“మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)
భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .
అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల సమాఖ్య మరియు మెప్మా సభ్యులతో ,డిప్యూటి సిఎం మల్లు బట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు మరియు అధికారులతో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది .
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
ఆడబిడ్డలకు పుట్టింటివారు సారె ,చీర పెట్టడం మన తెలంగాణ సంప్రదాయం .
తెలంగాణ ప్రజా ప్రభుత్వం దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108 వ జయంతి సందర్భంగా అర్హులైన ప్రతి మహిళకు సారె పెట్టడంలో భాగంగా మన ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఇప్పటి వరకు మహిళా సంఘ సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల వారికి సరైన గుర్తింపు లభించలేదు , ప్రజా ప్రభుత్వం మహిళల పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని మహిళలకు తగు గుర్తింపు, గౌరవం వచ్చే విధంగా ఈ కార్యక్రమమ చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లా ,మండల కేంద్రాల్లో పండగ వాతావరణంలో జరుపుకోవాలని దీనికి స్థానిక శాసన సభ్యులను మరియు స్థానిక ప్రజా ప్రతినిధులందరిని పిలవాలని
తెలిపారు .
మండల సమాఖ్య ఆద్వర్యంలో "మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి " పేరు తో
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను నిర్వహించుకోవాలన్నారు.
మన ప్రజా ప్రభుత్వం మహిళల కోసం ఇప్పటి వరకు 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందన్నారు.
IKP ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 80 కోట్లు ఆదాయం పొందడం జరిగిందనీ తెలిపారు.
2034 వరకు ప్రతి మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడం వల్ల వారి కుటుంబం బాగు పడుతుందని తెలిపారు.
తగిన కార్యాచరణ రూపొందించి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ని
ర్వహించాలని తెలిపారు.
మెప్మా మహిళలు 35 లక్షలు వచ్చే ఏడాది మార్చి 1-8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ చేయాలని కోరారు.
భవిష్యత్తులో మహిళల కోసం అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం నాందిగా ఉండాలని ఆకాంక్షించారు .
ఈ సంధర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ
మహిళలందరు సరైన గుర్తింపు, గౌరవం పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉంది.
SHG మహిళలే కాకుండా రేషన్ కార్డు దారులు మరియు అర్హులైన మహిళలందరికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
మన ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దఎత్తున వడ్డీ లేని ఋణాలు అందించడం జరుగుతుంది.
అలాగే వడ్డీ మాఫీ చేయడం కూడా జరిగింది.
దీని పైన గ్రామాల్లో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున
అవగాహన కల్పించాలి.
ప్రభుత్వం మహిళలకు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ , అదనపు కలెక్టర్లు బి ఎస్ లత, రాజ గౌడ్, డి ఆర్ డి ఓ రఘువరన్, డిపిఓ రేవంత్, ఏపిడి సునీత, ఏవో మెప్మా శ్రీనివాస్, జిల్లా సమాఖ్య , మండల సమాఖ్య సభ్యులు , వివిధ స్థాయిల అధికారులు , డి ఆర్ డి ఏ,మెప్మా సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ జగిత్యాల ఆద్వర్యం లో ఫారన్ క్లినిక్ ను ఫ్యామిలీ హెల్త్ కేర్ ను ప్రారంభించిన తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి సొసైటీ సేవ... ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్
జగిత్యాల (రూరల్), నవంబర్ 19 (ప్రజా మంటలు):
జమాత్ ఏ ఇస్లామీ హింద్ – జగిత్యాల విభాగం ఆద్వర్యంలో ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫారన్ ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్, జగిత్యాల... బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్కు ఎన్నిక
20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం
పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు):
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్... సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్!
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ నగరంలోని సింగరేణి భవన్ను ముట్టడించారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలు, హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు... “మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .
అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల... దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల నవంబర్ 19(ప్రజా మంటలు)దేశ సమగ్రత కోసం,పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిర చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు.ఎమ్మేల్యే మాట్లాడుతూదేశ... శ్రీ సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి ప్రధాని విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి
పుట్టపర్తి నవంబర్ 19 ( ప్రజా మంటలు)శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.. FCI Ap Director వనగొందివిజయలక్ష్మిబీజేపీ పార్టీ లో కష్టపడి... అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం
మహబూబ్నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది.
ఎంతో కష్టాల్లో కుటుంబం
ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్... లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్జీని ఏపీ ఎన్కౌంటర్లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ... ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం
బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన
(సిహెచ్.వి. ప్రభాకర్ రావు)
బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు... పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు
యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు
సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల
వివరాలు... 