అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు
గాంధీలో 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ విజయవంతం
కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి గ్రామానికి చెందిన సూర అఖిల్ అనే బాలుడు పుట్టకతోనే రక్తవ్యాధి హెరిడిటరీ స్ఫీరోసైటోసిస్ తో బాధపడుతున్నాడు. మూడు నెలల వయసు నుంచే వ్యాధి లక్షణాలు కనిపించాయి.
ప్లీహము పెరగడం, జాండీస్, తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ ప్రతి వారం రక్త మార్పిడి అవసరమయ్యేది. ల్యాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స. రక్తస్రావం ప్రమాదం ఎక్కువగా ఉండడం, ఓపెన్ సర్జరీకి మార్చాల్సిన పరిస్థితులు రావడం, ఖర్చులు అధికం కావడం వంటి కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఇది అరుదుగానే చేస్తారు.
పలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకపోవడం, ఖర్చు అధికంగా అవుతుండటంతో తండ్రి రవి గాంధీ ఆసుపత్రికి తన కుమారుడిని తీసుకువచ్చి, అడ్మిట్ చేయించారు. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యులు ఈ శస్త్రచికిత్సను పూర్తిగా ఉచితంగా విజయవంతంగా పూర్తి చేశారు.క్లిష్టమైన ఓపెన్ సర్జరీ కాకుండా, ల్యాపరోస్కోపిక్ విధానంలో కడుపుకు నాలుగు చోట్ల రంద్రాలు చేసి, అందులోనుంచి ప్లీహాన్ని చిన్న,చిన్న ముక్కలుగా చేసి, బయటకు తీశారు. భవిష్యత్ లో ప్లీహాం లేని కారణంగా వ్యాధి నిరోదక శక్తి సన్నగిల్లకుండా, వ్యాక్సిన్ లు వేశారు.
ఈనెల 6న సర్జరీ విజయవంతంగా చేశారు. శస్త్రచికిత్సలో డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ పవన్ రావు,డాక్టర్ అశ్రిత్ రెడ్డి, డాక్టర్ హర్ష, డాక్టర్ సాజిద్ పాల్గొన్నారు. అనస్తీషియా విభాగం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ అవుల మురళి, డాక్టర్ బబిత కీలక సహకారం అందించారు.శస్త్రచికిత్స విజయవంతానికి ఆపరేషన్ ధియేటర్ సిబ్బంది సిస్టర్ అరుణ, వార్డు సిబ్బంది సిస్టర్ సువర్ణ సహకరించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సంబంధిత వైద్యులను అభినందించారు. దాదాపు ప్రైవేట్,కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ.10లక్షలకు పైగా ఖర్చు అయ్యే ఈ సర్జరీని గాంధీ లో ఉచితంగా చేశామని, కోలుకున్న బాలుడు అఖిల్ ను ఈ రోజు డిశ్చార్జీ చేస్తున్నట్లు తెలిపారు. 
ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ….ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. పేద, వెనుకబడిన పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తున్నాం" అని తెలిపారు. వైద్య రంగానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా లు ప్రత్యేక చొరవ తీసుకుంటూ, వైద్య రంగం బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు.తమ కుమారుడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసి, కాపాడిన గాంధీ డాక్టర్లకు తండ్రి రవి కృతజ్ఞతలు తెలిపారు. డబ్బులు లేని తమలాంటి వారికి గాంధీ ఆసుపత్రి గొప్ప వరమని అన్నారు.
కార్యక్రమంలో పీడియాట్రిక్ ప్రొఫెసర్ డా.జార్జ్,ఆర్ఎంవో లు డా.శేషాద్రి, డా.కళ్యాణ చక్రవర్తి,డా.యోగేందర్,సిబ్బంది పాల్గొన్నారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... దళిత యువకుడి కస్టోడియల్ డెత్పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
సుర్యాపేటలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు కస్టడీలో జరిగిన అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత ఈ ఘటనపై స్పందిస్తూ,“దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా... అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు
కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి... గవర్నర్–రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు: నిజంగా వారి అధికారాలు తగ్గాయా?
– సమగ్ర విశ్లేషణ
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము, రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు గడువు విధించే ప్రశ్నలను సుప్రీంకోర్టుకు రిఫర్ చేయగా, ఈ విషయం రాజ్యాంగ పరంగా కీలక చర్చకు దారితీసింది. ఈ రిఫరెన్స్పై గురువారం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.... బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి....
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బి ఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి లేదా పార్టీకి రాజీనామా చేయాలనిజగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులుకల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జగిత్యాల జిల్లా... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు జిల్లా కలెక్టర్
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.... గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలోనే అత్యధిక... శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు... రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూ ఢిల్లీ నవంబర్ 20:
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గవర్నర్లు కారణం... 