గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.

On
గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113) : 

 

గంగోత్రి మే 31 (ప్రజా మంటలు) : 

గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితమని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.

చార్ ధాం యాత్ర లో భాగంగా గంగోత్రి ని సందర్శించిన సందర్భంగా ఆయన గంగోత్రి విశేషాలను వివరించారు. 

గంగోత్రి గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం . ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది.

దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.

హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.

ఉత్తర్ ఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ నుండి దాదాపు నూట పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.

గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించినట్లు చారిత్రక నేపథ్యం 

పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో గంగాదేవి ప్రధాన విగ్రహం ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది.

ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు.

 ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుందని అన్నారు.పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.

 ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.

గంగా గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగాను గూర్చి పెక్కు కథలున్నాయని చెప్పారు 

 పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగాను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగా- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు.

అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగా అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగానే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి 'విష్ణు పాదోద్భవ' అయ్యింది. 'బ్రహ్మ కడిగిన పాదము' అనే అన్నమాచార్య సంకీర్తన తెలుగు వారికి సుపరిచితమేనని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు.

భూలోకానికి గంగ వచ్చిన పురాణకధ

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.

వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగాను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాకోసం తపస్సు చేశాడు. గంగా ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను.

కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగాను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగా" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగాను "త్రిపథగ" అంటారు.

భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేసిన ఆలయం ఉంది మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.

గంగోత్రి ఆలయం మే నెలలో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేస్తారు .గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఆరునెలల పాటు మూసి ఉంచే దేవాలయం. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. ఈ యాత్ర లో చెరుకు మహేశ్వర శర్మ పల్లవి తో పాటు మల్లాపూర్ మండలం రాఘవపేట కు చెందిన కల్వకుంట్ల తిరుమల రావు పుష్పాలత వేములవాడ కు చెందిన మందిరం రఘు సుచరిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన వుత్తునూరు కృష్ణమూర్తి లలిత చందుపట్ల నారాయణ లక్ష్మీ పెండ్యాల రాందాసు సుగుణ ఖానాపూర్ కు చెందిన తాండ్ర చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Local News 

గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి 

గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి  సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్‌డివిజన్‌సీనియర్‌సూపరింటెండెంట్, ఐపీఓఎస్‌అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్‌ప్రొఫెసర్‌వాణిని సోమవారం కలిసి పోస్టల్‌శాఖ అందిస్తున్న పోస్టల్‌ఖాతాలు, లైఫ్‌ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు. ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్‌శాఖ అని పేర్కొన్నారు....
Read More...
Local News 

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న  ఆవుల సాయవ్వ

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న  ఆవుల సాయవ్వ   ఇందిరమ్మ ఇళ్లు గృహం ప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్,కలెక్టర్ సత్యప్రసాద్ (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 24  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో బెస్తపల్లె వాడలో ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి, సోమవారం గృహప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్...
Read More...
Local News 

గాంధీలో యాంటీ మైక్రోబయల్ పై అవగాహన 

గాంధీలో యాంటీ మైక్రోబయల్ పై అవగాహన  సికింద్రాబాద్,  నవంబర్ 24 (ప్రజా మంటలు):: గాంధీ మెడికల్ కాలేజ్‌, గాంధీ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారం (WAAW) సోమవారంతో  ముగిసింది. నవంబర్‌ 18 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి.   ఈ సందర్భంగా సోమవారం 2024 బ్యాచ్‌ అండర్‌గ్రాడ్యుయేట్లు యాంటిబయాటిక్స్‌ సరైన వినియోగంపై స్కిట్‌...
Read More...
Local News 

రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు

రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు): బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోలాక్పూర్ లో ఓ ఇంటి యజమాని( 6-4-43/1) ప్రధాన రహదారిని ఆక్రమించుకొని ఇంటి ముందు ఇనుప మెట్లను నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం GHMC బేగంపేట డిప్యూటీ కమిషనర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇక్కడున్న నల్ల...
Read More...
Local News 

శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి

శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి అమలా కొండాల్ రెడ్డి దంపతుల సంప్రదాయ అయ్యప్ప పడిపూజ
Read More...

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్ 

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్     జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసిన జగిత్యాల ఎలెక్ట్రికల్ డి ఈ  గా నూతనంగా నియామకం అయిన గంగారామ్ ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి శ్రీరామ్ భిక్షపతి దుమాల రాజ్ కుమార్...
Read More...

సి ఎస్ ఐ చర్చిలో అందించిన వైద్యసేవలు మరువలేనివి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సి ఎస్ ఐ చర్చిలో అందించిన వైద్యసేవలు మరువలేనివి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) సి.ఎస్.ఐ చర్చిలో వైద్య సేవలు మరువలేనివని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అసోసి యేషన్  జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సతీమణి...
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ . బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ .  బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు)ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని...
Read More...

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం జగిత్యాల (రూరల్) నవంబర్ 24 +ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రం, ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన  సమావేశంలో జిల్లా విశ్రాంతి ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం సభ్యులు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని  కలిశారు. కార్యవర్గ నాయకులు శాలువతో పాటు, పుష్పగుచ్ఛాలు అందజేశారు మరియు విశ్రాంతి ఉద్యోగస్తుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో విశ్రాంతి ఉద్యోగస్తుల...
Read More...
Local News 

మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం మల్లనపేటలో గల ప్రసిద్ధ చెందిన  పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా  ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ...
Read More...
National  Local News  State News 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన  ముంబై నవంబర్ 23: భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యారు. గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్ జట్టు ఇలా ఉంది : బ్యాట్స్‌మెన్: రోహిత్‌ శర్మ, యశస్వి...
Read More...

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు): వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శన తర్వాత కవిత...
Read More...