హరిద్వార్ వద్ద అధ్బుతంగా గంగా హారతి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
హరిద్వార్ మే 29 (ప్రజా మంటలు) :
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో గంగాహారతి అంటే గంగా నది కోసం చేసే ప్రార్థన చాలా అధ్బుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుందని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.
చార్ ధామ్ యాత్ర లో భాగంగా హరిద్వార్ సందర్శించిన ఆయన హరిద్వార్ విశేషాలు తెలియజేశారు.
భారతదేశంలో గంగానది పవిత్ర నది. దీనిని దేవతగా పూజిస్తారు. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గంగా హారతి హర్ కి పౌరిలో గంగా సభ నిర్వహిస్తారు.
ఆరతి కోసం ఉదయం మరియు సాయంత్రం సమయం సూర్యాస్తమయం మరియు సూర్యోదయం ప్రకారం ఉంటుందని చెప్పారు గంగా హారతి వేడుకకు ఎటువంటి ప్రవేశ రుసుములు లేదా ఛార్జీలు లేవని అన్నారు.
ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొనేందుకు గంగా నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
గంగానది కి"పంచామృతం" పుష్పాలను సమర్పించేటప్పుడు గంగా లహరి మంత్రాన్ని జపిస్తారు.
గంగా ఆరతి చివరి భాగం గంగా నది కోసం ప్రత్యేక ఆరతి పాట, ఇది యాత్రికులు / సందర్శకులు లౌడ్ స్పీకర్ల ద్వారా వినవచ్చు. ప్రత్యేక రాగి "దియా"తో పాట సమయంలో పండితులు ఆర్తి అర్పిస్తారు. కొన్ని పండుగలు మరియు జూన్ వంటి రద్దీ సీజన్లలో ప్రత్యేకంగా సాయంత్రం వేడుకల సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు. సూర్యాస్తమయ సమయానికి కనీసం ఒక గంట ముందుగా గంగానది తీరానికి చేరుకోవడం వల్ల హారతి దర్శనం బాగా జరుగుతుందని తెలిపారు.
హరిద్వార్ లో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని మహేశ్వర శర్మ వివరించారు.
హరిద్వార్ నుంచి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పురాణం ప్రాముఖ్యత గల చండీ దేవి మానసా దేవి ఆలయాలు ఉన్నాయని తెలిపారు.
చండీ దేవాలయం :
హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై చండీ దేవి ఆలయం నెలకొంది..
ఈ దేవాలయం 1929 లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్ పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆలయంలో ప్రధాన దైవం "చండీ దేవి" యొక్క విగ్రహాన్ని 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు చారిత్రకుల అభిప్రాయం.
ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలుస్తారని స్థానికులు చెప్పారు.
మానసదేవీ దేవాలయం :
హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలుస్తారు
ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించినదని పురాణాలు తెలుపుతున్నాయి. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా హైందవ ధర్మం తెలుపుతుంది "మానస" అనగా భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.
రోప్ వే ద్వారా చండీ దేవి ఆలయం మానస దేవి ఆలయం లకు వెళ్ళవచ్చని ఆయన అన్నారు.
హరిద్వార్ లో దక్ష మహాదేవ్ ఆలయం చూడదగ్గ ప్రదేశం అని అన్నారు వివేకానంద పార్క్ ప్రేమ్ నగర్ ఆశ్రమం గౌ ఘాట్ పరమేశ్వర మహాదేవ్ ఆలయం చూడవచ్చుని అన్నారు.
గంగ హారతికి హాజరవ్వడం నా అదృష్టం అని చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
గంగ హారతి సమయంలో, అక్కడ వాతావరణం చూడదగ్గది, భక్తులు అందరూ ప్రార్థనలు చేశారు.
చుట్టూ గంగామాత స్తోత్రాలతో, మంచి ఆధ్యాత్మిక నెలకొంది. అయితే మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పరిశుభ్రత లోపించడం వల్ల భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఈ యాత్ర లో రాయికల్ వేములవాడ పెద్దపెల్లి కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట ఖానాపూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు... బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు
*
బీర్పూర్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు)మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు ని ఏకగ్రీవంగా ఏనుకున్న బీర్పూర్ మండల సర్పంచులు,
ప్రధాన కార్యదర్శి గా ఎల్లమట్ల హరీష్ (బీర్పూర్ సర్పంచ్ ), ఉపాధ్యక్షులు 1 గా బోడ సాగర్ (రంగసాగర్ సర్పంచ్ ),... జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ సంఘటన లేకుండా ముగిసిన ఏడాది*
*మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,– డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానం అమలు*
*‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు
జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ... యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో... పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)
పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ... పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో ఇతర మండల అధికారులు.... మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్పై ACB సోదాలు
మహబూబ్నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు... కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్
కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్... ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు
అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్... కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ
కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం):
కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి... న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు
న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి.
నిరసనకారులు పెద్ద ఎత్తున... జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత
హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.
ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్లోని వాహనంలో... 