గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113) :
గంగోత్రి మే 31 (ప్రజా మంటలు) :
గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితమని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
చార్ ధాం యాత్ర లో భాగంగా గంగోత్రి ని సందర్శించిన సందర్భంగా ఆయన గంగోత్రి విశేషాలను వివరించారు.
గంగోత్రి గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం . ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది.
దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.
హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.
ఉత్తర్ ఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ నుండి దాదాపు నూట పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.
గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించినట్లు చారిత్రక నేపథ్యం
పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో గంగాదేవి ప్రధాన విగ్రహం ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది.
ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు.
ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుందని అన్నారు.పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.
గంగా గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగాను గూర్చి పెక్కు కథలున్నాయని చెప్పారు
పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగాను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగా- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు.
అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగా అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగానే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి 'విష్ణు పాదోద్భవ' అయ్యింది. 'బ్రహ్మ కడిగిన పాదము' అనే అన్నమాచార్య సంకీర్తన తెలుగు వారికి సుపరిచితమేనని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు.
భూలోకానికి గంగ వచ్చిన పురాణకధ :
సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.
వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగాను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాకోసం తపస్సు చేశాడు. గంగా ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను.
కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగాను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగా" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగాను "త్రిపథగ" అంటారు.
భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేసిన ఆలయం ఉంది మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.
గంగోత్రి ఆలయం మే నెలలో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేస్తారు .గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఆరునెలల పాటు మూసి ఉంచే దేవాలయం. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. ఈ యాత్ర లో చెరుకు మహేశ్వర శర్మ పల్లవి తో పాటు మల్లాపూర్ మండలం రాఘవపేట కు చెందిన కల్వకుంట్ల తిరుమల రావు పుష్పాలత వేములవాడ కు చెందిన మందిరం రఘు సుచరిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన వుత్తునూరు కృష్ణమూర్తి లలిత చందుపట్ల నారాయణ లక్ష్మీ పెండ్యాల రాందాసు సుగుణ ఖానాపూర్ కు చెందిన తాండ్ర చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు
జగిత్యాల జిల్లా – ముఖ్య ఘటనలు (2025)(సంక్షిప్తంగా – తేదీలతో)
🔴 ప్రమాదాలు / దుర్ఘటనలు
జనవరి 6, 2025 – మెట్పల్లి సమీపంలో కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి.
జనవరి 18, 2025 – కోరుట్ల మండలంలో విద్యుత్ షాక్తో రైతు మృతి.
ఫిబ్రవరి 2, 2025 – జగిత్యాల పట్టణంలో అగ్ని... నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్.
సికింద్రాబాద్ డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, అనాధలకు మానవతా కార్యక్రమం నిర్వహించారు. విపరీతమైన చలితో ఇబ్బందులు పడుతున్న ఫుట్పాత్లపై నివసించే నిరాశ్రయుల్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ దుప్పట్ల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ వై.... టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల-వైద్యులు సూద కళ్యాణ్ కుమార్, బిల్డర్&సర్వేయర్ వెయ్య గంగయ్య గార్ల సౌజన్యంతో రూపొందించిన టీ.పీ.టీ.ఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్ లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా
ఈ... #Draft: Add Your Title
తపోవన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ కార్నివల్_ పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, జగిత్యాల 31 (ప్రజా మంటలు)ఇంగ్లీష్ భాష మీద అవగాహన కొరకు ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇంగ్లీష్ కార్నివల్. గ్లోబల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి ? ఎలా నేర్చుకోవాలి అనే అవగాహన కొరకు బుధవారం నాడు... జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ... ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారిగా నియామకమైన సుజాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఉన్నారు. ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన* *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
*జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజామంటలు)
జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు.
డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర... పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)
పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు.
సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో... ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా... అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో... బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి
రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర... 