హరిద్వార్ వద్ద అధ్బుతంగా గంగా హారతి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
హరిద్వార్ మే 29 (ప్రజా మంటలు) :
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో గంగాహారతి అంటే గంగా నది కోసం చేసే ప్రార్థన చాలా అధ్బుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుందని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.
చార్ ధామ్ యాత్ర లో భాగంగా హరిద్వార్ సందర్శించిన ఆయన హరిద్వార్ విశేషాలు తెలియజేశారు.
భారతదేశంలో గంగానది పవిత్ర నది. దీనిని దేవతగా పూజిస్తారు. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గంగా హారతి హర్ కి పౌరిలో గంగా సభ నిర్వహిస్తారు.
ఆరతి కోసం ఉదయం మరియు సాయంత్రం సమయం సూర్యాస్తమయం మరియు సూర్యోదయం ప్రకారం ఉంటుందని చెప్పారు గంగా హారతి వేడుకకు ఎటువంటి ప్రవేశ రుసుములు లేదా ఛార్జీలు లేవని అన్నారు.
ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొనేందుకు గంగా నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
గంగానది కి"పంచామృతం" పుష్పాలను సమర్పించేటప్పుడు గంగా లహరి మంత్రాన్ని జపిస్తారు.
గంగా ఆరతి చివరి భాగం గంగా నది కోసం ప్రత్యేక ఆరతి పాట, ఇది యాత్రికులు / సందర్శకులు లౌడ్ స్పీకర్ల ద్వారా వినవచ్చు. ప్రత్యేక రాగి "దియా"తో పాట సమయంలో పండితులు ఆర్తి అర్పిస్తారు. కొన్ని పండుగలు మరియు జూన్ వంటి రద్దీ సీజన్లలో ప్రత్యేకంగా సాయంత్రం వేడుకల సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు. సూర్యాస్తమయ సమయానికి కనీసం ఒక గంట ముందుగా గంగానది తీరానికి చేరుకోవడం వల్ల హారతి దర్శనం బాగా జరుగుతుందని తెలిపారు.
హరిద్వార్ లో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని మహేశ్వర శర్మ వివరించారు.
హరిద్వార్ నుంచి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పురాణం ప్రాముఖ్యత గల చండీ దేవి మానసా దేవి ఆలయాలు ఉన్నాయని తెలిపారు.
చండీ దేవాలయం :
హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై చండీ దేవి ఆలయం నెలకొంది..
ఈ దేవాలయం 1929 లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్ పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆలయంలో ప్రధాన దైవం "చండీ దేవి" యొక్క విగ్రహాన్ని 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు చారిత్రకుల అభిప్రాయం.
ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలుస్తారని స్థానికులు చెప్పారు.
మానసదేవీ దేవాలయం :
హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలుస్తారు
ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించినదని పురాణాలు తెలుపుతున్నాయి. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా హైందవ ధర్మం తెలుపుతుంది "మానస" అనగా భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.
రోప్ వే ద్వారా చండీ దేవి ఆలయం మానస దేవి ఆలయం లకు వెళ్ళవచ్చని ఆయన అన్నారు.
హరిద్వార్ లో దక్ష మహాదేవ్ ఆలయం చూడదగ్గ ప్రదేశం అని అన్నారు వివేకానంద పార్క్ ప్రేమ్ నగర్ ఆశ్రమం గౌ ఘాట్ పరమేశ్వర మహాదేవ్ ఆలయం చూడవచ్చుని అన్నారు.
గంగ హారతికి హాజరవ్వడం నా అదృష్టం అని చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
గంగ హారతి సమయంలో, అక్కడ వాతావరణం చూడదగ్గది, భక్తులు అందరూ ప్రార్థనలు చేశారు.
చుట్టూ గంగామాత స్తోత్రాలతో, మంచి ఆధ్యాత్మిక నెలకొంది. అయితే మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పరిశుభ్రత లోపించడం వల్ల భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఈ యాత్ర లో రాయికల్ వేములవాడ పెద్దపెల్లి కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట ఖానాపూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది. ఆదివారం జగిత్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో ఎస్టీయు తృతీయ కార్యవర్గ... సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)
రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను... ఉప్పుమడుగ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్
రాయికల్, ఆగస్టు 1 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం ఉప్పుమడుగ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. మద్యహ్న భోజనం జ్,, జగిత్యాల,
విద్యార్థుల అభివృద్ధికి నాణ్యమైన విద్య... ఉద్యమాల్లో "యువత" ఎందుకు పాల్గొనరాదు?
*భావ ప్రకటన హక్కు యువతకు లేదా*?(సిరిసిల్ల రాజేంద్ర శర్మ)
*ఉద్యమాల్లో యువత ఎందుకు పాల్గొన రాదని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు ఈ ఉద్యమాలు యువత ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిందే. యువత చదువుకున్న చదువులకు సరిపడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ నిరాశ నిస్పృహలకు లోనై ఉద్యమాలకు శ్రీకారం చుడతారు.
ప్రజాస్వామ్య... జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
జగిత్యాల: జూలై 29 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా బాధిత... నంది మేడారం పంప్హౌస్లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం
కరీంనగర్, జూలై 29 (ప్రజా మంటలు):
కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలుఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్హౌస్లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల... కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలుకొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు):
గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,... పదోన్నతి పొందిన ఎస్.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు
జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి ఎస్.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెంకటేశ్వర్లుకు ఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.... చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి. జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్.
జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని... నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి - కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన... హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 28:
హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం... జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక... 