గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113) :
గంగోత్రి మే 31 (ప్రజా మంటలు) :
గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితమని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
చార్ ధాం యాత్ర లో భాగంగా గంగోత్రి ని సందర్శించిన సందర్భంగా ఆయన గంగోత్రి విశేషాలను వివరించారు.
గంగోత్రి గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం . ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది.
దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.
హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.
ఉత్తర్ ఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ నుండి దాదాపు నూట పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.
గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించినట్లు చారిత్రక నేపథ్యం
పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో గంగాదేవి ప్రధాన విగ్రహం ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది.
ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు.
ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుందని అన్నారు.పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.
గంగా గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగాను గూర్చి పెక్కు కథలున్నాయని చెప్పారు
పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగాను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగా- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు.
అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగా అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగానే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి 'విష్ణు పాదోద్భవ' అయ్యింది. 'బ్రహ్మ కడిగిన పాదము' అనే అన్నమాచార్య సంకీర్తన తెలుగు వారికి సుపరిచితమేనని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు.
భూలోకానికి గంగ వచ్చిన పురాణకధ :
సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.
వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగాను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాకోసం తపస్సు చేశాడు. గంగా ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను.
కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగాను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగా" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగాను "త్రిపథగ" అంటారు.
భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేసిన ఆలయం ఉంది మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.
గంగోత్రి ఆలయం మే నెలలో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేస్తారు .గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఆరునెలల పాటు మూసి ఉంచే దేవాలయం. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. ఈ యాత్ర లో చెరుకు మహేశ్వర శర్మ పల్లవి తో పాటు మల్లాపూర్ మండలం రాఘవపేట కు చెందిన కల్వకుంట్ల తిరుమల రావు పుష్పాలత వేములవాడ కు చెందిన మందిరం రఘు సుచరిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన వుత్తునూరు కృష్ణమూర్తి లలిత చందుపట్ల నారాయణ లక్ష్మీ పెండ్యాల రాందాసు సుగుణ ఖానాపూర్ కు చెందిన తాండ్ర చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
ఆర్ఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి... శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు)
కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.
శుక్రవారం ధర్మపురి మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ... రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ని ఆహ్వానించారు.
రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ... క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... 