తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి
ఒగ్గువనితకు వినమ్ర శ్రద్ధాంజలి పురుషాధిక్య రంగంలో సవారి చేసిన తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి ఇక లేరు
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం
ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి
మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —
పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు అరుదుగా మాత్రమే వినిపిస్తాయి. అలాంటి అరుదైన, అపూర్వమైన ఒగ్గుకళాకారిణి జమ్మ మల్లారి.
ఉగ్గుపాల వయసు నుంచే ఒగ్గుకథల వైపు మొగ్గు చూపిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా పురుష ఆహార్యంలోనే ఆ జానపద కళారూపాన్ని తన జీవితంగా మార్చుకుంది. అయితే కామరతి వంటి ప్రత్యేక కళారూప ప్రదర్శనల్లో మాత్రం స్త్రీమూర్తిగా కనువిందు చేసింది. ఒగ్గుకళకే జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణలో తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణిగా గుర్తింపు పొందిన మహనీయురాలు జమ్మ మల్లారి.
నపీర నాదమై మోగిన కంచుకుతిక – జమ్మ మల్లారి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామం ఆమె జన్మస్థలం. జమ్మ గుండాలు–చెన్నమ్మ దంపతులకు ఏడుగురు ఆడకూతుళ్లు, ముగ్గురు కొడుకులు. వారిలో ఒకరు మల్లారి. తండ్రి గుండాలు స్వయంగా ఒగ్గుకళాకారుడు. దేవుడి లగ్గాలు చేస్తూ, ఒగ్గుకథలు చెప్తూ జీవితం సాగించిన వ్యక్తి.
ఇతర సంతానం అంతగా ఆసక్తి చూపకపోయినా, మల్లారి మాత్రం చిన్ననాటి నుంచే ఒగ్గుకథలపై అపారమైన మక్కువ పెంచుకుంది. తండ్రితో కలిసి దేవుడి లగ్గాలకు, ఒగ్గు ప్రదర్శనలకు వెళ్తూ తాళం కొట్టడం, డోలు వాయించడం, శృతి పట్టడం నేర్చుకుంది. అలా వారసత్వ కళ ఆమె చేతుల్లో నెమ్మదిగా బలపడింది.
పదహారేళ్లకే తొలి ప్రదర్శన
పదహారేళ్ల వయసులోనే తొలిసారి స్వయంగా ఒగ్గుకథ చెప్పింది మల్లారి. ఆ తొలి ప్రదర్శనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా మొదలైన ప్రస్థానం జీవితాంతం ఆగలేదు. బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ వ్యథ — ఏ గాథనైనా అనర్గళంగా, అద్భుతమైన లయ సమన్వయంతో ఆమె కథాగానం చేసేది.
పురుషులే ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో గజ్జె కట్టి, తలపాగా చుట్టి, భుజాన గొంగళి వేసుకొని పురుష ఆహార్యంలోనే వేదికపై నిలబడింది. ఆమె కథ మొదలైతే చాలు… జనాలు పనులన్నీ వదిలిపెట్టి ప్రదర్శన వద్ద మైమరచిపోయేవారు. సొంత ఊరిలో మొదలైన ప్రదర్శనలు క్రమంగా ఇతర గ్రామాలకు, జిల్లాలకు విస్తరించాయి. వేలాది వేదికలపై తెలంగాణ ఒగ్గుకథకు ఆమె అపూర్వమైన ప్రతిష్ఠ తీసుకొచ్చింది.
దేవుడికే అంకితం చేసిన జీవితం
సాధారణ కుటుంబ జీవితం వైపు తిరగలేదు మల్లారి. పద్దెనిమిదో ఏట బీరప్ప స్వామినే భర్తగా స్వీకరించి, తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసింది. ఒగ్గుకథనే తన సంతానంగా భావించి పెంచింది.
తెలంగాణలో ఎక్కడ బీరప్ప కల్యాణం జరిగినా “మల్లారి ఉండాల్సిందే” అన్నంతగా ఆమెకు గుర్తింపు వచ్చింది. వేలాది దేవుడి లగ్గాలు చేయించి భక్తి పరంపరను నిలబెట్టింది.
అనర్గళ గాత్రం… అప్రతిహత నిబద్ధత
చదువుకోలేకపోయినా, తండ్రి చెప్పిన ప్రతి కథను మస్తిష్కంలో చెక్కించుకుంది. గంటల తరబడి సాగే కథలను ఎలాంటి పుస్తకం చూడకుండా వినిపించే అపూర్వ సామర్థ్యం ఆమె సొంతం.
“నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ఒగ్గుకథ చెబుతాను” అని 80 ఏళ్ల వయసులోనూ చెప్పిన ఆమె వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యం సహకరించకపోయినా, కథకు పిలుపు వస్తే శక్తినంతా కూడదీసుకుని వేదికపై నిలబడేది.
తెలంగాణ తర్వాతే దక్కిన గౌరవం
దశాబ్దాలపాటు కళా సేవ చేసినప్పటికీ గుర్తింపు ఆలస్యంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం జానపద కళలకు ప్రోత్సాహం ఇచ్చిన తర్వాతే మల్లారికి తగిన గౌరవం దక్కింది. భాషా సాంస్కృతిక శాఖ అప్పటి సంచాలకులు Dr. Harikrishna Mamidi గారి చొరవతో
2020 మార్చి 8న రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు.
పురస్కారం స్వీకరించినప్పుడు మల్లారి అన్న మాటలు నేటికీ చిరస్మరణీయం:
“ఇది నాకు జరిగిన సన్మానం కాదు… మన ఒగ్గు కళకు జరిగిన గౌరవం.”
శివైక్యం… కానీ శిఖరం శాశ్వతం
07-02-2026 న జమ్మ మల్లారి శివైక్యం చెందడం ఒగ్గు సమాజానికి తీరని లోటు.
అయితే ఆమె గాత్రం, ఆమె వినిపించిన గాథలు, ఆమె నిబద్ధత తెలంగాణ జానపద చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
“నేను బతికున్నంతకాలం ఒగ్గుకథ చెబుతా… ఈ జీవితానికి ఇది సాలు” అని చెప్పిన మల్లారి జీవితం నిజంగా అజరామరం.
తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ బిసి కమీషన్ తొలి మాజీ చైర్మన్ బి ఎస్ రాములు మల్లారి మృతికి సంతాపం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్పాత్లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... 