ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా
పార్టీ ద్రోహులు హరీశ్, సంతోష్ లు- వారి వల్లే రేపు పార్టీకి నష్టం- కవిత
హరీష్ రావు వల్లే జగ్గారెడ్డి,విజయశాంతి, డా.విజయరామారావు, ఈటెల పార్టీ వీడారు - కవిత
రేవంత్ రెడ్డి తో కుమ్మక్కు - అందుకే వీరిపై కేసులు ఉండవు
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరు? సంతోష్ రావు క్లాస్మెంట్ అందుకే వీటి అవినీతిపై కేసులు లేవు
మహిళా నాయకులు నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ - స్వాగతం
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ, పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తనపై, పార్టీ పెద్దలైన కేసీఆర్, కేటీఆర్ పై హరీష్ రావు, సంతోష్ రావు లు చేసిన కుట్రలను, చేసిన పార్టీ వ్యతిరేక పనులను సవివరంగా వెల్లడించారు.
తీహార్ జైలు నుండి వచ్చిన వెంటనే, గురుకులంలో విద్యార్థి చనిపోతే వెళ్లిన, బనకచర్లపై, బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశా. గత నవవంబర్ నుండి నిన్నటి వరకు 47 నియోజక వర్గాలలో, పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకొంటూ, భవన్ ఇంచార్జీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తో మాట్లాడుతూ, నియోజకవర్గ కార్యకర్తలతో,నాయకులతో కలిసి కార్యక్రమాలు చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాల అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ కు వెళ్లి అక్కడ 103 రోజుల క్రితం నాపై కొంత మంది చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్పినా, వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న నుండి ఫోన్ అందించాను. కానీ ఇప్పటి వరకు స్పందనలేదు. కానీ నా ప్రెస్ మీట్ పై పార్టీ మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం మంచిదే. అదే నేను ఆశించిన ప్రజాస్వామ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని కవితే అన్నారు.
మొన్నటికి మొన్న, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో అంతకాగుతు, సంఖ్యాబలం లేకున్నా, BRS పార్టీ నుండి రెండవ అభ్యర్థిని పెట్టాలని కేసీఆర్ పై వొట్టి కొట్టాడు. నాకు ఒక బీజేపీ ఎమ్మెల్యే పాన్ చేసి ఈ హరీష్ మాతో ఒప్పందం చేసుకొని, BRS నుండి రెండవ అభ్యర్థిని పెడతానంటున్నాడు, మాసయం కోరాడు.దీనికి పెద్దవారు అంగీకరించడా అని అడిగాడు. నేను ఈ విషయంలో నాన్న కు ఫోన్ చేసి చెపితే, ఆయన నో ఒకే అభ్యర్థి అని గట్టిగా చెప్పడంతో, ఆయమ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఇలా ఆయన పార్టీకి చేసిన ద్రోహాలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు.
మీడియా మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట.అందుకే ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు ఒకటి రెండు రోజులలో మాయం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి, హరీష్ కుమ్మక్కు అయిందనే, గురుకులాలకు సరఫరాచేసే పాల కుంభకోణం వార్త మాయం అయింది. ఆయన ఫాం హౌస్ వార్తకూడా అంటే. అదే, రామన్న మీద వచి ఆరోపణలపై విచారణ, మీడియాలో రాద్దాంతాలు. ఇది వారి కుట్రలకు, అవగాహనలు ప్రతీకలని ఆమె అన్నారు.
హరీష్ రావు ఎప్పుడూ కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా, తన ప్రత్యేక గ్రూప్ ఉంచుకున్నారు. ఎన్నికల్లో పార్టీకి తెలియకుండా, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు అదనంగా ఫండింగ్ చేశారు. ఈ డబ్బు ఎక్కడిది? ఇదంతా ఆయన అవినీతి డబ్బులు కావా అని ప్రశ్నించారు.
నేరేళ్ల దళితులపై పోలీసుల దురుసు ప్రవర్తనకు కారణం సంతోష్ రావు, కానీ చెడ్డపేరు రామన్నకు వచ్చిందని అన్నారు.
బ్లూఫిన్ రియాల్టీ సంస్థ కు సంతోష్, పోచంపల్లి బినామీ
మొకిల్లాలో బ్లూఫిన్ రియాల్టీ సంస్థ కు బినామీలు ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గతం ఏమిటో అందరికీ తెలుసు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన పోచంపల్లికి ఇన్నివేల కోట్లు ఎలా వచ్చాయి? వీరంతా సంతోష్ తో కుమ్మక్కై సంపాదించింది కదా? సంతోష్ క్లాస్మెంట్ కాబట్టే పోచంపల్లి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని ఆరోపించారు.
హరీష్ రావు హంపి పార్టీ గురించి, YSR ను కలిసి, పార్టీకి ద్రోహం చేయాలని కొన్న విషయం సీనియర్ పాత్రికేయులందరికీ తెలుసు. అలాగే దుబ్బాక, హుజురాబాద్ ఓడిపోవడానికి ప్రధాన కారణం హరీష్ రావు. సమస్యలు సృష్టించి, పరిష్కరించమని ప్రచారం చేసుకొనే కుట్సిత మనస్తత్వం హరీష్ రావు , పార్టీని కబ్జా పెట్టాలనుకునే ఇలా వ్యవహరిస్తున్నాడని కవిత అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్పాత్లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... 