హరిద్వార్ వద్ద అధ్బుతంగా గంగా హారతి.

On
హరిద్వార్ వద్ద అధ్బుతంగా గంగా హారతి.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

హరిద్వార్ మే 29 (ప్రజా మంటలు) : 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో గంగాహారతి అంటే గంగా నది కోసం చేసే ప్రార్థన చాలా అధ్బుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుందని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.

చార్ ధామ్ యాత్ర లో భాగంగా హరిద్వార్ సందర్శించిన ఆయన హరిద్వార్ విశేషాలు తెలియజేశారు.

భారతదేశంలో గంగానది పవిత్ర నది. దీనిని దేవతగా పూజిస్తారు. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గంగా హారతి హర్ కి పౌరిలో గంగా సభ నిర్వహిస్తారు.

ఆరతి కోసం ఉదయం మరియు సాయంత్రం సమయం సూర్యాస్తమయం మరియు సూర్యోదయం ప్రకారం ఉంటుందని చెప్పారు గంగా హారతి వేడుకకు ఎటువంటి ప్రవేశ రుసుములు లేదా ఛార్జీలు లేవని అన్నారు.

ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొనేందుకు గంగా నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

గంగానది కి"పంచామృతం" పుష్పాలను సమర్పించేటప్పుడు గంగా లహరి మంత్రాన్ని జపిస్తారు.

గంగా ఆరతి చివరి భాగం గంగా నది కోసం ప్రత్యేక ఆరతి పాట, ఇది యాత్రికులు / సందర్శకులు లౌడ్ స్పీకర్ల ద్వారా వినవచ్చు. ప్రత్యేక రాగి "దియా"తో పాట సమయంలో పండితులు ఆర్తి అర్పిస్తారు. కొన్ని పండుగలు మరియు జూన్ వంటి రద్దీ సీజన్లలో ప్రత్యేకంగా సాయంత్రం వేడుకల సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు. సూర్యాస్తమయ సమయానికి కనీసం ఒక గంట ముందుగా గంగానది తీరానికి చేరుకోవడం వల్ల హారతి దర్శనం బాగా జరుగుతుందని తెలిపారు.

హరిద్వార్ లో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని మహేశ్వర శర్మ వివరించారు.

హరిద్వార్ నుంచి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పురాణం ప్రాముఖ్యత గల చండీ దేవి మానసా దేవి ఆలయాలు ఉన్నాయని తెలిపారు.

చండీ దేవాలయం : 

హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై చండీ దేవి ఆలయం నెలకొంది..

ఈ దేవాలయం 1929 లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్ పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆలయంలో ప్రధాన దైవం "చండీ దేవి" యొక్క విగ్రహాన్ని 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు చారిత్రకుల అభిప్రాయం.

ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలుస్తారని స్థానికులు చెప్పారు.

మానసదేవీ దేవాలయం

 హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలుస్తారు 

 ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించినదని పురాణాలు తెలుపుతున్నాయి. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా హైందవ ధర్మం తెలుపుతుంది "మానస" అనగా భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.

రోప్ వే ద్వారా చండీ దేవి ఆలయం మానస దేవి ఆలయం లకు వెళ్ళవచ్చని ఆయన అన్నారు.

హరిద్వార్ లో దక్ష మహాదేవ్ ఆలయం చూడదగ్గ ప్రదేశం అని అన్నారు వివేకానంద పార్క్ ప్రేమ్ నగర్ ఆశ్రమం గౌ ఘాట్ పరమేశ్వర మహాదేవ్ ఆలయం చూడవచ్చుని అన్నారు.

గంగ హారతికి హాజరవ్వడం నా అదృష్టం అని చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.

గంగ హారతి సమయంలో, అక్కడ వాతావరణం చూడదగ్గది, భక్తులు అందరూ ప్రార్థనలు చేశారు.

చుట్టూ గంగామాత స్తోత్రాలతో, మంచి ఆధ్యాత్మిక నెలకొంది. అయితే మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పరిశుభ్రత లోపించడం వల్ల భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ఈ యాత్ర లో రాయికల్ వేములవాడ పెద్దపెల్లి కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట ఖానాపూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి

అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి స్వచ్ఛంద సేవా సంస్థ సాయం మహబూబ్‌నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు): మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది. ఎంతో కష్టాల్లో కుటుంబం ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్...
Read More...
National  Crime  State News 

లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీని ఏపీ ఎన్కౌంటర్‌లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ

లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీని ఏపీ ఎన్కౌంటర్‌లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు): మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ...
Read More...
National  Comment 

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన  (సిహెచ్.వి. ప్రభాకర్ రావు) బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు...
Read More...
National  State News 

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం
Read More...
Local News  Crime  State News 

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో  మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల వివరాలు...
Read More...
National  State News 

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్ “క్రమబద్ధమైన ఆన్‌లైన్‌ వేధింపుల ముఠా పని చేస్తోంది” — మహిళా జర్నలిస్ట్ లు ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీస్ కమిషనర్ — వీడియోలు, లింకులు అందించైనా జర్నలిస్టులు హైదరాబాద్‌ నవంబర్ 18 (ప్రజా మంటలు): మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి....
Read More...
Local News  State News 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి  ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం  రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):   శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన       రాష్ట్ర...
Read More...
Local News 

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు..

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు.. సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు): డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా , నేరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీబయాటిక్ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి  ప్రసంగించారు వివిధ రోగాల ట్రీట్మెంట్ కు...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్ 

శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్  (అంకం భూమయ్య)  గొల్లపల్లి నవంబర్ 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జునస్వామి   దేవాలయం ను జగిత్యాల డిఎస్పి సందర్శించి రాబోయే ఏడువారాల జాతరకు  జాతర ఏర్పాట్ల  పర్యవేక్షించారు ఆయన వెంట ధర్మపురి సిఐ,రామ్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా డిఎస్పి , రఘు చందర్ మాట్లాడుతూ    జాతరకు  తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్ల  ట్రాఫిక్...
Read More...

కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్

కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ   డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి  ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.  మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో...
Read More...

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని   శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము  లో ఘనంగా   శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.   మంగళ వారం  కార్తీక  మాసం  శుక్ల పక్షం త్రయోదశి  ఉ.  సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు...
Read More...

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై  చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. 2016 నుoడి  జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా...
Read More...