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
2) 1991లో నీటిపుట్ట కవితాసంకలనానికి సినారె కవితాపురస్కారం (కరీంనగర్)
3) 2001లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.
4) తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013, 13 జూలై 2016 (గాలిరంగు పుస్తకానికి)
5) 2017 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.
• మరణం....
ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్రికేయుడిగా, కవిగా సేవలందించిన దేవిప్రియ కొంత కాలంగా మధుమేహంతో బాధపడుతూ 2020, నవంబరు 21వ తేదీన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు):
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత
మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి... హైదరాబాద్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐ క్యాంపస్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్... వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు.
మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య
.... కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... 