కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, టీచర్ల కొరత, ఆడబిడ్డల విద్య, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, విలువల పై ఆధారిత విద్య—అన్నీ చర్చకు వచ్చాయి.
సమావేశాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించి, విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఏర్పడిన సమయంలో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండేదని,బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగంలో స్పష్టమైన చర్యలు తీసుకోలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
కవిత రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభిస్తూ,విద్యా కమిషన్ ఏర్పాటు మంచిదైన నిర్ణయమే అయినప్పటికీ దాని పనితీరులో స్పష్టత లేదన్నారు.
ఆడబిడ్డల విద్యపై తీవ్రమైన వివక్ష ఇంకా కొనసాగుతుందని, బస్సు, వీధి దీపం వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోయినా అమ్మాయిల చదువును ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..
- నిజామాబాద్ ఐటీ టవర్ ఉదాహరణతో మహిళల భద్రత విద్యకు ఎంత కీలకమో చెప్పారు.
- “కమ్యూనిటీ, జెండర్ స్పెసిఫిక్ చర్చ అవసరం” అని స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థను పునరుద్ధరించాలి :పరంజ్యోతి
“టెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్కి రీబర్త్ అవసరం” అని విద్యావేత్త పరంజ్యోతి పేర్కొన్నారు.అంగన్వాడీ నుంచి యూనివర్సిటీ వరకు వ్యవస్థ దెబ్బతిందని అన్నారు.19 వేల టీచర్ల ఖాళీలు ఇప్పటికీ భర్తీ కాకపోవడం ఆందోళనకరమని చెప్పారు.
టీచర్స్కి బోధనేతర పనులు ఎక్కువవుతున్నాయని, 40% సమయమూ బోధనకే కేటాయించలేకపోతున్నారని,రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ వెనుకబడిందని ఆయన అన్నారు.
టీచర్లకు శిక్షణ అవసరం: జాన్ హేమంత్
"పిల్లల మానసిక స్థితిని తెలుసుకొని, విద్యను బోధించాల్సిన అవసరం ఉందని, ఇప్పటి ఉపాధ్యాయుల్లో కొంతమేర ఈ శిక్షణ కొరవడిందని, సంస్థలు కోరితే తను శిక్షణ ఇవ్వడానికి సిద్ధమే అనిమానసికశాస్త్రవేత్త జాన్ హేమంత్ తెలిపారు..
“నెయిబర్హుడ్ స్కూల్ విధానం: వెంకట్ రెడ్డి
రాష్ట్రంలో 60% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదవడం తీవ్రమైన సూచిక, ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకపోవడంతోనే తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు వెళ్తున్నారని విద్యావేత్త వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
37 లక్షల విద్యార్థుల కోసం తల్లిదండ్రులు సంవత్సరానికి 50 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గద్వాల్ గట్టు మండలంలో రవాణా లేక డ్రాప్అవుట్స్ పెరగడం ప్రభుత్వ పుష్అవుట్స్ అని,“నెయిబర్హుడ్ స్కూల్ విధానాన్ని అమలులోకి తేవాలి” అని సూచించారు
కామన్ స్కూల్ విధానం ద్వారా మార్పు :సామాజికవేత్త గిరిజ పైడిమర్రి
మార్కుల ఆధారిత విద్య వల్ల క్రియేటివిటీ చనిపోయిందని, మహిళా విద్యలో వివక్ష ఇంకా ఉందని, కామన్ స్కూల్ విధానం ద్వారా మార్పు సాధ్యమని,విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంపై కవిత నాయకత్వంపై నమ్మకం అని సామాజికవేత్త గిరిజ పైడిమర్రి అన్నారు.
కవిత ప్రోత్సాహం ఎంతో గొప్పది;ఆదివాసీ నాయకుడు కురిసంగ వేణు
కవిత ప్రోత్సాహంతో ఆదివాసీ సమాజంలో మార్పులు వస్తున్నాయని, తొలిసారి విద్యా సమస్యలపై మేధావుల సమావేశం జరుగుతుండటం ఆదివాసీలకు గొప్ప అవకాశమని,“మా సమస్యల పరిష్కారానికి కవిత సంకల్పంతో ఉన్నారు” అని ఆదివాసీ నాయకుడు కురిసంగ వేణు అన్నారు.
కనీస వసతులు, టీచర్లను ఇవ్వాలి : విద్యావేత్త మురళీ గౌడ్
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి క్లాస్కు ప్రత్యేక గది ఉండాలని పాఠశాలల్లో టాయిలెట్స్, గ్రౌండ్స్, ఆరోగ్య సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని.విద్యావేత్త మురళీ గౌడ్ సూచించారు.
