గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.

On
గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113) : 

 

గంగోత్రి మే 31 (ప్రజా మంటలు) : 

గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితమని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.

చార్ ధాం యాత్ర లో భాగంగా గంగోత్రి ని సందర్శించిన సందర్భంగా ఆయన గంగోత్రి విశేషాలను వివరించారు. 

గంగోత్రి గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం . ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది.

దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.

హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.

ఉత్తర్ ఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ నుండి దాదాపు నూట పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.

గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించినట్లు చారిత్రక నేపథ్యం 

పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో గంగాదేవి ప్రధాన విగ్రహం ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది.

ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు.

 ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుందని అన్నారు.పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.

 ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.

గంగా గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగాను గూర్చి పెక్కు కథలున్నాయని చెప్పారు 

 పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగాను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగా- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు.

అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగా అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగానే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి 'విష్ణు పాదోద్భవ' అయ్యింది. 'బ్రహ్మ కడిగిన పాదము' అనే అన్నమాచార్య సంకీర్తన తెలుగు వారికి సుపరిచితమేనని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు.

భూలోకానికి గంగ వచ్చిన పురాణకధ

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.

వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగాను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాకోసం తపస్సు చేశాడు. గంగా ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను.

కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగాను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగా" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగాను "త్రిపథగ" అంటారు.

భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేసిన ఆలయం ఉంది మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.

గంగోత్రి ఆలయం మే నెలలో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేస్తారు .గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఆరునెలల పాటు మూసి ఉంచే దేవాలయం. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. ఈ యాత్ర లో చెరుకు మహేశ్వర శర్మ పల్లవి తో పాటు మల్లాపూర్ మండలం రాఘవపేట కు చెందిన కల్వకుంట్ల తిరుమల రావు పుష్పాలత వేములవాడ కు చెందిన మందిరం రఘు సుచరిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన వుత్తునూరు కృష్ణమూర్తి లలిత చందుపట్ల నారాయణ లక్ష్మీ పెండ్యాల రాందాసు సుగుణ ఖానాపూర్ కు చెందిన తాండ్ర చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

National  Comment  International  

రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..

 రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు .. ఆడపిల్లలకు ఆరాధ్యదైవం     భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా...
Read More...
National  State News 

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13: జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి...
Read More...
National  Comment 

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత లక్నో డిసెంబర్ 13: ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్‌తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ...
Read More...
National  International  

“యోధుల్లా నిలబడాలి… అమెరికా దౌడ పళ్లను పగలగొట్టాలి”

“యోధుల్లా నిలబడాలి… అమెరికా దౌడ పళ్లను పగలగొట్టాలి” కార్కోస్ (వెనిజులా) డిసెంబర్ 13: అమెరికా నౌకాదళం వెనిజుయేలా తీరంలో ఒక చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, వెనిజుయేలా అధ్యక్షుడు నికోలాస్ మడురో అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక సభలో సైమన్ బొలివార్ ఖడ్గాన్ని పట్టుకుని ప్రసంగించిన మడురో—“యోధుల్లా నిలబడి, అవసరమైతే ఉత్తర అమెరికా సామ్రాజ్యానికి పళ్ళను పగలగొట్టడానికి సిద్ధంగా ఉండాలి”...
Read More...
National  International   Crime 

ఎప్‌స్టైన్ ఫోటోల కొత్త కలెక్షన్‌ విడుదల… వూడీ అలెన్, గేట్స్, క్లింటన్, ట్రంప్ వంటి ప్రముఖుల హాజరు

ఎప్‌స్టైన్ ఫోటోల కొత్త కలెక్షన్‌ విడుదల… వూడీ అలెన్, గేట్స్, క్లింటన్, ట్రంప్ వంటి ప్రముఖుల హాజరు వాషింగ్టన్ డిసెంబర్ 12: అమెరికాలో హౌస్‌ ఓవర్సైట్‌ కమిటీకి లభించిన జెఫ్రీ ఎప్‌స్టైన్ ఫోటోల కొత్త ట్రోవ్‌ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. డెమోక్రాట్లు విడుదల చేసిన ఈ ۱۹ చిత్రాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కనిపించడం మరింత వివాదాస్పదంగా మారింది. 🔻 ఎవరు ఉన్నారు ఈ ఫోటోలలో? మొత్తం దాదాపు తొంభై...
Read More...
Local News  State News 

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్‌పై మహిళా న్యాయవాదుల నిరసన

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్‌పై మహిళా న్యాయవాదుల నిరసన సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):   తెలంగాణ బార్ కౌన్సిల్‌లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. బార్ కౌన్సిల్ ఏర్పాటైన...
Read More...
Local News 

సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం

సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) : గ్రామీణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ములుకనూరు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్‌గా విజయం సాధించిన జాలి ప్రమోద్ రెడ్డితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి...
Read More...
Local News 

సైబర్‌ మోసాలకు ఫుల్‌స్టాప్‌ : వంగరలో సైబర్‌ క్రైమ్‌ అవగాహన కార్యక్రమం

సైబర్‌ మోసాలకు ఫుల్‌స్టాప్‌ : వంగరలో సైబర్‌ క్రైమ్‌ అవగాహన కార్యక్రమం భీమదేవరపల్లి, డిసెంబర్‌ 12 (ప్రజామంటలు) : సైబర్‌ మోసాలకు పూర్తిగా చెక్‌ పెట్టే లక్ష్యంతో భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్‌స్టేషన్‌ అధ్వర్యంలో సైబర్‌ క్రైమ్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంగర ఎంసీఆర్‌బి గోదాం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి. దివ్య మాట్లాడుతూ, ఇటీవలి...
Read More...

ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్      *ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష*జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)రెండవ విడత జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడవ ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.    శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.  అనంతరం ఎన్నికల నిర్వహణ...
Read More...
Local News 

ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  పోలీస్ కవాత్

ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  పోలీస్ కవాత్ (ప్రతినిధి అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు) ధర్మపురి సీఐ రాంనర్సింహ రెడ్డి  ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం జగిత్యాల...
Read More...
Local News 

గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం

గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్..      గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్...
Read More...

కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన

కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్‌కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,...
Read More...