ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ

On


జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)
ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.
ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత కూడా తన ఒడిలోకే తీసుకుంటుందని శ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ అన్నారు

IMG-20260417-WA0083

ధరూర్ క్యాంప్ బస్తీ హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, హిందూ సమ్మేళనం గౌరవాధ్యక్షులు సభాపతి తిగుళ్ల విశ్వనాథ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

IMG-20260416-WA0175

కార్యక్రమంలో భాగంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూఈ భూమిపై జన్మించడం మన పూర్వ పుణ్య సుకృతం అని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేవతలే నిర్మించిన స్థానము హిందుస్థానమని ఇక్కడ పుట్టిన వారు హిందువులని ఆయన అన్నారు. 600 సంవత్సరాల క్రితం విగ్రహాలను దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు ఆ దృశ్యం చూసిన పది సంవత్సరాల పాప విలవిలలాడిందని అలాంటి ఆధ్యాత్మిక భావన ఉన్న దేశం మన దేశం అని అన్నారు.

IMG-20260416-WA0176

ఎందరో ఋషులు మహనీయులు మునులు జన్మించిన మనదేశంలో సంతు నాందేవ్ ఒక్కరు అని ఆయన ఒక రోజు ప్రయాణిస్తున్న సమయంలో ఎండ సమయంలో ఓ చెట్టు కింద ఆగి తన వెంట తెచ్చుకున్న రొట్టెలు తిందామని అనుకున్న సమయంలో అక్కడికి కుక్క వచ్చి ఆ రొట్టెను లాక్కొని వెళ్లిందని సంతు నాందేవ్ అది చూసి బాధపడుతూ అది  వారం రోజుల కింద రొట్టె దానిని నేతిలో ముంచుకొని తినాల్సిందని కానీ కుక్క ఆ ఎండు రొట్టెను తిన్నట్లయితే దానికి నొప్పి కలుగుతుందని భావించి నేతిని తీసుకొని పరిగెత్తారని గుర్తు చేశారు. ఆ కుక్కలోనే భగవంతుని చూసిన వారని అన్నారు. అంతేకాకుండా సంత్ ఏకనాథ్ కాశి లోని గంగా జలాలను 108 కలశాలలో సేకరించి రామేశ్వరంలోని పరమశివుని పూజించడానికి కావడి పై పాదయాత్రగా తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఓ గాడిద దాహం వేస్తూ పడిపోయి ఉండడాన్ని చూసి పరమశివునికి అభిషేకించాల్సిన గంగా నది జలాలను గాడిదకు సమర్పించి గాడిదలో శివుడిని చూసుకున్న మహనీయుడని గుర్తు చేశారు. చెట్టును పుట్టను పూజించడం చీమలకు చక్కరవేయడం మన సంస్కృతి అని గొప్ప సంస్కృతి మన మన సనాతన ధర్మము నుండి వచ్చిందని అన్నారు.

IMG-20260416-WA0174

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న అప్పాల ప్రసాద్ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ రాబోయే శతాబ్దం భారతీయ  శతాబ్దమని అన్నారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసిన ఎన్నో దేశాలతో మన దేశం పడవల్లో వ్యాపారం చేసిందని ఆయా దేశాల సంస్కృతులు అంతరించినప్పటికీ ప్రస్తుతం హిందూ సంస్కృతి మాత్రమే కొనసాగుతున్నదని అన్నారు. కుటుంబం విచ్చిన్నమైతే హిందూ దేశం ప్రపంచంలోనే ఉండదని అన్నారు. హిందూ సమ్మేళనం అనేది ఒక ఉద్యమం 7,50,000 గ్రామాలను కలిపి లక్ష హిందు సమ్మేళనాలు కులాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జైశ్రీరామ్ అని పలికే ఏకైక దేశం భారతదేశమని ఇద్దరు స్త్రీపురుషుల కళ్యాణం ప్రపంచమంతా చూస్తుందని వారే సీతారాములని సీతారాముల కల్యాణాన్ని ప్రపంచంలోని దేశాలన్నీ చూసి పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. ఇండోనేషియా ముస్లిం దేశమైనప్పటికీ అధికారులు తమ కార్యాలయంలో శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు ఉంచుకుంటారని గుర్తు చేశారు. ఒకప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇండోనేషియా వచ్చినప్పుడు ఆంజనేయుని భారీ విగ్రహం చూసి ఇండోనేషియా రాష్ట్రపతిని ఉద్దేశించి మాట్లాడుతూ మనం ముస్లింలము హిందూ దేవుడైన ఆంజనేయుని విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తారని అడగగా ఇండోనేషియా రాష్ట్రపతి జవాబిస్తూ తాము మొదట హిందువులమని తదుపరి మతం మార్చుకున్నామని తాము శ్రీరాముని ఆంజనేయుని మాత్రం మార్చుకోలేదని చెప్పడంతో పాకిస్తాన్ అధ్యక్షుడు వీస్తూ పోయాడు అన్నారు.

 

కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ పాఠశాల డైరెక్టర్ హరిచరణ్ రావు నేతృత్వంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాందిగా సంగనభట్ల నరేందర్ శర్మ దంపతులచే హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం జరిగింది.

 ధరూర్ క్యాంప్ బస్తి హిందూ సమ్మేళన కార్యనిర్వాహణ కమిటీ అధ్యక్షులు విశ్రాంత తాసిల్దార్ రాజ్ మనోహర్ రెడ్డి ఉపన్యాసకురాలు జ్యోత్స్న ,విశేష సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ   జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత  కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి...
Read More...
State News 

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం    ఆవిర్భావ సభ వివరాలు:* 📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి    హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):    తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని...
Read More...
State News 

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత...
Read More...
Local News 

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ   రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ  కొలకనూరి ఇనాక్ ,  జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక...
Read More...
Local News 

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత...
Read More...
Local News 

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ   ఈ...
Read More...
Local News 

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా‌ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు...
Read More...
Local News 

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం         జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటి మైనారిటీ గురుకులం విద్యార్థులను అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీ. బి.రాజ గౌడ్  ఇంటర్ ఫలితాలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. కుమారి. నేల్లెంకుల నందిత అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (ఏం.పి.సి.) వార్షిక పరీక్షల ఫలితాల్లో 470...
Read More...
Local News 

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)"అరైవ్ అలైవ్ " కార్యక్రమంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  ఆదేశాల...
Read More...
National  State News 

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత 

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత  - మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్  బిల్లును కాల్చే ప్రయత్నం హైదరాబాద్, ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): మహిళల రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర...
Read More...
Local News 

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఎమ్మెల్సీ ఎల్ రమణ  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...