ప్రాథమిక విద్యే పునాది కాబట్టి అది పటిష్టంగా ఉండాలని,ప్రీ-ప్రైమరీ విద్య ప్రభుత్వంలో బలహీనంగా ఉందని తెలిపారు.
విలువలతో కూడిన్ విద్యా కావాలి : ప్రొఫెసర్ వంశీధర్
మానవ విలువలు, నైతిక విలువలతో కూడిన విద్య అవసరమని, జపాన్, చైనా వంటి దేశాల్లో సంప్రదాయ విలువల విద్య ఇంకా కొనసాగుతున్నట్లు,ప్రభుత్వానికి దీర్ఘకాలిక విద్యా ప్రణాళిక లేకపోయిందని ప్రొఫెసర్ వంశీధర్ (ఓయూ) విమర్శించారు.
ట్రెస్మా ఛైర్మన్ వి.డి. రాజు
కవిత చేపట్టిన విద్యా సంస్కరణ యజ్ఞం కొనసాగాలని, పూర్తి స్థాయిలో అమలు కావాలని, ప్రభుత్వం విద్యార్థి ఒక్కొక్కరి మీద పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండటానికి తగిన ఫలితాలు రావాలని,ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చే విధానానికి ట్రెస్మా ఛైర్మన్ వి.డి. రాజు మద్దతు తెలిపారు.
ప్రైమరీ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు,రచ్చ మురళి
ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయరని,ఎఫ్ఆర్ఎస్ వంటి విధానాల వల్ల టీచర్ల సమయం వృథా అవుతుందని, .టీచర్లకు బోధనేతర పనులు తగ్గించాలని.ప్రైమరీ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు,రచ్చ మురళి కోరారు.
విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు బడ్జెట్ పెంపు అత్యవసరమని,ఎన్నికలపై ఖర్చు చేసిన ధనం విద్యకు కేటాయిస్తే మంచిదని విద్యార్థి నగేష్ అన్నారు.
కవిత గారి తుదివ్యాఖ్యలు
కవిత సమావేశంలో పది ప్రధాన తీర్మానాలను ప్రకటించారు:
- విలువలతో కూడిన విద్యపై దృష్టి
- విద్యకు 15% లేదా అవసరమైతే అపరిమిత బడ్జెట్
- టెక్నాలజీ వినియోగం విస్తరణ
- టీచర్లు, మిడ్ డే మీల్ స్టాఫ్, మెయింటెనెన్స్ వర్కర్లకు సమయానుసార జీతాలు
- ప్రతి గ్రేడ్కి ఒక టీచర్ – ప్రతి తరగతికి ఒక గది
- ప్రీ-ప్రైమరీ స్కూళ్ల స్థాపన
- ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ
- 20 ఏళ్ల అనుభవం ఉన్న వారికి TET మినహాయింపు
- బోధనేతర పనుల తగ్గింపు, అడ్మిన్ స్టాఫ్ పెంపు
- ఆడబిడ్డలు, ఆదివాసీల కోసం ప్రత్యేక విద్యా విధానం.
సమావేశం ముగింపు సందర్భంగా“ఈ రోజు మొదటి మీటింగ్ మాత్రమే. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే పోరాటం ప్రారంభమైంది” అని కవిత అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మా నిధుల మూలం ‘గురు దక్షిణ’ : RSS చీఫ్.మోహన్ భగవత్
స్వయంసేవకులు తమ అవసరాలను తగ్గించుకుని, స్వచ్ఛందంగా సంస్థకు సహకరిస్తారు : మోహన్ భగవత్
జైపూర్ రాజస్తాన్, నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ జైపూర్లో జరిగిన, వంద సంవత్సరాల RSS సభలో, ఆర్ఎస్ఎస్ ప్రయాణం, సేవా కార్యకర్తల త్యాగం, సంస్థ నిధుల వ్యవస్థపై విశదీకరించారు. సంఘం... తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.
మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి... రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్
పాట్నా నవంబర్ 16:
మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత... రాజ్కోట్లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్లకే ఆలౌట్
రాజ్కోట్, నవంబర్ 16:
రాజ్కోట్లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్. జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన... 2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్
న్యూయార్క్ నవంబర్ 16:
ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది.
హార్లీ-డేవిడ్సన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్స్టర్ 883 ఒకటి. తాజా... కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు... శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము
మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి ఉ.గం. 5.15 ని.ల... సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో... స్పెషల్ లోక్–అదాలత్లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)స్పెషల్ లోక్–అదాలత్ ద్వారా సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20 లక్షల మొత్తం బాధితులకు రీఫండ్
ఈనెల 15 వరకు స్పెషల్ లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న
జిల్లాలో... యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది
సోన్భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16:
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు.
ఘటన ఎలా జరిగింది?
సాక్షులు... 