ఇది బీసీల  ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

On
ఇది బీసీల  ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని  దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ఆగస్ట్ 04:

బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందనీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మేర, 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు నుండి 72గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

ముందుగా అనుకున్నట్లే ఈరోజు ఉదయం 10.30 లకు కవిత, ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో దీక్ష ప్రారంభించారు.

ఈసందర్భంగా అక్కడ చేరిన వేలాదిమంది అభిమానులను, కార్యకర్తలను, బిసి నాయకులను, కుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నాము. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలనీ అన్నారు.

సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు

సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారు.జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల 
ఆత్మగౌరవ పోరాటంIMG_20250804_131608

ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు ఆపెడతామని  కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి.ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం.

బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం,గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాము

ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాము. ఆంధ్రా వాళ్ళ కంటే మీరు పాపం అయ్యారా...?

తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు.తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి 
ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి

రెండు ఏళ్లనుంచి ఊర్లల్లో సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారా.బీసీలకు హక్కులు వచ్చాకే స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి

బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానికసంస్థల ఎన్నికలు జరగలేదు. తమిళనాడు పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యంఅయ్యాయి. తెలంగాణ జాగృతి ఎప్పుడూ శాంతియుతంగానే దీక్షలు చేసింది.72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టినా,హాస్పిటల్ లో పెట్టినా,ఇంటి దగ్గర పెట్టినా అక్కడే దీక్ష చేస్తాను

రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీలు ఏకం కావాలి. 72గంటల నిరాహారదీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత

బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్ష. బీసీల హక్కులు సాధించేవరకు 72గంటల దీక్షను కొనసాగిస్తాను

హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో.. ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తాను.బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించను.బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో సైతం దీక్షకు దిగుతాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల  ఆత్మగౌరవ పోరాటం.గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే 42శాతం రిజర్వేషన్లు సాధిస్తాం*

కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకోచాలని చూస్తుంది.రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్తుంది.

 

బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి

కేంద్రంలో ఉన్న బీజేపీ సంతకాలు పెట్టడం లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేయవద్దు.బీసీలకు హక్కులు వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.

ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాలి

Tags
Join WhatsApp

More News...

Local News 

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్...
Read More...
Comment  State News 

“తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..

 “తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ.. హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్  బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు....
Read More...
State News 

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):     కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బుధవారం...
Read More...
Local News 

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి...
Read More...
Spiritual   State News 

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి...
Read More...
Local News 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.    జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు,  శాసన...
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.   హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వైదిక...
Read More...
Local News 

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి.  ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ    జగిత్యాల మే 10 (ప్రజా మంటలు  ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా...
Read More...
Local News 

ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి

ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి    సారంగపూర్ మీ 10 ( ప్రజా మంటలు)మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టా మరియు పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు దీవెనలు అందరి పైన పైన ఉండాలనీ అన్నింటి కన్న ప్రమాదకరమైన వృత్తి...
Read More...
Local News 

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ మే 10(ప్రజా మంటలు)  మండలము  లచ్చక్క పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  రేణుక ఎల్లమ్మ దయతో పాడి పంటలు ,ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ రక్షణకు అందరూ పాటుపడాలన్నారు. ఇతర...
Read More...
State News 

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు హైదరాబాద్ మే 10 (ప్రజా మంటలు): ఉద్యమకారుల డిమాండ్లకు మద్దతుగా, హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువుఅమలు లేకపోతే ఉద్యమకారులతో కలిసి ఆందోళనకు హెచ్చరిక చేస్తూ,  టి ఆర్ఎస్ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘాల...
Read More...
Local News 

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్    జగిత్యాల మే 8(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.      సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు...
Read More...