హరిద్వార్ వద్ద అధ్బుతంగా గంగా హారతి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
హరిద్వార్ మే 29 (ప్రజా మంటలు) :
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో గంగాహారతి అంటే గంగా నది కోసం చేసే ప్రార్థన చాలా అధ్బుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుందని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.
చార్ ధామ్ యాత్ర లో భాగంగా హరిద్వార్ సందర్శించిన ఆయన హరిద్వార్ విశేషాలు తెలియజేశారు.
భారతదేశంలో గంగానది పవిత్ర నది. దీనిని దేవతగా పూజిస్తారు. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గంగా హారతి హర్ కి పౌరిలో గంగా సభ నిర్వహిస్తారు.
ఆరతి కోసం ఉదయం మరియు సాయంత్రం సమయం సూర్యాస్తమయం మరియు సూర్యోదయం ప్రకారం ఉంటుందని చెప్పారు గంగా హారతి వేడుకకు ఎటువంటి ప్రవేశ రుసుములు లేదా ఛార్జీలు లేవని అన్నారు.
ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొనేందుకు గంగా నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
గంగానది కి"పంచామృతం" పుష్పాలను సమర్పించేటప్పుడు గంగా లహరి మంత్రాన్ని జపిస్తారు.
గంగా ఆరతి చివరి భాగం గంగా నది కోసం ప్రత్యేక ఆరతి పాట, ఇది యాత్రికులు / సందర్శకులు లౌడ్ స్పీకర్ల ద్వారా వినవచ్చు. ప్రత్యేక రాగి "దియా"తో పాట సమయంలో పండితులు ఆర్తి అర్పిస్తారు. కొన్ని పండుగలు మరియు జూన్ వంటి రద్దీ సీజన్లలో ప్రత్యేకంగా సాయంత్రం వేడుకల సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు. సూర్యాస్తమయ సమయానికి కనీసం ఒక గంట ముందుగా గంగానది తీరానికి చేరుకోవడం వల్ల హారతి దర్శనం బాగా జరుగుతుందని తెలిపారు.
హరిద్వార్ లో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని మహేశ్వర శర్మ వివరించారు.
హరిద్వార్ నుంచి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పురాణం ప్రాముఖ్యత గల చండీ దేవి మానసా దేవి ఆలయాలు ఉన్నాయని తెలిపారు.
చండీ దేవాలయం :
హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై చండీ దేవి ఆలయం నెలకొంది..
ఈ దేవాలయం 1929 లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్ పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆలయంలో ప్రధాన దైవం "చండీ దేవి" యొక్క విగ్రహాన్ని 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు చారిత్రకుల అభిప్రాయం.
ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలుస్తారని స్థానికులు చెప్పారు.
మానసదేవీ దేవాలయం :
హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలుస్తారు
ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించినదని పురాణాలు తెలుపుతున్నాయి. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా హైందవ ధర్మం తెలుపుతుంది "మానస" అనగా భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.
రోప్ వే ద్వారా చండీ దేవి ఆలయం మానస దేవి ఆలయం లకు వెళ్ళవచ్చని ఆయన అన్నారు.
హరిద్వార్ లో దక్ష మహాదేవ్ ఆలయం చూడదగ్గ ప్రదేశం అని అన్నారు వివేకానంద పార్క్ ప్రేమ్ నగర్ ఆశ్రమం గౌ ఘాట్ పరమేశ్వర మహాదేవ్ ఆలయం చూడవచ్చుని అన్నారు.
గంగ హారతికి హాజరవ్వడం నా అదృష్టం అని చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
గంగ హారతి సమయంలో, అక్కడ వాతావరణం చూడదగ్గది, భక్తులు అందరూ ప్రార్థనలు చేశారు.
చుట్టూ గంగామాత స్తోత్రాలతో, మంచి ఆధ్యాత్మిక నెలకొంది. అయితే మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పరిశుభ్రత లోపించడం వల్ల భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఈ యాత్ర లో రాయికల్ వేములవాడ పెద్దపెల్లి కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట ఖానాపూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం
అల్లే రమేష్.సిరిసిల్ల :సెల్: 9030391963.
కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు
మునుపటి... వంగర పోలీస్ స్టేషన్లో ఏసీపీ వార్షిక తనిఖీలు
స్వాగతం పలికిన ఎస్సై దివ్య పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో మూడో విడత జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు... గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ నేటితో ముగింపు
రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం
కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా... రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం
మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్)
రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా
ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి... Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ
న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్ఫోన్లలో Sanchar Saathi యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి... పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ )
--డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555.
సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో... తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు.
కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం... రేపు హుస్నాబాద్లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ
హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే... గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ
సికింద్రాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు... సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్పోస్ట్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
,
మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా... 