తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి
ఒగ్గువనితకు వినమ్ర శ్రద్ధాంజలి పురుషాధిక్య రంగంలో సవారి చేసిన తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి ఇక లేరు
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం
ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి
మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —
పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు అరుదుగా మాత్రమే వినిపిస్తాయి. అలాంటి అరుదైన, అపూర్వమైన ఒగ్గుకళాకారిణి జమ్మ మల్లారి.
ఉగ్గుపాల వయసు నుంచే ఒగ్గుకథల వైపు మొగ్గు చూపిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా పురుష ఆహార్యంలోనే ఆ జానపద కళారూపాన్ని తన జీవితంగా మార్చుకుంది. అయితే కామరతి వంటి ప్రత్యేక కళారూప ప్రదర్శనల్లో మాత్రం స్త్రీమూర్తిగా కనువిందు చేసింది. ఒగ్గుకళకే జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణలో తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణిగా గుర్తింపు పొందిన మహనీయురాలు జమ్మ మల్లారి.
నపీర నాదమై మోగిన కంచుకుతిక – జమ్మ మల్లారి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామం ఆమె జన్మస్థలం. జమ్మ గుండాలు–చెన్నమ్మ దంపతులకు ఏడుగురు ఆడకూతుళ్లు, ముగ్గురు కొడుకులు. వారిలో ఒకరు మల్లారి. తండ్రి గుండాలు స్వయంగా ఒగ్గుకళాకారుడు. దేవుడి లగ్గాలు చేస్తూ, ఒగ్గుకథలు చెప్తూ జీవితం సాగించిన వ్యక్తి.
ఇతర సంతానం అంతగా ఆసక్తి చూపకపోయినా, మల్లారి మాత్రం చిన్ననాటి నుంచే ఒగ్గుకథలపై అపారమైన మక్కువ పెంచుకుంది. తండ్రితో కలిసి దేవుడి లగ్గాలకు, ఒగ్గు ప్రదర్శనలకు వెళ్తూ తాళం కొట్టడం, డోలు వాయించడం, శృతి పట్టడం నేర్చుకుంది. అలా వారసత్వ కళ ఆమె చేతుల్లో నెమ్మదిగా బలపడింది.
పదహారేళ్లకే తొలి ప్రదర్శన
పదహారేళ్ల వయసులోనే తొలిసారి స్వయంగా ఒగ్గుకథ చెప్పింది మల్లారి. ఆ తొలి ప్రదర్శనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా మొదలైన ప్రస్థానం జీవితాంతం ఆగలేదు. బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ వ్యథ — ఏ గాథనైనా అనర్గళంగా, అద్భుతమైన లయ సమన్వయంతో ఆమె కథాగానం చేసేది.
పురుషులే ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో గజ్జె కట్టి, తలపాగా చుట్టి, భుజాన గొంగళి వేసుకొని పురుష ఆహార్యంలోనే వేదికపై నిలబడింది. ఆమె కథ మొదలైతే చాలు… జనాలు పనులన్నీ వదిలిపెట్టి ప్రదర్శన వద్ద మైమరచిపోయేవారు. సొంత ఊరిలో మొదలైన ప్రదర్శనలు క్రమంగా ఇతర గ్రామాలకు, జిల్లాలకు విస్తరించాయి. వేలాది వేదికలపై తెలంగాణ ఒగ్గుకథకు ఆమె అపూర్వమైన ప్రతిష్ఠ తీసుకొచ్చింది.
దేవుడికే అంకితం చేసిన జీవితం
సాధారణ కుటుంబ జీవితం వైపు తిరగలేదు మల్లారి. పద్దెనిమిదో ఏట బీరప్ప స్వామినే భర్తగా స్వీకరించి, తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసింది. ఒగ్గుకథనే తన సంతానంగా భావించి పెంచింది.
తెలంగాణలో ఎక్కడ బీరప్ప కల్యాణం జరిగినా “మల్లారి ఉండాల్సిందే” అన్నంతగా ఆమెకు గుర్తింపు వచ్చింది. వేలాది దేవుడి లగ్గాలు చేయించి భక్తి పరంపరను నిలబెట్టింది.
అనర్గళ గాత్రం… అప్రతిహత నిబద్ధత
చదువుకోలేకపోయినా, తండ్రి చెప్పిన ప్రతి కథను మస్తిష్కంలో చెక్కించుకుంది. గంటల తరబడి సాగే కథలను ఎలాంటి పుస్తకం చూడకుండా వినిపించే అపూర్వ సామర్థ్యం ఆమె సొంతం.
“నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ఒగ్గుకథ చెబుతాను” అని 80 ఏళ్ల వయసులోనూ చెప్పిన ఆమె వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యం సహకరించకపోయినా, కథకు పిలుపు వస్తే శక్తినంతా కూడదీసుకుని వేదికపై నిలబడేది.
తెలంగాణ తర్వాతే దక్కిన గౌరవం
దశాబ్దాలపాటు కళా సేవ చేసినప్పటికీ గుర్తింపు ఆలస్యంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం జానపద కళలకు ప్రోత్సాహం ఇచ్చిన తర్వాతే మల్లారికి తగిన గౌరవం దక్కింది. భాషా సాంస్కృతిక శాఖ అప్పటి సంచాలకులు Dr. Harikrishna Mamidi గారి చొరవతో
2020 మార్చి 8న రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు.
పురస్కారం స్వీకరించినప్పుడు మల్లారి అన్న మాటలు నేటికీ చిరస్మరణీయం:
“ఇది నాకు జరిగిన సన్మానం కాదు… మన ఒగ్గు కళకు జరిగిన గౌరవం.”
శివైక్యం… కానీ శిఖరం శాశ్వతం
07-02-2026 న జమ్మ మల్లారి శివైక్యం చెందడం ఒగ్గు సమాజానికి తీరని లోటు.
అయితే ఆమె గాత్రం, ఆమె వినిపించిన గాథలు, ఆమె నిబద్ధత తెలంగాణ జానపద చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
“నేను బతికున్నంతకాలం ఒగ్గుకథ చెబుతా… ఈ జీవితానికి ఇది సాలు” అని చెప్పిన మల్లారి జీవితం నిజంగా అజరామరం.
తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ బిసి కమీషన్ తొలి మాజీ చైర్మన్ బి ఎస్ రాములు మల్లారి మృతికి సంతాపం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం
ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి
మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు... నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కేంద్ర
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు,... విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు?
చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి)::
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న... రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు?
ఉక్రెయిన్ను పక్కన పెట్టి డీల్ చేస్తున్నారని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
అబుదాబిలో విఫలమైన శాంతి చర్చలు
అబుదాబి ఫిబ్రవరి 08:
అబుదాబిలో ఇటీవల నిర్వహించిన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చలు ఎలాంటి స్పష్టమైన ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ చర్చలు విఫలమైన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.... తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు
.
జగిత్యాల ఫిబ్రవరి 7(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన రాయి భీమయ్య (85),రాయి గంగరాజు( 80)అనే వృద్ధ తాత, నానమ్మ లను మనుమడు శివ కుమార్ కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. ... శ్రీ శ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసాం జనేయ, భవాని, శంకర దేవాలయం లో వార్షికోత్సవాల్లో భాగంగా మూడవరోజు పూర్ణాహుతి స్థాపిత దేవత ప్రధాన కలశ ఉద్వాసన మహా అన్నదాన ప్రసాద వితరణ, సాయంత్రం పురవీధులలో స్వామివార్ల శోభాయాత్ర ఘనంగా జరిగింది.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్,... పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 36వ వార్డ్ అభ్యర్థి పుల్ల సుమలత-హరీష్ ,21వ జగ్గుల శిరీష కి మద్దతుగా స్థానిక అన్నపూర్ణ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి... రాయికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో... కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకే ఓటు: కొప్పుల ఈశ్వర్
రామగుండం, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని విస్తృత ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా... రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... సారంగాపూర్ ఫారెస్టులో ఫోక్ సాంగ్ షూటింగ్ సందడి
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం శనివారం రోజంతా ఫోక్ పాట చిత్రీకరణతో కళకళలాడింది. స్థానిక ప్రజల జీవనశైలిని, గ్రామీణ భావోద్వేగాలను ప్రతిబింబించే ‘కడదాకా తోడుంటనే’ అనే ఫోక్ సాంగ్ షూటింగ్ భారీ ఆసక్తి నడుమ సాగింది.
ఈ పాటను బొమ్మరిల్లు ఫోక్స్ యూట్యూబ్ ఛానల్... దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు
మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్లో కలకలం రేగింది.... 