భారతీయ జీవన విధానమే ప్రపంచానికి ఆదర్శం. ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ సాయి మధుకర్.
జగిత్యాల అక్టోబర్ 5 (ప్రజా మంటలు)
ఎంతో ఉన్నతమైన భారతీయ జీవన విధానమే నేడు ప్రపంచానికి ఆదర్శమని, దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ సాయి మధుకర్ అన్నారు. జగిత్యాల పట్టణం గోవిందుపల్లి బస్తి విజయదశమి ఉత్సవాన్ని ఆదివారం స్థానిక ఎల్ జి గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్,ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బోయిన్ పల్లి శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
ప్రధాన వక్త గా ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ సాయి మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జన్మతః దేశభక్తుడని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే తోటి విద్యార్థులను కూడగట్టుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పనిచేసి పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడని తెలిపారు.
కలకత్తాలో వైద్య విద్యార్థిగా ఉంటూ అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరి బాంబు తయారీలో కూడా శిక్షణ పొందారని తెలిపారు. స్వాతంత్ర సాధన కోసం అటవీ సత్యాగ్రహం లో పాల్గొని జైలుకు వెళ్లారన్నారు. దేశ ప్రజల్లో ఉన్న అనైక్యత కారణంగానే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని, దేశ ప్రజల్లో ఐక్యభావం పెంపొందించడం కోసం ఒక సంస్థ అవసరమని ఉద్దేశంతో 1925 సంవత్సరంలో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని తెలిపారు.
కొద్దిమందితో నాగపూర్ లో ప్రారంభించిన సంస్థ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించిందన్నారు. ప్రతిరోజు శాఖలో ఇచ్చే శిక్షణ కారణంగానే స్వయం సేవకులు వివిధ రంగాలలో దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారన్నారు. ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తనదైన కార్య పద్ధతిలో పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కాలంలో ఎన్నో విజయాలను, సామాజిక మార్పులను సాధించిందన్నారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని భారతదేశం విశ్వ గురువుగా నిలవాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందన్నారు. ఈ క్రమంలో సమాజంలో కొన్ని మార్పులు రావాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుందని, అవే పంచ పరివర్తన్ పేరుతో ప్రజల ముందు ఉంచుతుందన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి సామాజిక సమరసతను సాదించాలని, అన్ని రంగాలలో స్వదేశీ భావాన్ని పెంపొందించి స్వావలంబన తో జీవించాలని కోరారు.
పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మొక్కలు నాటడంతో పాటు సాగునీటి వనరులను పరిరక్షించుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. మనదేశంలో అతి విశిష్టమైన కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పౌర విధులను పాటించడం ద్వారా దేశంలో క్రమశిక్షణాయుత వాతావరణాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ రావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషికి సమాజంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గం
— అధ్యక్షుడిగా రాచకొండ సత్యనారాయణ రావు ఘన విజయం
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో శాంతియుతంగా పూర్తయ్యాయి. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబించారు. సుమారు 78 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, సంఘం... సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించిన కవిత
అప్పంపల్లి, (దేవరకద్ర) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దేవరకద్ర మండలం అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న పోరాట యోధుల స్థూపం వద్ద పూలమాల వేసి, అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ –“ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చిన... తీవ్ర తుఫాన్ ‘మొంథా’ దాడి అంచున ఆంధ్రప్రదేశ్ — రాత్రికి తీరం దాటే అవకాశం
కాకినాడ / విశాఖపట్నం / అక్టోబర్ 28 (ప్రజా మంటలు): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని బెదిరిస్తోంది. కాకినాడకు సుమారు 150 కి.మీ తూర్పు-దక్షిణ దిశలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉండగా, రాత్రి మధ్యరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్య ఏదైనా సమయంలో తీరం దాటే అవకాశం ఉందని... రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం – నివేదికల తయారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్రమైన విశ్లేషణ జరపాలని, ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Paatil) కు పంపిన లేఖలో పేర్కొన్న ‘కాంప్రహెన్సివ్... కరీంనగర్లో విషాదం: క్రిప్టో కరెన్సీ మోసానికి బలైన ప్రభుత్వ వైద్యుడు ఆత్మహత్య
క్రిప్టో కరెన్సీ మోసాలు మరోసారి హెచ్చరికగా నిలుస్తున్నాయి
కరీంనగర్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలో మరోసారి క్రిప్టో కరెన్సీ మోసం ప్రాణాలను బలి తీసుకుంది. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ఎంపీ. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు) వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని జీవితాన్ని... శ్రీగిరి వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విశేష పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్ లోని శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబంధన మహా కుంభభిషేకంలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రాతరారాధన, అర్చన, సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈవో... పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
స్టూడెంట్స్ కు వ్యాసరచన పోటీలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు ):
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుమలగిరి పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పల్లవి మోడల్ స్కూల్, యూఎన్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ ఆంటోనియమ్మ, మహేష్, కరుణాకర్,మనోజ్,... సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారుల సోదాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు.మానేపల్లి జ్యువెలర్స్ లో ఓ బృందంతో ఉదయం నుండి సోదాలు కొనసాగించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న... జగిత్యాల పట్టణ అభివృద్ధికి రూ.140 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రూ. 62.50 కోట్ల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
జగిత్యాల (రూరల్) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ. 62.50 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మంగళవారం... మెడికవర్ ఆసుపత్రుల హృదయ సంరక్షణలో కొత్త మైలురాయి
ప్రతి గుండెకు చికిత్స– ప్రతి జీవితానికి భరోసా
డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి 3000+ హృద్రోగుల విజయవంతమైన చికిత్సలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లోని మెడికవర్ ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి మరో విశిష్ట మైలురాయిని నమోదు చేశారు. గత రెండు దశాబ్దాల్లో 20,000కుపైగా పీటీసీఏ (స్టెంట్) శస్త్రచికిత్సలు విజయవంతంగా... సికింద్రాబాద్లో పవర్గ్రిడ్ సైక్లోథాన్
విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా కార్యక్రమం
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదర్న్ రీజియన్–I ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2025 భాగంగా మంగళవారం నెక్లెస్ రోడ్లో సైక్లోథాన్ నిర్వహించారు. “విజిలెన్స్: అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ” అనే థీమ్తో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28... కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ స్మార్ట్ వార్డుతో రోగులకు ఏఐ సేవలు
డోజీ హెల్త్ టెక్నాలజీతో నూతన వైద్య సంరక్షణ
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేటలో రోగి భద్రత, సేవా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు డోజీ గ్లోబల్ సంస్థతో కలిసి ఆధునిక స్మార్ట్ వార్డ్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“ఐసియు స్థాయి పర్యవేక్షణను... 